Political News

జగన్ ముందస్తు.. మోదీ తథాస్తు

ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటనపై ఎప్పటిలాగే అనేక ఊహాగానాలు వస్తున్నాయి.. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా ఎప్పటిలాగే జగన్ రాష్ట్రం కోసమే వెళ్లారంటూ చాంతాడంత లిస్ట్ చెప్తున్నారు. బుధవారం ఉదయం దిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లతో భేటీ అయ్యారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జగన్, మోదీల భేటీ జరగ్గా 25 నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ కొనసాగినట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్ షా తో జగన్ సమావేశం సుదీర్ఘంగానే సాగింది. మోదీ కంటే ముందు అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాలు చర్చలు జరిపారు.

పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్‌ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సీఎం కార్యాలయం చెప్తున్నప్పటికీ ఎన్నికల అంశాలపైనా ఇద్దరు నేతలపై చర్చ జరిగినట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల అంశం చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా ఎన్నికలు జరిగేలా సహకరించాలని మోదీని జగన్ కోరినట్లుగా చెప్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉండనుండడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందన్న ప్రచారం కూడా దిల్లీ స్థాయిలో జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే విజయసాయిరెడ్డికి మోదీ కేబినెట్లో మంత్రి పదవి దొరకొచ్చన్న మాట వినిపిస్తోంది.

అయితే, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం చూస్తే మాత్రం పోలవరం నిధులపై జగన్ మోదీ వద్ద గట్టి పట్టుపట్టినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన జగన్.. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుందని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు తొలిదశ నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, అయితే రూ.17144 కోట్లు ఇవ్వాలని కోరారు. దీనికి మోదీ నుంచి సానుకూలత వచ్చినట్లుగా చెప్తున్నారు.

అయితే.. ముందస్తు ఎన్నికల విషయంలోనూ జగన్ అందుకు సంబంధించి ముందడుగు వేస్తే ఎన్నికలు నిర్వహించడానికి ఈసీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదని బీజేపీ పెద్దలు సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో జగన్ ముందస్తు ఆలోచనకు మోదీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనంటున్నారు.

This post was last modified on July 6, 2023 6:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

31 minutes ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

2 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

2 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

3 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

4 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

4 hours ago