భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో ప్రసంగించిన మోడీ….సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయని, ఆ దృష్టి మరల్చేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని మోడీ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ కొత్త ప్లాన్స్ వేస్తున్నారని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు.
కుటుంబ పార్టీల వల్ల తెలంగాణ వెనుకబాటుకు గురవుతోందని, కేంద్రాన్ని విమర్శించడమే కేసీఆర్ సర్కారు పనిగా పెట్టుకుందని విమర్శలు గుప్పించారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన కేసీఆర్….టీఎస్పీఎస్సీ స్కామ్ ద్వారా వారిని మోసం చేశారని ఆరోపించారు. 300 అధ్యాపకుల పోస్టులు తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నాయని, వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు కూడా పాఠశాలల్లో భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. ఉద్యోగులకు కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే రాష్ట్రం ఏమీ చేయడం లేదని మోడీ ఆరోపించారు.
అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ కలిసి పనిచేయడం దౌర్భాగ్యం అని లిక్కర్ స్కామ్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ కార్యకర్తగా వరంగల్ ప్రజల ముందుకు వచ్చానని, పౌరుషానికి వరంగల్ పెట్టింది పేరు అని మోడీ అన్నారు. జన్ సంఘ్ నుంచే వరంగల్ తమకు కంచుకోట అని, హనుమకొండ నుంచి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి గురించి అందరికీ తెలుసు అని మోడీ అన్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించిందని, రాబోయే ఎన్నికల్లో సినిమా చూపిస్తుందని అన్నారు.
దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమని, మేడిన్ ఇండియాకు తెలంగాణ ఎంతో సహకారం అందించిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేస్తామని, ఆ పార్టీలు తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు పనులు చేసిందని ఎద్దేవా చేశారు. లేచింది మొదలు మోడీకి తిట్టడమే మొదటి పని అని, కుటుంబ పార్టీని, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం రెండో పని అని చురకలంటించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, అప్పులు చేయడం మూడో పని అని, అవినీతిలో కూరుకుపోవడం నాలుగో పని అని మండిపడ్డారు.
This post was last modified on July 8, 2023 10:25 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…