నీతులు చెప్పటం తప్పేం కాదు. కానీ.. పాటించే వాడు చెబితే బాగుంటుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి… మందు తాగి వాగాడు అని వ్యాఖ్యానించి సారీని డిమాండ్ చేసిన వ్యక్తి కాసేపటికి రోడ్డు పక్కన కూర్చుని బహిరంగ మద్య పానం చేసిన సంఘటన వైరల్ అయ్యింది.
కొందరు వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు.. ఆందోళనలు చేపట్టటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం బస్టాండ్ కూడలిలోనూ నిరసన చేశారు. దిష్టి బొమ్మ తగలబెట్టారు. నినాదాలు చేస్తూ.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఇంతవరకు బాగున్న సీన్.. ఆ తర్వాతే తేడా కొట్టేసింది. పవన్ మాటల్ని తప్పు పడుతూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వాలంటీర్లలో కొందరు.. తమ నిరసన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో ఎనిమిది మంది వాలంటీర్లు రెండు ఫుల్ బాటిల్స్ తీసుకొని మద్యం సేవించారు. పవన్ కల్యాణ్ మద్యం తాగి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడిన వారిలో కొందరు.. తమ నిరసన కార్యక్రమాన్ని పూర్తి చేసిన వెంటనే చేసిన పని చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకొని తాగాలని విమర్శించిన వాలంటీర్ ఒకరు.. మందు బాటిల్ లోని మందును కూల్ డ్రింక్ బాటిల్ లో పోసుకుంటూ కెమేరాకు దొరికిపోయిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీతులు చెప్పి నిమిషాలు గడవక ముందే.. ఇలా చేయటమా? అన్నదిప్పుడు ప్రశ్న. నిలదీయటం తప్పు కాదు. కానీ.. ఇలా దొరికిపోవటమే అసలు ఇబ్బందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on July 12, 2023 10:42 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…