Political News

ఆ సీఐ ఆత్మహత్య..జేసీ వర్సెస్ పెద్దారెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపింది. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆనందరావు సూసైడ్ చేసుకున్న ఘటన వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండిస్తున్నారు.

రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో కూడా ఆనందరావు ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పని ఒత్తిడి వల్లే తన తండ్రి చనిపోయారని ఆనందరావు కుమార్తె భవ్య కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఒత్తిడికి గురికాలేదని, తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని తన తండ్రి చాలాసార్లు బాధపడ్డారని భవ్య తెలిపారు. ఈ క్రమంలోనే రాజకీయ ఒత్తిళ్లతోనే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వాసుపత్రిలో ఆనందరావు మృతదేహానికి నివాళులర్పించిన జేసీ…మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందరావు సీఐగా బాధ్యతలు చేపట్టి 9 నెలలయిందని, సుమారు 5 నెలల నుంచి వైసీపీ నేతలు ఆయనను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలను కొన్ని కేసుల నుంచి తప్పించాలని ఆనందరావుపై ఒత్తిడి తెచ్చారని, దీంతో ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

మరోవైపు, ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులపై నిందలు వేస్తున్నారని జేసీ ఆరోపణలను కొట్టిపారేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులను ఎంత ఇబ్బందులకు గురి చేశారో తాడిపత్రి ప్రజలకు తెలుసని చెప్పారు. సీఐ మృతి బాధాకరమని, ఆయన ఆత్మహత్య ఘటనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను కోరతామని తెలిపారు. ఏది ఏమైనా, సీఐ ఆనందరావు ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

4 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

6 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

6 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

7 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

7 hours ago