నీతులు చెప్పటం తప్పేం కాదు. కానీ.. పాటించే వాడు చెబితే బాగుంటుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి… మందు తాగి వాగాడు అని వ్యాఖ్యానించి సారీని డిమాండ్ చేసిన వ్యక్తి కాసేపటికి రోడ్డు పక్కన కూర్చుని బహిరంగ మద్య పానం చేసిన సంఘటన వైరల్ అయ్యింది.
కొందరు వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు.. ఆందోళనలు చేపట్టటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం బస్టాండ్ కూడలిలోనూ నిరసన చేశారు. దిష్టి బొమ్మ తగలబెట్టారు. నినాదాలు చేస్తూ.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఇంతవరకు బాగున్న సీన్.. ఆ తర్వాతే తేడా కొట్టేసింది. పవన్ మాటల్ని తప్పు పడుతూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వాలంటీర్లలో కొందరు.. తమ నిరసన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో ఎనిమిది మంది వాలంటీర్లు రెండు ఫుల్ బాటిల్స్ తీసుకొని మద్యం సేవించారు. పవన్ కల్యాణ్ మద్యం తాగి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడిన వారిలో కొందరు.. తమ నిరసన కార్యక్రమాన్ని పూర్తి చేసిన వెంటనే చేసిన పని చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకొని తాగాలని విమర్శించిన వాలంటీర్ ఒకరు.. మందు బాటిల్ లోని మందును కూల్ డ్రింక్ బాటిల్ లో పోసుకుంటూ కెమేరాకు దొరికిపోయిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీతులు చెప్పి నిమిషాలు గడవక ముందే.. ఇలా చేయటమా? అన్నదిప్పుడు ప్రశ్న. నిలదీయటం తప్పు కాదు. కానీ.. ఇలా దొరికిపోవటమే అసలు ఇబ్బందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on July 12, 2023 10:42 am
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…