అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపింది. తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆనందరావు సూసైడ్ చేసుకున్న ఘటన వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండిస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో కూడా ఆనందరావు ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పని ఒత్తిడి వల్లే తన తండ్రి చనిపోయారని ఆనందరావు కుమార్తె భవ్య కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఒత్తిడికి గురికాలేదని, తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని తన తండ్రి చాలాసార్లు బాధపడ్డారని భవ్య తెలిపారు. ఈ క్రమంలోనే రాజకీయ ఒత్తిళ్లతోనే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆనందరావు మృతదేహానికి నివాళులర్పించిన జేసీ…మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందరావు సీఐగా బాధ్యతలు చేపట్టి 9 నెలలయిందని, సుమారు 5 నెలల నుంచి వైసీపీ నేతలు ఆయనను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలను కొన్ని కేసుల నుంచి తప్పించాలని ఆనందరావుపై ఒత్తిడి తెచ్చారని, దీంతో ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మరోవైపు, ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులపై నిందలు వేస్తున్నారని జేసీ ఆరోపణలను కొట్టిపారేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులను ఎంత ఇబ్బందులకు గురి చేశారో తాడిపత్రి ప్రజలకు తెలుసని చెప్పారు. సీఐ మృతి బాధాకరమని, ఆయన ఆత్మహత్య ఘటనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను కోరతామని తెలిపారు. ఏది ఏమైనా, సీఐ ఆనందరావు ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
This post was last modified on July 3, 2023 10:28 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…