Political News

కాంగ్రెస్‌లోకి ఆరెంట్ ట్రావెల్స్ అధినేత?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టాప్ గేర్ వేస్తోంది. అన్ని జిల్లాలలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి వంటి పవర్‌ఫుల్ లీడర్లను పార్టీలోకి లాగేసిన రేవంత్ రెడ్డి మరో కీలక నేతనూ కాంగ్రెస్‌లోకి తీసుకొస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని చెప్తున్నారు ఆయన అనుచరులు. చాలాకాలంగా బీజేపీలో చేరడానికి అన్ని ప్రయత్నాలు చేసిన సునీల్ రెడ్డికి అక్కడ అవకాశం లభించలేదు.. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటుండడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి సిగ్నల్స్ పంపిచారు. దాంతో రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి దిల్లీలో ఆయనతో చర్చలు జరిపారు. చేరికకు అంతా ఓకే అయినట్లు చెప్తున్నారు.

నిజానికి సునీల్ రెడ్డి ఇంతకుముందు బీజేపీలో చేరే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు సంజయ్ కూడా సునీల్‌ను పార్టీలోకి తీసుకోవడానికి మొగ్గు చూపారు. కానీ, నిజామబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి అభ్యంతరాలు రావడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.

సునీల్ రెడ్డి 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. బాల్కొండ అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికే బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో సునీల్ రెడ్డి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. ఆ ఎన్నికలలో సునీల్ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానమివ్వడంతో ప్రశాంత్ రెడ్డి పట్టు మరింత పెరగ్గా సునీల్ బీఆర్‌ఎస్ నుంచి పూర్తిగా దూరమయ్యారు.

బండి సంజయ్‌తో మంచి సంబంధాలున్న ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నించినా ఆయనొస్తే నిజామాబాద్ ఎంపీ సీటు విషయంలో పోటీ కావొచ్చన్న భావనతో ధర్మపురి అరవింత్ అభ్యంతరం చెప్పడంతో ఆయన చేరిక ఆగిపోయింది.

తాజాగా దిల్లీలో కాంగ్రెస్ పెద్దలను పొంగులేటి, జూపల్లిలు కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలోనే సునీల్ కూడా వచ్చి రేవంత్ సహా కొందరు నేతలను కలిసినట్లు చెప్తున్నారు. త్వరలో ఆయన చేరిక ఉంటుందని చెప్తున్నారు.

This post was last modified on July 1, 2023 10:28 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

5 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

6 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

8 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

8 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

9 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago