తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగం చేశారా? కేంద్రం ప్రతిపాదించిన.. విద్యుత్ సంస్కరణలను అమలు చేసేది లేదని ఆయన తెగేసి చెప్పారా? అంటే.. ఔననే అంటున్నారు అధికారులు.. ప్రజా ప్రతినిధులు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే ఇన్సెంటివ్స్కు .. సంస్కరణలకు ముడి పెట్టిన విషయం తెలిసిందే. వివిధ రూపాల్లో తెచ్చిన సంస్కరణలు అమలు చేస్తే.. అదనంగా రుణాలు.. నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తామని.. గత రెండేళ్లుగా చెబుతున్న విషయం తెలిసిందే.
గతంలో ఒకసారి.. మంత్రి హరీష్ రావు.. ఇదే విషయాన్ని చెప్పారు. రైతులు వాడే విద్యుత్కు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పిందని ఇలా పెడితే 4 వేల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్గా ఇస్తామని పేర్కొందని.. కానీ, రైతుల ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని చెప్పారు. అదేసమంయంలో ఏపీ ప్రభుత్వం 4 వేల కోట్లకు కక్కుర్తి పడి అక్కడి రైతుల మెడలకు విద్యుత్ మీటర్ల ఉచ్చు బిగించిందని పెద్ద విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.
ఇప్పుడు మరోసారి.. విద్యుత్ సంస్కరణల అంశం తెరమీదికి వచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలకు ఓకే చెప్పింది. ఫలితంగా 0.5 శాతం చొప్పున జీఎస్డీపీలో కేంద్రం నుంచి ఇన్సెంటివ్ను తెచ్చుకోనుంది. కానీ, ఇదే సమయంలో తెలంగాణ దీనిని వదులుకుంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. అధికార పార్టీ నాయకులు కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. నిధులు కూడా వదులుకున్నారని వివరిస్తున్నారు.
ఏపీలో ఏం జరిగింది?
మూడు సంస్కరణలు ఇవే..
1) రాష్ట్ర ప్రభుత్వం రైతులు సహా ఎవరికైనా విద్యుత్ ఉచితంగా ఇచ్చినా, సబ్సిడీతో ఇచ్చినా ఆ బిల్లులు వినియోగదారులే ప్రతి నెల చెల్లించాలి. ఏ ఒక్క నెల కట్టకపోయినా కరెంట్ కట్ చేస్తారు.
2) ప్రస్తుతం ఇంటికో కరెంటు మీటర్ ఉంది. అందులో ఎన్ని యూనిట్లు కాలితే అంతకే బిల్లులు చెల్లిస్తున్నాం. కానీ, కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణ ప్రకారం ఇంటికో మీటర్తో పాటు కొన్ని ఇళ్ల సమూహాన్ని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్కో ప్రత్యేక మీటర్ పెట్టాలి. ఇళ్లలో ఉన్న మీటర్లలో కాలిన యూనిట్లకు, క్లస్టర్ మీటర్లో కాలిన యూనిట్లకు మధ్య తేడా ఉంటే ఆ తేడాను కూడా ఆ ఏరియాలో ఉన్న వినియోగదారులపై వేస్తారు.
3) ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ కరెంటు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. మీటర్లో డబ్బులు అయిపోగానే ప్రభుత్వ కార్యాలయాలకు ఆటోమేటిగ్గా కరెంట్ నిలిచిపోతుంది.
This post was last modified on June 29, 2023 2:06 pm
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…