2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తితో శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక టీడీపీ ఉందని వైసీపీ నేతలు, వైసీపీనే ఆ దాడి చేయించిందని టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక, ఈ కోడి కత్తి దాడి అంతా డ్రామా అని, పీకే ప్లాన్ లో భాగంగానే కోడికత్తి దాడి జరిగిందని టీడీపీ నేతలు ఎన్నోసార్లు విమర్శించారు. ఆ దాడి ఘటన తర్వాత శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం తర్వాత శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు గతంలో బెయిల్ ఇవ్వగా ఆ బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.
దీంతో, శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది తాజాగా ఎన్ఐఏ కోర్టులో మరోసారి వాదనలు వినిపించారు. అయితే, ఈ వ్యవహారంపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలన్న శ్రీనివాస్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలోనే తన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే నిరాహారదీక్ష చేపట్టే యోచనలో ఉన్నాడు. జులై 11 నుంచి జైల్లో దీక్ష చేసేందుకు శ్రీను సిద్ధమవుతున్నాడని ఆయన తరఫు లాయర్అబ్దుల్ సలీం కీలక వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాల నుంచి తన క్లయింట్ శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడని, కోర్టు అతనికి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించాలని ఆయన కోరారు. షెడ్యూల్ ప్రకటించకుంటే శ్రీనివాస్ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడని అన్నారు. మరి, ఈ వ్యవహారంపై కోర్టు ఏ విధంగా ముందుకు పోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 5, 2023 7:38 am
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…