Political News

మోదీజీ టూర్ల కోసం 8458 కోట్ల‌తో రెండు విమానాలు

అన్నింటినీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి లింక్ పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న అభిమానులు ఫీల‌వుతుండ‌వ‌చ్చు కానీ…ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌రుగుతున్న చ‌ర్చ మాత్రం హాట్ టాపిక్‌. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒకటి సరఫరాకు సిద్ధంగా ఉంది.

దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం త్వరలో భారత్‌కు చేరనుంది. అయితే, ఇప్పుడు రావ‌డంపైనే కొత్త చ‌ర్చ‌.

ప్రస్తుతం వీవీఐపీలు వినియోగిస్తున్న బీ 747 జంబో విమానాన్ని రాబోయే ఎయిర్ ఇండియా వ‌న్‌ భర్తీ చేస్తుంది. అమెరికాలో ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానానికి అన్ని పరీక్షలు ముగిశాయి. దీని వినియోగానికి అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఒక టీం అమెరికా బయలు దేరినట్లు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.

మ‌న‌దేశంలోని వీవీఐపీల్లో అత్య‌ధికంగా ప‌ర్య‌ట‌న‌లు చేసేదే ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ అనే సంగ‌తి తెలిసిందే. రాష్ట్రప‌తి త‌క్కువ‌గా ప‌ర్య‌టిస్తుంటారు. ఉప‌రాష్ట్రప‌తి నామ‌మాత్రంగానే. అంటే ఈ ప్ర‌తిష్టాత్మ‌క రెండు విమానాలు ప్ర‌ధానంగా మోదీజీ కోస‌మే వినియోగించ‌బ‌డ‌తాయి.

ఈ రెండు విమానాల‌కు పెట్టిన ఖ‌ర్చు దాదాపు రూ.8458 కోట్లు. గ‌తంలోనే ఈ మేర‌కు ఒప్పందం కుద‌ర‌డం, విమానాలు సిద్ధ‌మైపోయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆ విమానం దేశంలోకి రావ‌డ‌మే విమ‌ర్శ‌కుల‌కు చాన్స్ ఇస్తోంది. ఓ వైపు దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రరూపం దాల్చుతుంటే మోదీజీ టూర్ల కోసం విమానాలు సిద్ధం చేసుకుంటున్నార‌ని ఇప్ప‌టికే మోదీజీ అంటే గిట్ట‌ని వాళ్లు ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు కూడా!

This post was last modified on August 15, 2020 1:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: Modi

Recent Posts

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

28 minutes ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

1 hour ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

2 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

2 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

4 hours ago

టబు పాత్రను హీరో తగ్గించాడా?

బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…

13 hours ago