Political News

రెండో విడత వారాహి పరుగు ఇక్కడి నుంచే

జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర మొదటి విడత దిగ్విజయంగా పూర్తయిన సంగతి తెలిసిందే. అన్నవరం నుంచి భీమవరం వరకు జనసేనాని చేపట్టిన ఈ యాత్ర అన్ని రకాల అడ్డంకులను అధిగమించి అప్రతిహతంగా కొనసాగింది. తొలి విడత యాత్రలో వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలపై పవన్ పదునైన విమర్శలు గుప్పించారు. ఏపీలో పవన్ చేపట్టిన వారాహి యాత్ర అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని జనసేన నేతలు అంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా వారాహి యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్రను పవన్ ప్రారంభించబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలోని 34 నియోజకవర్గాలలో వారాహి యాత్రకు పవన్ సంకల్పించిన సంగతి తెలిసిందే. మొదటి విడత యాత్రలో భాగంగా 34 లోని 10 నియోజకవర్గాలలో యాత్ర కొనసాగిన సంగతి తెలిసిందే. మిగిలిన 24 నియోజకవర్గాలలో ఈ యాత్రను పవన్ పూర్తి చేయబోతున్నారు. ఏలూరు నుంచి మొదలు కానున్న వారాహి రెండో విడత యాత్ర ఎక్కడ ముగుస్తుంది అన్న విషయం తెలియాల్సి ఉంది. రెండో విడత వారాహి యాత్రపై పూర్తిస్థాయి రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు జనసేన నేతలు.

ఉభయగోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాలకుగాను 34 జనసేన కైవసం చేసుకోవాలని పవన్ చెబుతున్న సంగతి తెలిసిందే. తొలి విడత వారాహి యాత్ర దిగ్విజయంగా పూర్తయిన నేపథ్యంలో రెండో విడత వారాహి యాత్రను మరింత ఉత్సాహంతో ప్రారంభించేందుకు జనసేన నేతలు, జనసైనికులు సిద్ధమవుతున్నారు. జూన్ 14న అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వారాహి యాత్ర తొలివిడతను పవన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ దగ్గర నిర్వహించిన బహిరంగ సభ ద్వారా వైసీపీకి పవన్ హెచ్చరికలు జారీ చేశారు. గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఈసారి కూడా పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని, అందుకే ఉభయ గోదావరి జిల్లాలపై గట్టిగా ఫోకస్ చేశారని తెలుస్తోంది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

6 hours ago