Political News

విశాఖకు రాహుల్..అమరావతికి ప్రియాంకా

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం పర్యటన దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో రాహుల్ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. తెలంగాణ టూర్ ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ పై రాహుల్ గాంధీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చే నెలలో విశాఖలో రాహుల్ గాంధీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతు ఇచ్చేందుకు రాహుల్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే ఢిల్లీకి బయలుదేరే ముందు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్, అమరావతి రాజధాని, పోలవరం వంటి పలు విషయాలపై రాహుల్ చర్చించారు. దాంతోపాటు, సీఎం జగన్ పై ఉన్న ఈడీ, సీబీఐ కేసుల గురించి కూడా రాహుల్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. త్వరలో ఏపీలో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ అమరావతిలో పర్యటించబోతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ప్రకటించారు. ఏపీకి రాజధాని లేకపోవడం బాధాకరమని, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని వెల్లడించారు.

రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా అంశాలలో ఏపీకి అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ నేతలు వివరించారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి సంబంధించిన అన్ని హామీలను నెరవేరుస్తామని రాహుల్ భరోసా ఇచ్చారని వెల్లడించారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ స్పష్టం చేశారని, ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలపై కూడా రాహుల్ ఆరా తీశారని చెప్పారు.

ఏపీలో వైసీపీ, జనసేన, టీడీపీలు బిజెపితో కలిసే ఉన్నాయని, కానీ ప్రజల దృష్టిలో విడిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నాయని రాహుల్ కు వెల్లడించామన్నారు. రాహుల్ గాంధీతో రుద్రరాజు, కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు, జెడి శీలం తదితరులు భేటీ అయ్యారు.

This post was last modified on July 3, 2023 4:06 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

55 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

3 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago