శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు సాయిని సీఐ అంజూ యాదవ్ చెంపదెబ్బ కొట్టిన సంగతి పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకు సభతో పాటు పలు సందర్భాల్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు ఆయన శ్రీకాళహస్తిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై చేయి పడిందని, జనసేన నేత పై చేయి పడింది అంటే అది తనపై పడినట్లేనని పవన్ స్పష్టం చేశారు. అందుకే, తిరుపతి వెళుతున్నానని అక్కడే తేల్చుకుంటానని అన్నారు. జనసేనలో ఏ కార్యకర్త పై, నేతపై దాడి జరిగినా అది తనపై జరిగినట్లే భావిస్తానని, తాను అండగా వచ్చి నిలబడతానని అన్నారు.
తన కార్యకర్తలకు ఏమైనా జరిగితే…. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంజూ యాదవ్ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేసి వినతిపత్రం సమర్పించనున్నారు. అంతకుముందు, పవన్ పై జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వారు ప్రయత్నించగా, సీఐ అంజూ యాదవ్ ఆధ్వర్యంలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగానే జనసేన నాయకుడు సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు.
This post was last modified on July 16, 2023 8:26 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…