Political News

సైకిల్ ఎక్కలేని చంద్రబాబు…జగన్ సెటైర్లు

చిత్తూరు డైరీ పునరుద్ధరణ పనులకు ఏపీ సీఎం జగన్ ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్… చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కుట్రపూరితంగా తన హెరిటేజ్ డైరీ కోసమే చిత్తూరు డైరీని చంద్రబాబు మూయించి వేశారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే డైరీని మూసేశారని, తన స్వార్ధ ప్రయోజనాల కోసం సొంత జిల్లా రైతులను చంద్రబాబు నిట్టనిలువునా ముంచేశారని జగన్ ఆరోపించారు.

చిత్తూరు జిల్లా రైతులను ఆదుకునేందుకే తాము చిత్తశుద్ధితో ఈ డైరీని తెరిపిస్తున్నామని, ఈ క్రమంలోనే డైరీ పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేస్తున్నామని జగన్ చెప్పారు. పాదయాత్రలో చిత్తూరు డైరీని తెరిపిస్తానని తాను హామీ ఇచ్చానని, అందుకే 182 కోట్ల బకాయిలను తీర్చి డైరీ ఓపెన్ చేస్తున్నానని అన్నారు. ఈ డైరీలో 325 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు అమూల్ డైరీ ముందుకు వచ్చిందని జగన్ చెప్పారు. చిత్తూరుకు చంద్రబాబు చేసిందేమీ లేదని, చంద్రగిరిలో గెలవలేనని తెలిసే కుప్పానికి వలస వెళ్లారని విమర్శించారు.

అది తెలుసుకున్న కుప్పం ప్రజలు కూడా బాయ్ బాయ్ బాబు అంటున్నారని, అందుకే మరోసారి కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నాడని ఆరోపించారు. 75 ఏళ్ల ముసలాయన కుప్పంలో ఇల్లు కట్టుకుంటానంటూ డ్రామా చేస్తున్నాడని సెటైర్లు వేశారు. 54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను చంద్రబాబు అమ్మేశారని ఆరోపించారు. ఓ పథకం ప్రకారమే చిత్తూరు డైరీని కుట్రతో నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు.

అందుకే రాష్ట్రంలో అతిపెద్ద డైరీని తెరిపించేందుకు నాంది పలికామని జగన్ చెప్పారు. చంద్రబాబుది గజదొంగల ముఠా అని, ఆ ముఠా ఆట కట్టిస్తామని జగన్ అన్నారు. చక్రాలు లేని సైకిల్ ఎక్కలేని నాయకుడు ఒకరని చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక, ఎవరైనా తైలం పోస్తే తప్ప గ్లాస్ నిండని నాయకుడు ఇంకొకరు అని పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు.

This post was last modified on July 4, 2023 5:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

17 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

30 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

1 hour ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

3 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago