Political News

ఇరుకున ప‌డుతున్న జ‌గ‌న్.. అదే జ‌రిగితే తీవ్ర న‌ష్టం?

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇరుకున ప‌డుతున్నారా? కేంద్రంతో ఆయ‌న తెర‌చాటున చేతులు క‌లిపినా.. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ముప్పురాలేదు. వ‌చ్చినా.. స‌రిచేసేందుకు స‌ర్ది చెప్పేందుకు సాయిరెడ్డి వంటి కీల‌క నాయ‌కులు ముందున్నారు. పార్టీని, ప్ర‌భుత్వాన్ని కూడా త‌మ వ్యూహాల‌తో కాపాడుకున్నారు. అయితే.. ఇప్పుడు పోయిపోయి.. జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది.

అదే.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఈ నెల‌లో పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్ట‌నున్న ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లుకు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం త‌ప్ప‌ని స‌రి అవుతోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఏడాది ఏపీలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారు మ‌ద్ద‌తు జ‌గ‌న్ కు ఎంతో కీల‌కంగా మార‌నుంది. దీంతో ఇష్టం ఉన్నా.. లేకున్నా.. ఆయ‌న ఉమ్మ‌డి పౌరస్మృతికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిన అవ‌స‌రం ఉంది.

అయితే.. ఈ బిల్లుకు మ‌ద్ద‌తు తెలిపితే.. జ‌గ‌న్‌కు కొంత వ‌ర‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఉమ్మ‌డి పౌర‌స్మృతిని ముస్లిం సామాజిక వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. త‌మ స్వేచ్ఛ‌, త‌మ మ‌తంపై జ‌రుగుతున్న దాడిగా పేర్కొంటున్న ఈ సామాజిక వ‌ర్గం జ‌గ‌న్‌పై ఆగ్ర‌హించే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇదే జ‌రిగితే..కొన్నేళ్లుగా ముస్లింలు జ‌గ‌న్‌కు అండ‌గా ఉంటున్న ప‌రిస్థితి తెర‌మ‌రుగు అయ్యే ఛాన్స్ క‌నిపిస్తోంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఫ‌లితంగా రాష్ట్రంలో ముస్లింల ఓట్ల‌పై జ‌గ‌న్ నిర్ణ‌యం ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే.. ఇదే విష‌యంలో మ‌రోవైపు ఇత‌ర పార్ట‌లు సైతం.. మోడీ స‌ర్కారుకు జై కొట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని.. తాము ఒక్క‌రే కాకుండా.. అన్ని పార్టీలు ఉమ్మ‌డి పౌర‌స్మృతికి జై కొట్టిన నేప‌థ్యంలో త‌మకు ప్ర‌త్యేకంగా వ‌చ్చే ఇబ్బంది లేద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఏదేమైనా.. కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న ఈ ప్ర‌ధాన అంశంతో జ‌గ‌న్ కు ఇబ్బందులు అయితే.. త‌ప్ప‌వ‌నే ది మెజారిటీ విశ్లేష‌కుల అభిప్రాయంగా ఉంది.

This post was last modified on July 6, 2023 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

5 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

8 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

8 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

10 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

11 hours ago