Political News

‘వైనాట్ 175’ వ‌దిలేయ‌లేదు.. ప‌క్క‌న పెట్టార‌ట‌!

ఔను.. రాజ‌కీయాల్లో నాయ‌కులు ఇచ్చే నినాదాల‌కు చాలా వాల్యూ ఉంటుంది. ఇవి ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. మైలేజీ పెరుగుతుంద‌ని.. త‌ద్వారా తాము గెలుపు గుర్రం ఎక్కుతామ‌ని కూడా లెక్క‌లు వేసుకుంటారు. ఇలానే.. వైసీపీ అదినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. అనేక నినాదాల‌తో ముందుకు సాగారు. ఇక‌, అధికారం లోకి వ‌చ్చాక కూడా.. కొన్ని నినాదాలు ఇచ్చారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లారు. వీటిలో జ‌గ‌న‌న్నే మా భ‌విత‌మా న‌మ్మకం నువ్వే జ‌గ‌న్‌ వంటివి మ‌చ్చుకు తెలిసిందే.

అయితే.. వీటిక‌న్నా ఎక్కువ‌గా సీఎంజ‌గ‌న్ మ‌రో నినాదం ఇచ్చారు. అదే.. ‘వైనాట్ 175’ ఓ నాలుగు నెల‌ల వెన‌క్కి వెళ్తే.. ఈ నినాదం పెద్ద‌గా వినిపించింది. వైసీపీ నాయ‌కులు భారీగానే ప్ర‌చారం చేశారు. కానీ, ఎందుకో.. ఇటీవ‌ల కాలంలో ఈ నినాదాన్ని.. అటు సీఎం, ఇటు నాయ‌కులు కూడా ఎక్క‌డా ప‌ల‌కడం లేదు. నిజానికి సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. కొన్నాళ్ల కింద‌ట వైనాట్ 175 అనేవారు. కానీ, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న పాల్గొనే స‌భ‌ల్లోనూ ఈ నినాదాన్ని మ‌రిచిపోయారు.

ఇప్పుడు ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ నినాదం ఏమైంద‌నే చ‌ర్చ వైసీపీలో ఎక్కువ‌గా సాగుతోంది. వైనాట్ 175 నినాదాన్ని వ‌దిలేశారా? అని కొందరు ఆశ్చ‌ర్యం కూడా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. దీనిని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టార‌ని.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించిన త‌ర్వాత‌.. ఇలాంటి నినాదాలు ఇచ్చి.. ఇబ్బందులు తెచ్చుకోవ‌డం ఎందుక‌ని భావిస్తున్నార‌ని.. కొంద‌రు సీనియ‌ర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే.. మ‌రికొన్నాళ్ల‌పాటు క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించి.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గెలిచే అభిప్రాయం. ఉంటే.. ఎన్నిక‌ల‌కు ముందు ఈ నినాదాన్ని మ‌రింత వేగంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికైతే.. ఈ నినాదాన్ని ప‌క్క‌న పెట్టార‌నే అంటున్నారు. ఇదిలావుంటే.. వైనాట్ 175 అని వైసీపీ నిన‌దించ‌గానే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైనాట్ పులివెందుల అనే నినాదం తెర‌మీదికి తెచ్చారు. వైసీపీ నాయ‌కులు వైనాట్ నినాద్ ప‌క్క‌న పెట్ట‌గానే ఈయ‌న కూడా ఆనినాదాన్ని ప‌క్క‌న పెట్ట‌డం చిత్రం!

This post was last modified on July 14, 2023 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

49 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago