అసెంబ్లీ ఎన్నికలు అత్యంత వేగంగా సమీపిస్తున్నాయి. షెడ్యుల్ ప్రకారం జరిగితే.. 9 నెలలు.. ముందస్తు వస్తే.. నాలుగైదు మాసాలే గడువుంది. దీంతో రాజకీయాలు, రాజకీయ నాయకులు కూడా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా వేదికలను వారు ఎంచుకుంటున్నారు. ఈ వ్యవహ రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం ముందుందని అంటున్నారు పరిశీల కులు.
ఆచంట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ నాయకులు, సీనియర్ నేత.. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉన్నారు. గత 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టి పాదయాత్ర సమయంలో పార్టీలో చేరిన ఆయన ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయన విజయం కూడా సాధించి.. మంత్రి వర్గంలో స్థానం సంపాయించుకున్నారు. అయితే, రెండో దఫా విస్తరణలో ఆయన మంత్రి స్థానాన్ని కోల్పోయారు.
ఇక, నియోజకవర్గం విషయానికి వస్తే.. ఆయన దూకుడు మంత్రిగా ఉన్నప్పుడు బాగానే పని చేసింది కానీ.. ఇప్పుడు లేదనే టాక్ సొంత పార్టీ నేతల్లోనేఎక్కువగా వినిపిస్తోంది. మరోవైపు.. పాలకొల్లు, ఉండి నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల దూకుడు.. ఆచంటపై పరోక్షంగా ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు గ్రాఫ్ పెరుగుతున్నట్టు తమ్ముళ్ల మధ్య గుస గుస వినిపిస్తోంది.
దీంతో వైసీపీలోని మండలస్థాయి నాయకులు.. టీడీపీ చెంతకు చేరుతున్నారు. దీపం ఉండగానే అన్నట్టుగా.. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆచంట నియోజకవర్గంలో పితాని గతంలోనూ గెలిచి ఉండడం.. కాంగ్రెస్లోనూ చక్రం తిప్పిన దరిమిలా.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయం మారుతోందని.. మండల స్థాయి నాయకులు వైసీపీ నుంచి టీడీపీ బాట పడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.
This post was last modified on July 11, 2023 9:05 am
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…