గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ వ్యవహారాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించబోతున్నారని, ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా తప్పించబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. తాజాగా, ఆ పుకార్లకు తగ్గట్లుగానే అయితే తెలంగాణ, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులను ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి దక్కింది. అనూహ్యంగా చివరి నిమిషంలో ఆమె పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి రేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బిజెపి హై కమాండ్ కిషన్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈటలతోపాటు రఘు నందన్ రావు కూడా పార్టీపై అలకబూనారని ప్రచారం జరిగినా..తాను బిజెపికి విధేయుడినని, బిజెపిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. కాగా, సోము వీర్రాజుకు రాష్ట్ర స్థాయిలోనే ఇతర బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బండి సంజయ్ కు కేంద్ర స్థాయలో లేదా రాష్ట్ర స్థాయిలో పదవి దక్కే అవకాశముంది.
This post was last modified on July 4, 2023 3:44 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…