Political News

విశాఖకు రాహుల్..అమరావతికి ప్రియాంకా

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటన దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో రాహుల్ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. తెలంగాణ టూర్ ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ పై రాహుల్ గాంధీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చే నెలలో విశాఖలో రాహుల్ గాంధీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు ఇచ్చేందుకు రాహుల్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీకి బయలుదేరే ముందు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్, అమరావతి రాజధాని, పోలవరం వంటి పలు విషయాలపై రాహుల్ చర్చించారు. దాంతోపాటు, సీఎం జగన్ పై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల గురించి కూడా రాహుల్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. త్వరలో ఏపీలో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ అమరావతిలో పర్యటించబోతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ప్రకటించారు. ఏపీకి రాజధాని లేకపోవడం బాధాకరమని, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని వెల్లడించారు.

రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా అంశాలలో ఏపీకి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు వివరించారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి సంబంధించిన అన్ని హామీలను నెరవేరుస్తామని రాహుల్ భరోసా ఇచ్చారని వెల్లడించారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ స్పష్టం చేశారని, ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలపై కూడా రాహుల్ ఆరా తీశారని చెప్పారు.

ఏపీలో వైసీపీ, జనసేన, టీడీపీలు బిజెపితో కలిసే ఉన్నాయని, కానీ ప్రజల దృష్టిలో విడిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నాయని రాహుల్ కు వెల్లడించామన్నారు. రాహుల్ గాంధీతో రుద్రరాజు, కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు, జెడి శీలం తదితరులు భేటీ అయ్యారు.

This post was last modified on July 3, 2023 4:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

21 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

41 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago