అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపింది. తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆనందరావు సూసైడ్ చేసుకున్న ఘటన వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండిస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో కూడా ఆనందరావు ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పని ఒత్తిడి వల్లే తన తండ్రి చనిపోయారని ఆనందరావు కుమార్తె భవ్య కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఒత్తిడికి గురికాలేదని, తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని తన తండ్రి చాలాసార్లు బాధపడ్డారని భవ్య తెలిపారు. ఈ క్రమంలోనే రాజకీయ ఒత్తిళ్లతోనే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆనందరావు మృతదేహానికి నివాళులర్పించిన జేసీ…మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందరావు సీఐగా బాధ్యతలు చేపట్టి 9 నెలలయిందని, సుమారు 5 నెలల నుంచి వైసీపీ నేతలు ఆయనను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలను కొన్ని కేసుల నుంచి తప్పించాలని ఆనందరావుపై ఒత్తిడి తెచ్చారని, దీంతో ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మరోవైపు, ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులపై నిందలు వేస్తున్నారని జేసీ ఆరోపణలను కొట్టిపారేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులను ఎంత ఇబ్బందులకు గురి చేశారో తాడిపత్రి ప్రజలకు తెలుసని చెప్పారు. సీఐ మృతి బాధాకరమని, ఆయన ఆత్మహత్య ఘటనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను కోరతామని తెలిపారు. ఏది ఏమైనా, సీఐ ఆనందరావు ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…