వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారు. వారిని లైన్లో పెట్టే కార్యక్రమాల కు ఆయన శ్రీకారం చుట్టారు. వారిని ప్రజల మధ్యకు పంపిస్తున్నారు. అంతేకాదు.. వెళ్లనివారిని హెచ్చరి స్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది కూడా లేదని చెబుతున్నారు. ఇక, దీంతో ఎమ్మెల్యేలు అంతో ఇంతో లైన్లో లేరని భావించిన వారు కూడాలైన్లో పడ్డారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఎంపీలపై దృష్టి పెట్టినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఎంపీల విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో 22 మంది ఎంపీలు వైసీపీటికెట్పై విజయం దక్కించుకు న్నారు. వీరిలో ఒకరు రెబల్గా మారగా.. 21 మంది వైసీపీలోనే ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో తాము ఎంపీగా పోటీ చేయలేమని.. నలుగురు ఎంపీలు ఇప్పటికే అధిష్టానానికి ముఖతా సమాచారం ఇచ్చారు. వీరిలో బీశెట్టి సత్యవతి, గొట్టేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ, వంగా గీత ఉన్నారు. వీరు ఎట్టి పరిస్థితిలోనూ పార్లమెంటుకు పోటీ చేసేది లేదని తెగేసి చెప్పేశారు.
ఇక, అప్పటి నుంచి దాదాపు పార్లమెంటు నియోజకవర్గంతో సంబంధాలు కూడా ఆ నాయకులు తెంచేసుకు న్నారు. ఇదిలావుంటే.. నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా.. అధిష్టానం అవసరం కోసం.. నలుగురు ఎంపీలను పార్టీనే అసెంబ్లీకి పంపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కడప ఎంపీ అవినాష్రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.
అంటే.. మొత్తంగా వారు కోరుకున్నా.. పార్టీ కోరుకున్నా.. 8 మంది ఎంపీలకు స్థాన చలనం తప్పేలా కనిపించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాలకు కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలావుంటే.. మూడు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయిన దరిమిలా.. ఆయా నియోజకవర్గాలకూ కొత్తవారి కోసం వేట సాగుతున్నట్టు సమాచారం. వీటిలో ప్రధానంగా విజయవాడకు సినిమా రంగం నుంచి నటుడికి అవకాశం ఇస్తారని అంటున్నారు.
ఒకవేళ ఎన్నికల నాటికి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. ఆయనకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా శ్రీకాకుళం, గుంటూరు నియోజకవర్గాలపై ఇంకా దృష్టి పెట్టలేదు. దీంతో ఈ నెల 15 నుంచి ఎంపీల తీరుతెన్నులు.. పనితీరు.. సహా.. వారి మార్పులపైనా చర్చసాగుతుండడం గమనార్హం. నరసారావుపేట నుంచి ఈ సారి బాలశౌరిని రంగంలోకి దింపే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది.
This post was last modified on July 11, 2023 2:30 pm
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…