Political News

బీజేపీ-జ‌న‌సేన పొత్తు.. జోగయ్య హాట్ కామెంట్స్‌

తాజాగా ఢిల్లీలో జ‌రిగిన‌ ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల భేటీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కావ‌డం, బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని ఆయ‌న చెప్ప‌డం ప‌ట్ల మాజీ పార్ల‌మెంటు స‌భ్యుడు, కాపు సంక్షేమ సంస్థ అధ్య‌క్షుడు చేగొండి హ‌రిరామ జోగ‌య్య హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయ‌న మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో బీజేపీ.. కేవ‌లం జ‌న‌సేనను వాడుకునేందుకు చూస్తోంద‌ని అన్నారు. ప‌వ‌న్ కు ఉన్న చ‌రిష్మాను వాడుకుని ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని బీజేపీ వ్యూహాలు రెడీ చేసింద‌ని చెప్పారు. అంతేకాదు.. ఏపీలో క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి సానుభూతి లేద‌న్నారు.

అంతేకాదు.. ప‌వ‌న్‌తో క‌లిస్తే.. బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్రంలోని పెద్ద‌లు చాలా వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్‌ను ద‌రి చేర్చుకున్నార‌ని జోగ‌య్య వ్యాఖ్యానించారు. ఫ‌లితంగా బీజేపీ-జ‌న‌సేన‌ల ఓటు బ్యాంకు 2 శాతం పెరుగుతుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో విభ‌జ‌న చ‌ట్టానికి కాలం స‌మీపిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ఆ విభ‌జ‌న చ‌ట్టంలోని ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని, అందుకే.. బీజేపీ క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌ప‌డ లేక పోతోంద‌ని.. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌ను చేర్చుకుని బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పారు.

ఏపీలో ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి, వైసీపీ ప్ర‌బుత్వాన్ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించడానికి బీజేపీ నేత‌లు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉన్నాయ‌ని జోగ‌య్య చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేయకపోవడానికి ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణమ‌ని తేల్చిచెప్పారు. “పార్ల‌మెంటులో అవ‌స‌ర‌మైతే.. జ‌గ‌న్ కావ‌లి. ఇక్క‌డ అప్పులు కావాలంటే.. జ‌గ‌న్‌కు మోడీ కావాలి” అని జోగ‌య్య వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. జోగ‌య్య మ‌రిన్ని హాట్ కామెంట్లుకూడా చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి బీజేపీతో జనసేన పొత్తు ఎంతవరకు లబ్ధి చేస్తుందనేది వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాతే తెలుస్తుందని జోగ‌య్య అన్నారు. ఈ రెండు పార్టీల పొత్తుతో బీజేపీకే ఎక్కువ లాభం జరిగనుంది. అలా కాకుండా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అది జ‌న‌సేన‌కు మెరుగైన ఫ‌లితాన్ని ఇస్తుంది. ప‌లునియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ గెలుస్తుందని చెప్పారు. ఒక వేళ ప‌వ‌న్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఐదేళ్ల‌పాటు ముఖ్య‌మంత్రి పీఠం ఆ పార్టీకే ఇస్తే.. స‌రికాద‌ని, కాపులు హ‌ర్ట‌వుతార‌ని కూడా జోగ‌య్య చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

11 minutes ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

22 minutes ago

రావిపూడి కన్ను రాయలసీమపై పడింది

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…

47 minutes ago

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…

3 hours ago

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

4 hours ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

4 hours ago