Political News

కేసీయార్ సస్పెన్స్ మైన్ టెన్ చేస్తున్నారా ?

కేసీయార్ సస్పెన్స్ మైన్ టెన్ చేస్తున్నారు. ఈనెల 8వ తేదీన అంటే శనివారం నరేంద్రమోడీ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కేసీయార్ పాల్గొంటారా గైర్హాజరవుతారా అన్నదే తెలీటంలేదు. ఇదే విషయమై పార్టీతో పాటు ప్రభుత్వవర్గాలను ఎంతడిగినా ఎవరు నోరు విప్పటంలేదు. కొంతకాలంగా మోడీ రాష్ట్రానికి వచ్చిన ఏ కార్యక్రమంలో కూడా కేసీయార్ పాల్గొనలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే కేసీయార్ గైర్హాజరయ్యారని అందరికీ తెలిసిపోతోంది.

మోడీ విధానాలపైన కేసీయార్ ఒకపుడు ఫుల్లుగా విరుచుకుపడేవారు. అయినదానికి కానిదానికీ మోడీని కేసీయార్ పదేపదే టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. బీజేపీని గద్దెదింపేస్తానని, బంగాళాఖాతంలో పడేయాలని, మోడీ ఆటలు ఇక సాగనిచ్చేదిలేదని చాలా మాటలే మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో ఒక ఫ్రంటు ఏర్పాటుచేయటానికి చాలా ప్రయత్నాలే చేశారు. అయితే ఏదికూడా సాధ్యంకాలేదు. దాంతో ఆ ప్రయత్నాలను మానుకుని తానే ఒక జాతీయపార్టీ పెట్టేశారు.

అయితే ఇదంతా చరిత్రగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడింది. స్కామ్ బయటపడినపుడు దాని తీవ్రత అంతగా లేదు కాని దర్యాప్తులో చాలా డొంకలు కదిలేటప్పటికి దాని తీవ్రత దేశంలోనే సంచలనమైపోయింది. స్కామ్ లో చేతులుమారిన మొత్తం పెద్దదేమీ కాకపోయినా అందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యుటి సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులతో పాటు కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.

ఎప్పుడైతే కవిత పేరు తెరమీదకు వచ్చిందో ఈడీ విచారణ కూడా జరిగింది. అరెస్టు ఖాయమని తేలిపోయింది. అయితే తెరవెనుక ఏమిజరిగిందో కానీ కవిత అరెస్టు జరగలేదు. బీజేపీతో కేసీయార్ లోపాయికారీ ఒప్పందం కారణంగానే కవిత అరెస్టు జరగలేదనే ప్రచారం పెరిగిపోయింది. మోడీకి వ్యతిరేకంగా కేసీయార్ కూడా నోరిప్పటంలేదు. ఈ నేపధ్యంలోనే మోడీ వరంగల్ లో పర్యటించబోతున్నారు. కార్యక్రమంలో పాల్గొనాలని కేసీయార్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆహ్వానం కూడా అందిందట. మరి కేసీయార్ ఏమిచేస్తారు ? అన్నదే సస్పెన్సుగా మారింది.

This post was last modified on July 7, 2023 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

40 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago