తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టాప్ గేర్ వేస్తోంది. అన్ని జిల్లాలలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి వంటి పవర్ఫుల్ లీడర్లను పార్టీలోకి లాగేసిన రేవంత్ రెడ్డి మరో కీలక నేతనూ కాంగ్రెస్లోకి తీసుకొస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయమని చెప్తున్నారు ఆయన అనుచరులు. చాలాకాలంగా బీజేపీలో చేరడానికి అన్ని ప్రయత్నాలు చేసిన సునీల్ రెడ్డికి అక్కడ అవకాశం లభించలేదు.. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటుండడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి సిగ్నల్స్ పంపిచారు. దాంతో రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి దిల్లీలో ఆయనతో చర్చలు జరిపారు. చేరికకు అంతా ఓకే అయినట్లు చెప్తున్నారు.
నిజానికి సునీల్ రెడ్డి ఇంతకుముందు బీజేపీలో చేరే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు సంజయ్ కూడా సునీల్ను పార్టీలోకి తీసుకోవడానికి మొగ్గు చూపారు. కానీ, నిజామబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి అభ్యంతరాలు రావడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
సునీల్ రెడ్డి 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. బాల్కొండ అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికే బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో సునీల్ రెడ్డి బీఎస్పీ టికెట్పై పోటీ చేశారు. ఆ ఎన్నికలలో సునీల్ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానమివ్వడంతో ప్రశాంత్ రెడ్డి పట్టు మరింత పెరగ్గా సునీల్ బీఆర్ఎస్ నుంచి పూర్తిగా దూరమయ్యారు.
బండి సంజయ్తో మంచి సంబంధాలున్న ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నించినా ఆయనొస్తే నిజామాబాద్ ఎంపీ సీటు విషయంలో పోటీ కావొచ్చన్న భావనతో ధర్మపురి అరవింత్ అభ్యంతరం చెప్పడంతో ఆయన చేరిక ఆగిపోయింది.
తాజాగా దిల్లీలో కాంగ్రెస్ పెద్దలను పొంగులేటి, జూపల్లిలు కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలోనే సునీల్ కూడా వచ్చి రేవంత్ సహా కొందరు నేతలను కలిసినట్లు చెప్తున్నారు. త్వరలో ఆయన చేరిక ఉంటుందని చెప్తున్నారు.
This post was last modified on July 1, 2023 10:28 am
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…