Political News

కేటీఆర్ పట్టాభిషేకం జరగనుందా?

ఏది ఉత్తనే జరగదు. అందునా.. రాజకీయాల్లో జరిగే ప్రతి అంశానికి వెనుక ఒక లెక్క ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. గడిచిన కొద్దిరోజులుగా చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాంహౌస్ లో గడిపే రోజులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో.. మంత్రి కేటీఆర్ తన పరిధిని పెంచుకుంటున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఎవరు అవునన్నా కాదన్నా.. అధికారం కాకున్నా అనధికారికంగా అయినా సరే.. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయం మీద ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఆ మధ్య వరకు కొందరికి కొన్ని సందేహాలు ఉన్నా.. గడిచిన ఏడాదిలో అలాంటివి పూర్తిగా తొలిగిపోయాయి. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ వేళ మొదలుకొని కేసీఆర్ తన పరిధిని అంతకంతకూ తగ్గించుకుంటుంటే.. అందుకు భిన్నంగా కేటీఆర్ మాత్రం తన పరిధిని పెంచుకుంటున్నారు.

రెండు..మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. యథావిధిగా పక్కరోజు అన్న పేపర్లలో ఆ వార్త వచ్చింది. కానీ.. కేబినెట్ తరహాలో మంత్రులంతా హాజరు కావటమే కాదు.. కీలక అధికారులు సైతం హాజరయ్యారు. దీనిపై రగడ మొదలుకాకుండా ఉండటానికి వీలుగా.. కాస్త ఆలస్యంగా ట్విట్టర్ పేజీలో రివ్యూ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి కొన్ని మీడియాల్లోనూ.. చానళ్లలోనూ కేటీఆర్ పట్టాభిషేకమన్న కథనాలు టెలికాస్ట్ కావటం తెలిసిందే.

కేటీఆర్ ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ.. ఈ తరహాలో కేబినెట్ ను కొలువు తీర్చి దానికి కేటీఆర్ లీడ్ చేయటం మాత్రం ఇప్పటివరకు ఏ నేత.. ఏ అధినేత వారసుడు చేసింది లేదు. అందుకు భిన్నంగా కేటీఆర్ భేటీ నిర్వహించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లిన పక్క రోజునే నిర్వహించటం. ఒక కీలకమైన రివ్యూ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటే.. ముందు రోజే పెట్టేసుకోవచ్చు. లేదంటే.. ఆ రివ్యూ అయ్యాక అయినా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లే అవకాశం ఉంది. కానీ.. అలా ఏమీ జరగకుండా కేటీఆర్ నాయకత్వంలో రివ్యూ జరగటం చూస్తే.. పట్టాభిషేకానికి ముందు ట్రయల్ రన్ లా దీన్ని చెప్పక తప్పదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ పట్టాభిషేక కార్యక్రమం ఉండకపోవచ్చనే అంటున్నారు. కాకుంటే.. విపత్తు వేళలోనూ మంత్రి హోదాలో ఉన్న ఆయన ఎంత చురుగ్గా వ్యవహరించారన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటం కోసమే ఇదంతా అన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంతోనే.. అదే పనిగా హైదరాబాద్ తో పాటు.. చుట్టుపక్కల జిల్లాల్లో జరిగే అన్ని డెవలప్ మెంట్ యాక్టివిటీస్ కు హాజరుకావటమేకాదు.. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలకు విరివిగా పాల్గొంటున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు కేటీఆర్ పట్టాభిషేకానికి ముందు.. సన్నదత ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునే ట్రయల్ రన్ లాంటిదే తాజా పరిస్థితి అని చెబుతున్నారు. అందులో నిజమెంతో కాలం మాత్రమే కచ్ఛితంగా చెప్పగలదు.

Satya

Recent Posts

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

26 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

3 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

3 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

3 hours ago

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ…

4 hours ago