Political News

నరేంద్రమోడీ కొత్త రికార్డు… !

నరేంద్ర మోడీ కొత్త రికార్డు నమోదు చేశారు. నేటితో అత్యధిక కాలం కొనసాగిన కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచారు. ఇప్పటివరకు వాజ్ పాయి మీద ఆ రికార్డు ఉండేది. నేటితో మోడీకి ఆ క్రెడిట్ దక్కింది. అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి మూడు సార్లు ప్రధాని అయినా… రోజుల లెక్కన వాజ్ పాయి ప్రధానిగా 2268 రోజులు మాత్రమే ఉన్నారు. ఇపుడు ఆ రికార్డు మోడీ కి దక్కింది.

భారతదేశానికి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ లు అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానులు. నాలుగో స్థానంలో మోడీ నిలిచారు. భారతదేశంపు 14వ ప్రధానమంత్రి అయిన మోడీ 2014 మే 26న తొలిసారి ప్రధాని అయ్యారు. తర్వాత రెండో సారి సంపూర్ణ మెజారిటీతో గెలిచి 2019, మే 30 ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక తొలి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ దేశాన్ని అత్యధిక కాలం ఏలిన వ్యక్తిగా చెప్పొచ్చు. బహుశా ఆ రికార్డు చెరిగిపోవడం చాలా కాష్టం. నెహ్రూ స్వతంత్ర సమర యోధుడు. అంతేకాదు అప్పట్లో వేరే పార్టీ లేకపోవడంతో ఆయనే మళ్లీ మళ్లీ ఎన్నికవుతూ వచ్చారు. ఆయన మొత్తం 17 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు.

ఆయన కూతురు ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానిగా కొనసాగారు. అర్ధంతరంగా హత్యకు గురవడంతో ఆమె తండ్రి నెహ్రు రికార్డును అధిగమించలేకపోయారు. ఇందిర భారతదేశపు వ్యూహాత్మక ప్రధానిగా చెప్పొచ్చు. దేశానికి దిశానిర్ధేశం చేశారు. దేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మన దేశానికి అటు ఇటు ఉన్న పాకిస్తాన్ ను విడగొట్టి దేశానికి ఎంతో మేలు చేశారు. బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) ఇప్పటికీ అలాగే కొనసాగి ఉంటే దేశంతో ఎన్నో విధ్వంసాలకు గురయ్యేది.

This post was last modified on August 13, 2020 11:20 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

21 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

3 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

5 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

6 hours ago