Political News

రాహుల్ ట్వీట్.. షర్మిల రీట్వీట్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేయగా.. దాన్ని రీట్వీట్ చేస్తూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఆసక్తి పెంచాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతున్న వేళ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ రాహుల్ గాంధీ ఆయన్ను గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ దార్శినికుడని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కోసం తన జీవితాన్ని ఆయన అంకితం చేశారని కొనియాడుతూ.. వైఎస్సార్ చిరస్మరణీయమైన నేత అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు షర్మిల రీట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. ‘రాజశేఖర్ రెడ్డి జన్మదినాన ఆయన్ను గుర్తు చేసుకుంటూ మీ అభిమానపూర్వక మాటలకు ధన్యవాదాలు. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసిన నేత రాజశేఖర్ రెడ్డి.. చివరి క్షణం వరకు ఆయన ప్రజాసేవకే అంకితమయ్యారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశానికి ఉజ్వల భవిత ఉంటుందని నమ్మిన మనిషి రాజశేఖర్ రెడ్డి. ఆయన్ను మీ గుండెలో శాశ్వతంగా నిలుపుకొన్నందుకు మీకు ధన్యవాదాలు సార్’ అంటూ రాహుల్‌కు షర్మిల బదులిచ్చారు.

కాగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ఓ ప్రచారం సాగుతుండగా.. ఆమె ఏపీపై ఆసక్తి లేదని, తెలంగాణలో రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నారని.. ఆమె కాంగ్రెస్‌లో కలవడం ఖాయమే అయినా ఏ బాధ్యతలు ఇస్తారు.. ఎక్కడి బాధ్యతలు ఇస్తారన్నది ఇంకా తేలలేదని ప్రచారం జరుగుతోంది. ఆమె కాంగ్రెస్‌లో చేరుతారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు కూడా ఇటీవల అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వైఎస్సార్ కోసం ట్వీట్ చేయడం.. రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తూ షర్మిల సమాధానం ఇవ్వడంతో కాంగ్రెస్, షర్మిల అంశం మరోసారి చర్చనీయమవుతోంది.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago