Political News

ఏపీ, తెలంగాణ బీజేపీలకు కొత్త అధ్యక్షులు వీరే

గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ వ్యవహారాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించబోతున్నారని, ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా తప్పించబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. తాజాగా, ఆ పుకార్లకు తగ్గట్లుగానే అయితే తెలంగాణ, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులను ప్రకటించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి దక్కింది. అనూహ్యంగా చివరి నిమిషంలో ఆమె పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి రేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బిజెపి హై కమాండ్ కిషన్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈటలతోపాటు రఘు నందన్ రావు కూడా పార్టీపై అలకబూనారని ప్రచారం జరిగినా..తాను బిజెపికి విధేయుడినని, బిజెపిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. కాగా, సోము వీర్రాజుకు రాష్ట్ర స్థాయిలోనే ఇతర బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బండి సంజయ్ కు కేంద్ర స్థాయలో లేదా రాష్ట్ర స్థాయిలో పదవి దక్కే అవకాశముంది.

This post was last modified on July 4, 2023 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సామాన్యుల సమస్యలపై మాట్లాడే ఎంపీకు సొంత పార్టీ షాక్

రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…

46 minutes ago

రౌడీ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో రంజింపజేయాలి

బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్‌స్పెక్టర్. 1992లో…

3 hours ago

అమ‌రావ‌తిపై చ‌ర్చ‌.. రాజ్య‌స‌భ‌లో దుమ్మురేపిన నాయుడు

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును బుధ‌వారం లోక్‌స‌భ ఆమోదించిన ద‌రిమిలా.. రాజ్య‌స‌భ‌లో గురువారం ప్ర‌వేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…

3 hours ago

సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజుల ఊపిరి

తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…

4 hours ago

వారణాసి ఇప్పుడెందుకు గుర్తుకు వస్తోంది

రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…

4 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్‌: `ఐప్యాక్`పై ఈడీ న‌జ‌ర్‌!

పొలిటిక‌ల్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌.. ఐప్యాక్‌పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏక‌కాలంలో గురువారం.. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఐప్యాక్ సంస్థ‌ల‌కు…

4 hours ago