Political News

మోదీజీ టూర్ల కోసం 8458 కోట్ల‌తో రెండు విమానాలు

అన్నింటినీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి లింక్ పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న అభిమానులు ఫీల‌వుతుండ‌వ‌చ్చు కానీ…ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌రుగుతున్న చ‌ర్చ మాత్రం హాట్ టాపిక్‌. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒకటి సరఫరాకు సిద్ధంగా ఉంది.

దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం త్వరలో భారత్‌కు చేరనుంది. అయితే, ఇప్పుడు రావ‌డంపైనే కొత్త చ‌ర్చ‌.

ప్రస్తుతం వీవీఐపీలు వినియోగిస్తున్న బీ 747 జంబో విమానాన్ని రాబోయే ఎయిర్ ఇండియా వ‌న్‌ భర్తీ చేస్తుంది. అమెరికాలో ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానానికి అన్ని పరీక్షలు ముగిశాయి. దీని వినియోగానికి అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఒక టీం అమెరికా బయలు దేరినట్లు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.

మ‌న‌దేశంలోని వీవీఐపీల్లో అత్య‌ధికంగా ప‌ర్య‌ట‌న‌లు చేసేదే ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ అనే సంగ‌తి తెలిసిందే. రాష్ట్రప‌తి త‌క్కువ‌గా ప‌ర్య‌టిస్తుంటారు. ఉప‌రాష్ట్రప‌తి నామ‌మాత్రంగానే. అంటే ఈ ప్ర‌తిష్టాత్మ‌క రెండు విమానాలు ప్ర‌ధానంగా మోదీజీ కోస‌మే వినియోగించ‌బ‌డ‌తాయి.

ఈ రెండు విమానాల‌కు పెట్టిన ఖ‌ర్చు దాదాపు రూ.8458 కోట్లు. గ‌తంలోనే ఈ మేర‌కు ఒప్పందం కుద‌ర‌డం, విమానాలు సిద్ధ‌మైపోయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆ విమానం దేశంలోకి రావ‌డ‌మే విమ‌ర్శ‌కుల‌కు చాన్స్ ఇస్తోంది. ఓ వైపు దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రరూపం దాల్చుతుంటే మోదీజీ టూర్ల కోసం విమానాలు సిద్ధం చేసుకుంటున్నార‌ని ఇప్ప‌టికే మోదీజీ అంటే గిట్ట‌ని వాళ్లు ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు కూడా!

This post was last modified on August 15, 2020 1:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: Modi

Recent Posts

పరుగు పందెంలో అసలు గండం షురూ

మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…

1 hour ago

గబ్బర్ గర్వం… ఉస్తాద్ వల్ల మాయం

ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…

2 hours ago

సంతోష్ శోభ‌న్… ప‌ర‌లోక యాత్ర‌

ఫ్లాపుల ప‌రంప‌ర‌కు తెర‌దించుతూ.. ఈ ఏడాది క‌పుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సంతోష్ శోభ‌న్.…

4 hours ago

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత…

6 hours ago

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న…

9 hours ago

గొడ‌వ ప‌డ్డ హీరోకు తండ్రి స్థానమిచ్చిన ద‌ర్శ‌కుడు

ఒక‌ప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల శ‌త్రువులుగా…

10 hours ago