2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తితో శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక టీడీపీ ఉందని వైసీపీ నేతలు, వైసీపీనే ఆ దాడి చేయించిందని టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక, ఈ కోడి కత్తి దాడి అంతా డ్రామా అని, పీకే ప్లాన్ లో భాగంగానే కోడికత్తి దాడి జరిగిందని టీడీపీ నేతలు ఎన్నోసార్లు విమర్శించారు. ఆ దాడి ఘటన తర్వాత శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం తర్వాత శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు గతంలో బెయిల్ ఇవ్వగా ఆ బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.
దీంతో, శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది తాజాగా ఎన్ఐఏ కోర్టులో మరోసారి వాదనలు వినిపించారు. అయితే, ఈ వ్యవహారంపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలన్న శ్రీనివాస్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలోనే తన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే నిరాహారదీక్ష చేపట్టే యోచనలో ఉన్నాడు. జులై 11 నుంచి జైల్లో దీక్ష చేసేందుకు శ్రీను సిద్ధమవుతున్నాడని ఆయన తరఫు లాయర్అబ్దుల్ సలీం కీలక వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాల నుంచి తన క్లయింట్ శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడని, కోర్టు అతనికి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించాలని ఆయన కోరారు. షెడ్యూల్ ప్రకటించకుంటే శ్రీనివాస్ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడని అన్నారు. మరి, ఈ వ్యవహారంపై కోర్టు ఏ విధంగా ముందుకు పోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 5, 2023 7:38 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…