అసెంబ్లీ ఎన్నికలు అత్యంత వేగంగా సమీపిస్తున్నాయి. షెడ్యుల్ ప్రకారం జరిగితే.. 9 నెలలు.. ముందస్తు వస్తే.. నాలుగైదు మాసాలే గడువుంది. దీంతో రాజకీయాలు, రాజకీయ నాయకులు కూడా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా వేదికలను వారు ఎంచుకుంటున్నారు. ఈ వ్యవహ రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం ముందుందని అంటున్నారు పరిశీల కులు.
ఆచంట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ నాయకులు, సీనియర్ నేత.. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉన్నారు. గత 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టి పాదయాత్ర సమయంలో పార్టీలో చేరిన ఆయన ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయన విజయం కూడా సాధించి.. మంత్రి వర్గంలో స్థానం సంపాయించుకున్నారు. అయితే, రెండో దఫా విస్తరణలో ఆయన మంత్రి స్థానాన్ని కోల్పోయారు.
ఇక, నియోజకవర్గం విషయానికి వస్తే.. ఆయన దూకుడు మంత్రిగా ఉన్నప్పుడు బాగానే పని చేసింది కానీ.. ఇప్పుడు లేదనే టాక్ సొంత పార్టీ నేతల్లోనేఎక్కువగా వినిపిస్తోంది. మరోవైపు.. పాలకొల్లు, ఉండి నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల దూకుడు.. ఆచంటపై పరోక్షంగా ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు గ్రాఫ్ పెరుగుతున్నట్టు తమ్ముళ్ల మధ్య గుస గుస వినిపిస్తోంది.
దీంతో వైసీపీలోని మండలస్థాయి నాయకులు.. టీడీపీ చెంతకు చేరుతున్నారు. దీపం ఉండగానే అన్నట్టుగా.. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆచంట నియోజకవర్గంలో పితాని గతంలోనూ గెలిచి ఉండడం.. కాంగ్రెస్లోనూ చక్రం తిప్పిన దరిమిలా.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయం మారుతోందని.. మండల స్థాయి నాయకులు వైసీపీ నుంచి టీడీపీ బాట పడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…