ఔను.. రాజకీయాల్లో నాయకులు ఇచ్చే నినాదాలకు చాలా వాల్యూ ఉంటుంది. ఇవి ప్రజల్లోకి వెళ్తే.. మైలేజీ పెరుగుతుందని.. తద్వారా తాము గెలుపు గుర్రం ఎక్కుతామని కూడా లెక్కలు వేసుకుంటారు. ఇలానే.. వైసీపీ అదినేత జగన్ గత ఎన్నికలకు ముందు.. అనేక నినాదాలతో ముందుకు సాగారు. ఇక, అధికారం లోకి వచ్చాక కూడా.. కొన్ని నినాదాలు ఇచ్చారు. ప్రజల మధ్యకు తీసుకువెళ్లారు. వీటిలో జగనన్నే మా భవిత– మా నమ్మకం నువ్వే జగన్ వంటివి మచ్చుకు తెలిసిందే.
అయితే.. వీటికన్నా ఎక్కువగా సీఎంజగన్ మరో నినాదం ఇచ్చారు. అదే.. ‘వైనాట్ 175’ ఓ నాలుగు నెలల వెనక్కి వెళ్తే.. ఈ నినాదం పెద్దగా వినిపించింది. వైసీపీ నాయకులు భారీగానే ప్రచారం చేశారు. కానీ, ఎందుకో.. ఇటీవల కాలంలో ఈ నినాదాన్ని.. అటు సీఎం, ఇటు నాయకులు కూడా ఎక్కడా పలకడం లేదు. నిజానికి సీఎం జగన్ ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. కొన్నాళ్ల కిందట వైనాట్ 175 అనేవారు. కానీ, ఇటీవల కాలంలో ఆయన పాల్గొనే సభల్లోనూ ఈ నినాదాన్ని మరిచిపోయారు.
ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపథ్యంలో ఈ నినాదం ఏమైందనే చర్చ వైసీపీలో ఎక్కువగా సాగుతోంది. వైనాట్ 175 నినాదాన్ని వదిలేశారా? అని కొందరు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. దీనిని ప్రస్తుతానికి పక్కన పెట్టారని.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన తర్వాత.. ఇలాంటి నినాదాలు ఇచ్చి.. ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్నారని.. కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే.. మరికొన్నాళ్లపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి.. అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచే అభిప్రాయం. ఉంటే.. ఎన్నికలకు ముందు ఈ నినాదాన్ని మరింత వేగంగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైతే.. ఈ నినాదాన్ని పక్కన పెట్టారనే అంటున్నారు. ఇదిలావుంటే.. వైనాట్ 175 అని వైసీపీ నినదించగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు వైనాట్ పులివెందుల అనే నినాదం తెరమీదికి తెచ్చారు. వైసీపీ నాయకులు వైనాట్ నినాద్ పక్కన పెట్టగానే ఈయన కూడా ఆనినాదాన్ని పక్కన పెట్టడం చిత్రం!
This post was last modified on July 14, 2023 10:43 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…