Political News

సీఐ అంజూ యాదవ్ కు పవన్ షాక్

శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు సాయిని సీఐ అంజూ యాదవ్ చెంపదెబ్బ కొట్టిన సంగతి పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకు సభతో పాటు పలు సందర్భాల్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు ఆయన శ్రీకాళహస్తిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.

శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై చేయి పడిందని, జనసేన నేత పై చేయి పడింది అంటే అది తనపై పడినట్లేనని పవన్ స్పష్టం చేశారు. అందుకే, తిరుపతి వెళుతున్నానని అక్కడే తేల్చుకుంటానని అన్నారు. జనసేనలో ఏ కార్యకర్త పై, నేతపై దాడి జరిగినా అది తనపై జరిగినట్లే భావిస్తానని, తాను అండగా వచ్చి నిలబడతానని అన్నారు.

తన కార్యకర్తలకు ఏమైనా జరిగితే…. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంజూ యాదవ్ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేసి వినతిపత్రం సమర్పించనున్నారు. అంతకుముందు, పవన్ పై జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వారు ప్రయత్నించగా, సీఐ అంజూ యాదవ్ ఆధ్వర్యంలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగానే జనసేన నాయకుడు సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు.

This post was last modified on July 16, 2023 8:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

4 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

7 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

9 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

10 hours ago