Political News

మోదీజీ టూర్ల కోసం 8458 కోట్ల‌తో రెండు విమానాలు

అన్నింటినీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి లింక్ పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న అభిమానులు ఫీల‌వుతుండ‌వ‌చ్చు కానీ…ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌రుగుతున్న చ‌ర్చ మాత్రం హాట్ టాపిక్‌. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒకటి సరఫరాకు సిద్ధంగా ఉంది.

దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం త్వరలో భారత్‌కు చేరనుంది. అయితే, ఇప్పుడు రావ‌డంపైనే కొత్త చ‌ర్చ‌.

ప్రస్తుతం వీవీఐపీలు వినియోగిస్తున్న బీ 747 జంబో విమానాన్ని రాబోయే ఎయిర్ ఇండియా వ‌న్‌ భర్తీ చేస్తుంది. అమెరికాలో ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానానికి అన్ని పరీక్షలు ముగిశాయి. దీని వినియోగానికి అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఒక టీం అమెరికా బయలు దేరినట్లు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.

మ‌న‌దేశంలోని వీవీఐపీల్లో అత్య‌ధికంగా ప‌ర్య‌ట‌న‌లు చేసేదే ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ అనే సంగ‌తి తెలిసిందే. రాష్ట్రప‌తి త‌క్కువ‌గా ప‌ర్య‌టిస్తుంటారు. ఉప‌రాష్ట్రప‌తి నామ‌మాత్రంగానే. అంటే ఈ ప్ర‌తిష్టాత్మ‌క రెండు విమానాలు ప్ర‌ధానంగా మోదీజీ కోస‌మే వినియోగించ‌బ‌డ‌తాయి.

ఈ రెండు విమానాల‌కు పెట్టిన ఖ‌ర్చు దాదాపు రూ.8458 కోట్లు. గ‌తంలోనే ఈ మేర‌కు ఒప్పందం కుద‌ర‌డం, విమానాలు సిద్ధ‌మైపోయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆ విమానం దేశంలోకి రావ‌డ‌మే విమ‌ర్శ‌కుల‌కు చాన్స్ ఇస్తోంది. ఓ వైపు దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రరూపం దాల్చుతుంటే మోదీజీ టూర్ల కోసం విమానాలు సిద్ధం చేసుకుంటున్నార‌ని ఇప్ప‌టికే మోదీజీ అంటే గిట్ట‌ని వాళ్లు ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు కూడా!

This post was last modified on August 15, 2020 1:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: Modi

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

42 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago