మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేయగా.. దాన్ని రీట్వీట్ చేస్తూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తి పెంచాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతున్న వేళ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ రాహుల్ గాంధీ ఆయన్ను గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ దార్శినికుడని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కోసం తన జీవితాన్ని ఆయన అంకితం చేశారని కొనియాడుతూ.. వైఎస్సార్ చిరస్మరణీయమైన నేత అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు షర్మిల రీట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. ‘రాజశేఖర్ రెడ్డి జన్మదినాన ఆయన్ను గుర్తు చేసుకుంటూ మీ అభిమానపూర్వక మాటలకు ధన్యవాదాలు. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసిన నేత రాజశేఖర్ రెడ్డి.. చివరి క్షణం వరకు ఆయన ప్రజాసేవకే అంకితమయ్యారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశానికి ఉజ్వల భవిత ఉంటుందని నమ్మిన మనిషి రాజశేఖర్ రెడ్డి. ఆయన్ను మీ గుండెలో శాశ్వతంగా నిలుపుకొన్నందుకు మీకు ధన్యవాదాలు సార్’ అంటూ రాహుల్కు షర్మిల బదులిచ్చారు.
కాగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ఓ ప్రచారం సాగుతుండగా.. ఆమె ఏపీపై ఆసక్తి లేదని, తెలంగాణలో రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నారని.. ఆమె కాంగ్రెస్లో కలవడం ఖాయమే అయినా ఏ బాధ్యతలు ఇస్తారు.. ఎక్కడి బాధ్యతలు ఇస్తారన్నది ఇంకా తేలలేదని ప్రచారం జరుగుతోంది. ఆమె కాంగ్రెస్లో చేరుతారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు కూడా ఇటీవల అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వైఎస్సార్ కోసం ట్వీట్ చేయడం.. రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తూ షర్మిల సమాధానం ఇవ్వడంతో కాంగ్రెస్, షర్మిల అంశం మరోసారి చర్చనీయమవుతోంది.
This post was last modified on July 8, 2023 10:08 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…