Political News

నరేంద్రమోడీ కొత్త రికార్డు… !

నరేంద్ర మోడీ కొత్త రికార్డు నమోదు చేశారు. నేటితో అత్యధిక కాలం కొనసాగిన కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచారు. ఇప్పటివరకు వాజ్ పాయి మీద ఆ రికార్డు ఉండేది. నేటితో మోడీకి ఆ క్రెడిట్ దక్కింది. అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి మూడు సార్లు ప్రధాని అయినా… రోజుల లెక్కన వాజ్ పాయి ప్రధానిగా 2268 రోజులు మాత్రమే ఉన్నారు. ఇపుడు ఆ రికార్డు మోడీ కి దక్కింది.

భారతదేశానికి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ లు అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానులు. నాలుగో స్థానంలో మోడీ నిలిచారు. భారతదేశంపు 14వ ప్రధానమంత్రి అయిన మోడీ 2014 మే 26న తొలిసారి ప్రధాని అయ్యారు. తర్వాత రెండో సారి సంపూర్ణ మెజారిటీతో గెలిచి 2019, మే 30 ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక తొలి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ దేశాన్ని అత్యధిక కాలం ఏలిన వ్యక్తిగా చెప్పొచ్చు. బహుశా ఆ రికార్డు చెరిగిపోవడం చాలా కాష్టం. నెహ్రూ స్వతంత్ర సమర యోధుడు. అంతేకాదు అప్పట్లో వేరే పార్టీ లేకపోవడంతో ఆయనే మళ్లీ మళ్లీ ఎన్నికవుతూ వచ్చారు. ఆయన మొత్తం 17 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు.

ఆయన కూతురు ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానిగా కొనసాగారు. అర్ధంతరంగా హత్యకు గురవడంతో ఆమె తండ్రి నెహ్రు రికార్డును అధిగమించలేకపోయారు. ఇందిర భారతదేశపు వ్యూహాత్మక ప్రధానిగా చెప్పొచ్చు. దేశానికి దిశానిర్ధేశం చేశారు. దేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మన దేశానికి అటు ఇటు ఉన్న పాకిస్తాన్ ను విడగొట్టి దేశానికి ఎంతో మేలు చేశారు. బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) ఇప్పటికీ అలాగే కొనసాగి ఉంటే దేశంతో ఎన్నో విధ్వంసాలకు గురయ్యేది.

This post was last modified on August 13, 2020 11:20 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago