Political News

ఆ సీఐ ఆత్మహత్య..జేసీ వర్సెస్ పెద్దారెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపింది. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆనందరావు సూసైడ్ చేసుకున్న ఘటన వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండిస్తున్నారు.

రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో కూడా ఆనందరావు ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పని ఒత్తిడి వల్లే తన తండ్రి చనిపోయారని ఆనందరావు కుమార్తె భవ్య కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఒత్తిడికి గురికాలేదని, తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని తన తండ్రి చాలాసార్లు బాధపడ్డారని భవ్య తెలిపారు. ఈ క్రమంలోనే రాజకీయ ఒత్తిళ్లతోనే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వాసుపత్రిలో ఆనందరావు మృతదేహానికి నివాళులర్పించిన జేసీ…మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందరావు సీఐగా బాధ్యతలు చేపట్టి 9 నెలలయిందని, సుమారు 5 నెలల నుంచి వైసీపీ నేతలు ఆయనను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలను కొన్ని కేసుల నుంచి తప్పించాలని ఆనందరావుపై ఒత్తిడి తెచ్చారని, దీంతో ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

మరోవైపు, ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులపై నిందలు వేస్తున్నారని జేసీ ఆరోపణలను కొట్టిపారేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులను ఎంత ఇబ్బందులకు గురి చేశారో తాడిపత్రి ప్రజలకు తెలుసని చెప్పారు. సీఐ మృతి బాధాకరమని, ఆయన ఆత్మహత్య ఘటనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను కోరతామని తెలిపారు. ఏది ఏమైనా, సీఐ ఆనందరావు ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

This post was last modified on July 3, 2023 10:28 pm

Share
Show comments
Published by
Satya
Tags: Tadipatri

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

36 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago