తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టాప్ గేర్ వేస్తోంది. అన్ని జిల్లాలలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి వంటి పవర్ఫుల్ లీడర్లను పార్టీలోకి లాగేసిన రేవంత్ రెడ్డి మరో కీలక నేతనూ కాంగ్రెస్లోకి తీసుకొస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయమని చెప్తున్నారు ఆయన అనుచరులు. చాలాకాలంగా బీజేపీలో చేరడానికి అన్ని ప్రయత్నాలు చేసిన సునీల్ రెడ్డికి అక్కడ అవకాశం లభించలేదు.. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటుండడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి సిగ్నల్స్ పంపిచారు. దాంతో రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి దిల్లీలో ఆయనతో చర్చలు జరిపారు. చేరికకు అంతా ఓకే అయినట్లు చెప్తున్నారు.
నిజానికి సునీల్ రెడ్డి ఇంతకుముందు బీజేపీలో చేరే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు సంజయ్ కూడా సునీల్ను పార్టీలోకి తీసుకోవడానికి మొగ్గు చూపారు. కానీ, నిజామబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి అభ్యంతరాలు రావడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
సునీల్ రెడ్డి 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. బాల్కొండ అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికే బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో సునీల్ రెడ్డి బీఎస్పీ టికెట్పై పోటీ చేశారు. ఆ ఎన్నికలలో సునీల్ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానమివ్వడంతో ప్రశాంత్ రెడ్డి పట్టు మరింత పెరగ్గా సునీల్ బీఆర్ఎస్ నుంచి పూర్తిగా దూరమయ్యారు.
బండి సంజయ్తో మంచి సంబంధాలున్న ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నించినా ఆయనొస్తే నిజామాబాద్ ఎంపీ సీటు విషయంలో పోటీ కావొచ్చన్న భావనతో ధర్మపురి అరవింత్ అభ్యంతరం చెప్పడంతో ఆయన చేరిక ఆగిపోయింది.
తాజాగా దిల్లీలో కాంగ్రెస్ పెద్దలను పొంగులేటి, జూపల్లిలు కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలోనే సునీల్ కూడా వచ్చి రేవంత్ సహా కొందరు నేతలను కలిసినట్లు చెప్తున్నారు. త్వరలో ఆయన చేరిక ఉంటుందని చెప్తున్నారు.
This post was last modified on July 1, 2023 10:28 am
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…