Political News

జగన్ పోలింగ్ స్ట్రాటజీ మామూలుగా లేదు కదా..

అవినాశ్ రెడ్డి అరెస్ట్ భయం పోయింది.. పథకాలకు నిధులు కూడా అందుతున్నాయి.. మరి, ఇలాంటి సమయంలో జగన్ దిల్లీ ఎందుకు వెళ్తున్నట్లు? చాలామందిలో ఇదే అనుమానం ఉంది.

నారా లోకేశ్ పాదయాత్రతో భయపడి.. పవన్ వారాహి యాత్రతో వణికిపోతున్న జగన్ వాళ్లిద్దరూ మరింత పికప్ కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎలాగోలా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగానైనా బయటపడి ఎన్నికలలో విజయం సాధించడానికి ప్లాన్ చేస్తున్నారని.. అందుకే దిల్లీ వెళ్తున్నారని టీడీపీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ.. అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది.

ముందస్తా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలా అనేది పెద్ద మ్యాటర్ కాదని జగన్ అనుకుంటున్నారట.. ఆయన కోరుకుంటున్నదంతా ఎన్నికలు ఒకే ఫేజ్‌లో జరగకూడదనే. అవును.. ఒకే దశలో కానీ, లేదంటే తక్కువ దశల్లో కాని జరిగితే పోల్ మేనేజ్‌మెంట్ కష్టమని.. ఎక్కువ ఫేజెస్ ఉంటే అంతా అనుకున్న ప్రకారం చేయొచ్చని భావిస్తున్నారట. అందుకే 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీఐ నుంచి సహకారం ఉండేలా చూడాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలను జగన్ కోరనున్నారని.. అందుకే ఆయన దిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది.

2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను చూసుకుంటే గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహించారు. వీటిలో పంజాబ్‌ అసెంబ్లీలో 117 స్థానాలుంటాయి.. మిగతావన్నీ 100 లోపు సభ్యులున్న అసెంబ్లీలే. 2022లోనే ఎన్నికలు జరిగిన గుజరాత్‌లో రెండు ఫేజ్‌లలో.. మణిపుర్‌లో రెండు ఫేజ్‌లలో యూపీలో 7 ఫేజ్‌లలో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాలలో మణిపుర్ తప్ప మిగతా రెండూ ఏపీ కంటే ఎక్కువ సీట్లున్న అసెంబ్లీలే. గుజరాత్, యూపీలలో బీజేపీ మళ్లీ విజయం సాధించింది.

అంతకుముందు 2021లో 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 8 ఫేజ్‌లలో నిర్వహించారు. ఆ ఎన్నికలలో బీజేపీ అక్కడ సుమారు 80 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. కేంద్రం సహకారం, రాష్ట్రంలో సొంత ప్రభుత్వం ఉంటే ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు జరిగినప్పుడు లాభదాయకమన్నది ఒక అభిప్రాయం. ఒక్కో ఫేజ్‌పై దృష్టిపెడుతూ ఒకదాని తరువాత ఒకటి జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఈ కారణంగానే జగన్ 175 సీట్లున్న ఏపీలో 7 ఫేజ్‌లలో పోలింగ్ నిర్వహించాలని కోరుకుంటున్నారట.

అయితే.. జగన్ కోరుకుంటున్నట్లు ఏపీలో అన్ని ఫేజ్‌లకు ఎలక్షన్ కమిషన్ అంగీకరించడం కష్టమే. ఏపీ ఏమీ రాజకీయంగా మరీ అంత రావణ కాష్టం కాదు.. ఈశాన్య రాష్ట్రాలలా అంతర్గత హింస కూడా లేదు.. ఒకప్పటిలా మావోయిస్ట్ సమస్యా లేదు.. కాబట్టి ఈసీకి ఎన్నికల నిర్వహణ కష్టాలు పెద్దగా ఉండవు. అలాంటప్పుడు ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహిస్తే విమర్శలు కచ్చితంగా వస్తాయి. జగన్ కోసం ఈసీఐ అలాంటి పరిస్థితి తెచ్చుకోదు. అయితే.. జగన్‌కు కేంద్రంలోని బీజేపీ నుంచి సహకారం కనుక ఉంటే ఆ ఒత్తిడితో మూణ్నాలుగు ఫేజ్‌లకు ఈసీఐ ఓకే చెప్పొచ్చు. అదే జరిగితే జగన్ కోరుకున్నది జరిగినట్లే.

Satya

Recent Posts

వారణాసి లెక్కలు వేరే ఉన్నాయి

వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…

54 minutes ago

సెట్ కి రాకుండా సినిమా తీసిన సింగీతం

దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…

5 hours ago

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…

6 hours ago

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

10 hours ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

13 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

14 hours ago