అసెంబ్లీ ఎన్నికలు అత్యంత వేగంగా సమీపిస్తున్నాయి. షెడ్యుల్ ప్రకారం జరిగితే.. 9 నెలలు.. ముందస్తు వస్తే.. నాలుగైదు మాసాలే గడువుంది. దీంతో రాజకీయాలు, రాజకీయ నాయకులు కూడా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా వేదికలను వారు ఎంచుకుంటున్నారు. ఈ వ్యవహ రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం ముందుందని అంటున్నారు పరిశీల కులు.
ఆచంట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ నాయకులు, సీనియర్ నేత.. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉన్నారు. గత 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టి పాదయాత్ర సమయంలో పార్టీలో చేరిన ఆయన ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయన విజయం కూడా సాధించి.. మంత్రి వర్గంలో స్థానం సంపాయించుకున్నారు. అయితే, రెండో దఫా విస్తరణలో ఆయన మంత్రి స్థానాన్ని కోల్పోయారు.
ఇక, నియోజకవర్గం విషయానికి వస్తే.. ఆయన దూకుడు మంత్రిగా ఉన్నప్పుడు బాగానే పని చేసింది కానీ.. ఇప్పుడు లేదనే టాక్ సొంత పార్టీ నేతల్లోనేఎక్కువగా వినిపిస్తోంది. మరోవైపు.. పాలకొల్లు, ఉండి నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల దూకుడు.. ఆచంటపై పరోక్షంగా ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు గ్రాఫ్ పెరుగుతున్నట్టు తమ్ముళ్ల మధ్య గుస గుస వినిపిస్తోంది.
దీంతో వైసీపీలోని మండలస్థాయి నాయకులు.. టీడీపీ చెంతకు చేరుతున్నారు. దీపం ఉండగానే అన్నట్టుగా.. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆచంట నియోజకవర్గంలో పితాని గతంలోనూ గెలిచి ఉండడం.. కాంగ్రెస్లోనూ చక్రం తిప్పిన దరిమిలా.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయం మారుతోందని.. మండల స్థాయి నాయకులు వైసీపీ నుంచి టీడీపీ బాట పడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.
This post was last modified on July 11, 2023 9:05 am
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…