అసెంబ్లీ ఎన్నికలు అత్యంత వేగంగా సమీపిస్తున్నాయి. షెడ్యుల్ ప్రకారం జరిగితే.. 9 నెలలు.. ముందస్తు వస్తే.. నాలుగైదు మాసాలే గడువుంది. దీంతో రాజకీయాలు, రాజకీయ నాయకులు కూడా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా వేదికలను వారు ఎంచుకుంటున్నారు. ఈ వ్యవహ రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం ముందుందని అంటున్నారు పరిశీల కులు.
ఆచంట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ నాయకులు, సీనియర్ నేత.. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉన్నారు. గత 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టి పాదయాత్ర సమయంలో పార్టీలో చేరిన ఆయన ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయన విజయం కూడా సాధించి.. మంత్రి వర్గంలో స్థానం సంపాయించుకున్నారు. అయితే, రెండో దఫా విస్తరణలో ఆయన మంత్రి స్థానాన్ని కోల్పోయారు.
ఇక, నియోజకవర్గం విషయానికి వస్తే.. ఆయన దూకుడు మంత్రిగా ఉన్నప్పుడు బాగానే పని చేసింది కానీ.. ఇప్పుడు లేదనే టాక్ సొంత పార్టీ నేతల్లోనేఎక్కువగా వినిపిస్తోంది. మరోవైపు.. పాలకొల్లు, ఉండి నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల దూకుడు.. ఆచంటపై పరోక్షంగా ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు గ్రాఫ్ పెరుగుతున్నట్టు తమ్ముళ్ల మధ్య గుస గుస వినిపిస్తోంది.
దీంతో వైసీపీలోని మండలస్థాయి నాయకులు.. టీడీపీ చెంతకు చేరుతున్నారు. దీపం ఉండగానే అన్నట్టుగా.. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆచంట నియోజకవర్గంలో పితాని గతంలోనూ గెలిచి ఉండడం.. కాంగ్రెస్లోనూ చక్రం తిప్పిన దరిమిలా.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయం మారుతోందని.. మండల స్థాయి నాయకులు వైసీపీ నుంచి టీడీపీ బాట పడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.
This post was last modified on July 11, 2023 9:05 am
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…