Political News

నరేంద్రమోడీ కొత్త రికార్డు… !

నరేంద్ర మోడీ కొత్త రికార్డు నమోదు చేశారు. నేటితో అత్యధిక కాలం కొనసాగిన కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచారు. ఇప్పటివరకు వాజ్ పాయి మీద ఆ రికార్డు ఉండేది. నేటితో మోడీకి ఆ క్రెడిట్ దక్కింది. అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి మూడు సార్లు ప్రధాని అయినా… రోజుల లెక్కన వాజ్ పాయి ప్రధానిగా 2268 రోజులు మాత్రమే ఉన్నారు. ఇపుడు ఆ రికార్డు మోడీ కి దక్కింది.

భారతదేశానికి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ లు అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానులు. నాలుగో స్థానంలో మోడీ నిలిచారు. భారతదేశంపు 14వ ప్రధానమంత్రి అయిన మోడీ 2014 మే 26న తొలిసారి ప్రధాని అయ్యారు. తర్వాత రెండో సారి సంపూర్ణ మెజారిటీతో గెలిచి 2019, మే 30 ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక తొలి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ దేశాన్ని అత్యధిక కాలం ఏలిన వ్యక్తిగా చెప్పొచ్చు. బహుశా ఆ రికార్డు చెరిగిపోవడం చాలా కాష్టం. నెహ్రూ స్వతంత్ర సమర యోధుడు. అంతేకాదు అప్పట్లో వేరే పార్టీ లేకపోవడంతో ఆయనే మళ్లీ మళ్లీ ఎన్నికవుతూ వచ్చారు. ఆయన మొత్తం 17 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు.

ఆయన కూతురు ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానిగా కొనసాగారు. అర్ధంతరంగా హత్యకు గురవడంతో ఆమె తండ్రి నెహ్రు రికార్డును అధిగమించలేకపోయారు. ఇందిర భారతదేశపు వ్యూహాత్మక ప్రధానిగా చెప్పొచ్చు. దేశానికి దిశానిర్ధేశం చేశారు. దేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మన దేశానికి అటు ఇటు ఉన్న పాకిస్తాన్ ను విడగొట్టి దేశానికి ఎంతో మేలు చేశారు. బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) ఇప్పటికీ అలాగే కొనసాగి ఉంటే దేశంతో ఎన్నో విధ్వంసాలకు గురయ్యేది.

This post was last modified on August 13, 2020 11:20 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago