Political News

ఎమ్మెల్యేలు అయిపోయారు.. ఇక‌, ఎంపీల వంతు..!

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల‌పై దృష్టి పెట్టారు. వారిని లైన్‌లో పెట్టే కార్య‌క్ర‌మాల కు ఆయ‌న శ్రీకారం చుట్టారు. వారిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు పంపిస్తున్నారు. అంతేకాదు.. వెళ్ల‌నివారిని హెచ్చ‌రి స్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చేది కూడా లేద‌ని చెబుతున్నారు. ఇక‌, దీంతో ఎమ్మెల్యేలు అంతో ఇంతో లైన్‌లో లేర‌ని భావించిన‌ వారు కూడాలైన్‌లో ప‌డ్డారు. దీంతో ఇప్పుడు సీఎం జ‌గ‌న్ ఎంపీల‌పై దృష్టి పెట్టిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం ఎంపీల విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో 22 మంది ఎంపీలు వైసీపీటికెట్‌పై విజ‌యం ద‌క్కించుకు న్నారు. వీరిలో ఒక‌రు రెబ‌ల్‌గా మారగా.. 21 మంది వైసీపీలోనే ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఎంపీగా పోటీ చేయ‌లేమ‌ని.. న‌లుగురు ఎంపీలు ఇప్ప‌టికే అధిష్టానానికి ముఖ‌తా స‌మాచారం ఇచ్చారు. వీరిలో బీశెట్టి స‌త్య‌వ‌తి, గొట్టేటి మాధ‌వి, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌, వంగా గీత ఉన్నారు. వీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ పార్ల‌మెంటుకు పోటీ చేసేది లేద‌ని తెగేసి చెప్పేశారు.

ఇక‌, అప్ప‌టి నుంచి దాదాపు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంతో సంబంధాలు కూడా ఆ నాయ‌కులు తెంచేసుకు న్నారు. ఇదిలావుంటే.. నాయ‌కుల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. అధిష్టానం అవ‌స‌రం కోసం.. న‌లుగురు ఎంపీల‌ను పార్టీనే అసెంబ్లీకి పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇలాంటి వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఉన్నారు.

అంటే.. మొత్తంగా వారు కోరుకున్నా.. పార్టీ కోరుకున్నా.. 8 మంది ఎంపీల‌కు స్థాన చ‌ల‌నం త‌ప్పేలా క‌నిపించడం లేదు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త‌వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలావుంటే.. మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఓడిపోయిన ద‌రిమిలా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కూ కొత్త‌వారి కోసం వేట సాగుతున్న‌ట్టు స‌మాచారం. వీటిలో ప్ర‌ధానంగా విజ‌యవాడ‌కు సినిమా రంగం నుంచి న‌టుడికి అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు.

ఒక‌వేళ ఎన్నిక‌ల నాటికి విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. ఆయ‌న‌కు అవ‌కాశం ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేవిధంగా శ్రీకాకుళం, గుంటూరు నియోజ‌క‌వ‌ర్గాలపై ఇంకా దృష్టి పెట్ట‌లేదు. దీంతో ఈ నెల 15 నుంచి ఎంపీల తీరుతెన్నులు.. ప‌నితీరు.. స‌హా.. వారి మార్పుల‌పైనా చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. న‌ర‌సారావుపేట నుంచి ఈ సారి బాల‌శౌరిని రంగంలోకి దింపే అవ‌కాశం ఉంద‌ని బ‌లంగా వినిపిస్తోంది.

Satya

Recent Posts

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

34 minutes ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

3 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

3 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

3 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

3 hours ago

ఉత్తరాది బుకింగ్స్ ఎలా ఉన్నాయి

పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…

4 hours ago