Political News

కేటీఆర్ పట్టాభిషేకం జరగనుందా?

ఏది ఉత్తనే జరగదు. అందునా.. రాజకీయాల్లో జరిగే ప్రతి అంశానికి వెనుక ఒక లెక్క ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. గడిచిన కొద్దిరోజులుగా చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాంహౌస్ లో గడిపే రోజులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో.. మంత్రి కేటీఆర్ తన పరిధిని పెంచుకుంటున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఎవరు అవునన్నా కాదన్నా.. అధికారం కాకున్నా అనధికారికంగా అయినా సరే.. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయం మీద ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఆ మధ్య వరకు కొందరికి కొన్ని సందేహాలు ఉన్నా.. గడిచిన ఏడాదిలో అలాంటివి పూర్తిగా తొలిగిపోయాయి. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ వేళ మొదలుకొని కేసీఆర్ తన పరిధిని అంతకంతకూ తగ్గించుకుంటుంటే.. అందుకు భిన్నంగా కేటీఆర్ మాత్రం తన పరిధిని పెంచుకుంటున్నారు.

రెండు..మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. యథావిధిగా పక్కరోజు అన్న పేపర్లలో ఆ వార్త వచ్చింది. కానీ.. కేబినెట్ తరహాలో మంత్రులంతా హాజరు కావటమే కాదు.. కీలక అధికారులు సైతం హాజరయ్యారు. దీనిపై రగడ మొదలుకాకుండా ఉండటానికి వీలుగా.. కాస్త ఆలస్యంగా ట్విట్టర్ పేజీలో రివ్యూ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి కొన్ని మీడియాల్లోనూ.. చానళ్లలోనూ కేటీఆర్ పట్టాభిషేకమన్న కథనాలు టెలికాస్ట్ కావటం తెలిసిందే.

కేటీఆర్ ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ.. ఈ తరహాలో కేబినెట్ ను కొలువు తీర్చి దానికి కేటీఆర్ లీడ్ చేయటం మాత్రం ఇప్పటివరకు ఏ నేత.. ఏ అధినేత వారసుడు చేసింది లేదు. అందుకు భిన్నంగా కేటీఆర్ భేటీ నిర్వహించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లిన పక్క రోజునే నిర్వహించటం. ఒక కీలకమైన రివ్యూ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటే.. ముందు రోజే పెట్టేసుకోవచ్చు. లేదంటే.. ఆ రివ్యూ అయ్యాక అయినా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లే అవకాశం ఉంది. కానీ.. అలా ఏమీ జరగకుండా కేటీఆర్ నాయకత్వంలో రివ్యూ జరగటం చూస్తే.. పట్టాభిషేకానికి ముందు ట్రయల్ రన్ లా దీన్ని చెప్పక తప్పదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ పట్టాభిషేక కార్యక్రమం ఉండకపోవచ్చనే అంటున్నారు. కాకుంటే.. విపత్తు వేళలోనూ మంత్రి హోదాలో ఉన్న ఆయన ఎంత చురుగ్గా వ్యవహరించారన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటం కోసమే ఇదంతా అన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంతోనే.. అదే పనిగా హైదరాబాద్ తో పాటు.. చుట్టుపక్కల జిల్లాల్లో జరిగే అన్ని డెవలప్ మెంట్ యాక్టివిటీస్ కు హాజరుకావటమేకాదు.. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలకు విరివిగా పాల్గొంటున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు కేటీఆర్ పట్టాభిషేకానికి ముందు.. సన్నదత ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునే ట్రయల్ రన్ లాంటిదే తాజా పరిస్థితి అని చెబుతున్నారు. అందులో నిజమెంతో కాలం మాత్రమే కచ్ఛితంగా చెప్పగలదు.

This post was last modified on August 15, 2020 9:40 am

Share
Show comments
Published by
satya
Tags: KTR

Recent Posts

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 mins ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

1 hour ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

2 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

2 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

3 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

4 hours ago