Political News

జగన్ పోలింగ్ స్ట్రాటజీ మామూలుగా లేదు కదా..

అవినాశ్ రెడ్డి అరెస్ట్ భయం పోయింది.. పథకాలకు నిధులు కూడా అందుతున్నాయి.. మరి, ఇలాంటి సమయంలో జగన్ దిల్లీ ఎందుకు వెళ్తున్నట్లు? చాలామందిలో ఇదే అనుమానం ఉంది.

నారా లోకేశ్ పాదయాత్రతో భయపడి.. పవన్ వారాహి యాత్రతో వణికిపోతున్న జగన్ వాళ్లిద్దరూ మరింత పికప్ కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎలాగోలా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగానైనా బయటపడి ఎన్నికలలో విజయం సాధించడానికి ప్లాన్ చేస్తున్నారని.. అందుకే దిల్లీ వెళ్తున్నారని టీడీపీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ.. అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది.

ముందస్తా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలా అనేది పెద్ద మ్యాటర్ కాదని జగన్ అనుకుంటున్నారట.. ఆయన కోరుకుంటున్నదంతా ఎన్నికలు ఒకే ఫేజ్‌లో జరగకూడదనే. అవును.. ఒకే దశలో కానీ, లేదంటే తక్కువ దశల్లో కాని జరిగితే పోల్ మేనేజ్‌మెంట్ కష్టమని.. ఎక్కువ ఫేజెస్ ఉంటే అంతా అనుకున్న ప్రకారం చేయొచ్చని భావిస్తున్నారట. అందుకే 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీఐ నుంచి సహకారం ఉండేలా చూడాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలను జగన్ కోరనున్నారని.. అందుకే ఆయన దిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది.

2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను చూసుకుంటే గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహించారు. వీటిలో పంజాబ్‌ అసెంబ్లీలో 117 స్థానాలుంటాయి.. మిగతావన్నీ 100 లోపు సభ్యులున్న అసెంబ్లీలే. 2022లోనే ఎన్నికలు జరిగిన గుజరాత్‌లో రెండు ఫేజ్‌లలో.. మణిపుర్‌లో రెండు ఫేజ్‌లలో యూపీలో 7 ఫేజ్‌లలో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాలలో మణిపుర్ తప్ప మిగతా రెండూ ఏపీ కంటే ఎక్కువ సీట్లున్న అసెంబ్లీలే. గుజరాత్, యూపీలలో బీజేపీ మళ్లీ విజయం సాధించింది.

అంతకుముందు 2021లో 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 8 ఫేజ్‌లలో నిర్వహించారు. ఆ ఎన్నికలలో బీజేపీ అక్కడ సుమారు 80 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. కేంద్రం సహకారం, రాష్ట్రంలో సొంత ప్రభుత్వం ఉంటే ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు జరిగినప్పుడు లాభదాయకమన్నది ఒక అభిప్రాయం. ఒక్కో ఫేజ్‌పై దృష్టిపెడుతూ ఒకదాని తరువాత ఒకటి జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఈ కారణంగానే జగన్ 175 సీట్లున్న ఏపీలో 7 ఫేజ్‌లలో పోలింగ్ నిర్వహించాలని కోరుకుంటున్నారట.

అయితే.. జగన్ కోరుకుంటున్నట్లు ఏపీలో అన్ని ఫేజ్‌లకు ఎలక్షన్ కమిషన్ అంగీకరించడం కష్టమే. ఏపీ ఏమీ రాజకీయంగా మరీ అంత రావణ కాష్టం కాదు.. ఈశాన్య రాష్ట్రాలలా అంతర్గత హింస కూడా లేదు.. ఒకప్పటిలా మావోయిస్ట్ సమస్యా లేదు.. కాబట్టి ఈసీకి ఎన్నికల నిర్వహణ కష్టాలు పెద్దగా ఉండవు. అలాంటప్పుడు ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహిస్తే విమర్శలు కచ్చితంగా వస్తాయి. జగన్ కోసం ఈసీఐ అలాంటి పరిస్థితి తెచ్చుకోదు. అయితే.. జగన్‌కు కేంద్రంలోని బీజేపీ నుంచి సహకారం కనుక ఉంటే ఆ ఒత్తిడితో మూణ్నాలుగు ఫేజ్‌లకు ఈసీఐ ఓకే చెప్పొచ్చు. అదే జరిగితే జగన్ కోరుకున్నది జరిగినట్లే.

This post was last modified on July 2, 2023 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జయశ్రీగా తమన్నా… ఎవరు ఈవిడ ?

స్పెషల్ సాంగ్స్ లో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా చాలా గ్యాప్ తర్వాత ఛాలెంజింగ్ రోల్ ఒకటి దక్కించుకుంది.…

53 minutes ago

అఖండ-2 రిలీజ్… అభిమానులే గెలిచారు

గత గురువారం మరి కొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమయర్స్ పడాల్సి ఉండగా.. అనూహ్యంగా అఖండ-2 సినిమాకు బ్రేక్…

54 minutes ago

జగన్ అంటే వాళ్లలో ఇంకా భయం పోలేదా?

రాజకీయాల్లో నాయకుడి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. వీటికి తోడు సానుభూతి, గౌరవం,…

1 hour ago

టఫ్ ఫైట్… యష్ VS రణ్వీర్ సింగ్

పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న దురంధర్ మొదటి వారం తిరక్కుండానే నూటా యాభై…

1 hour ago

రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ – ఒక రోజులో ఎన్ని లక్షల కోట్లు?

గ‌త నెల‌లో ఏపీలోని విశాఖ‌లో నిర్వ‌హించిన సీఐఐ పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు పోటీ ప‌డుతున్న‌ట్టుగా.. తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా రెండు రోజ‌లు…

2 hours ago

చరణ్-సుకుమార్… కథ ఇంకా ఫైనల్ అవ్వలేదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ ఎంత…

2 hours ago