Political News

రాహుల్ సీరియస్..ఆ ఇద్దరు ఎవరు ?

ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం తర్వాత నేతల్లో టెన్షన్ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించాలనే విషయమై సీనియర్ల నుండి సలహాలు, సూచనలు తీసుకునేందుకే ఈ స్ట్రాటజీ సమావేశం జరిగింది. అయితే సమావేశం మొదలవ్వగానే కొందరు నేతలు ఫిర్యాదులు చేయటానికి రెడీ అయ్యారు. దాంతో రాహుల్ సీరియస్ అయ్యారు. స్ట్రాటజీ సమావేశం నిర్వహించింది ఫిర్యాదులు చేసుకోవటానికి కాదని గెలుపుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయటానికి మాత్రమే అన్నారు.

ఇదే సమయంలో టీ కాంగ్రెస్ లో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ఇబ్బందులు పెడుతున్నారనే విషయాలన్నీ తనకు తెలుసని చెప్పారు. నేతలంతా క్రమశిక్షణతో నడుచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ గీతదాటిన ముగ్గురిని గుర్తించామని, పద్దతి మార్చుకోకపోతే ఇద్దరిపై చర్యలు తప్పవని ఘాటుగానే హెచ్చరించారు. దాంతో గీతదాటిన ముగ్గురు ఎవరు, చర్యలు తప్పవని హెచ్చరించిన ఆ ఇద్దరు నేతలు ఎవరు అనే విషయమై ఇపుడు చర్చలు జోరుగా జరుగుతోంది.

మరో ఆరుమాసాల్లో ఎన్నికలు పెట్టుకుని ఇంకా నేతలు తమలో తాము గొడవలు పడుతు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసుకుంటున్నారనే విషయంలో రాహూల్ చాలా సీరియస్ అయ్యారు. అందుకనే నేతల మద్య ఉన్న వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టేయమని పదేపదే చెబుతున్నారు. అయినా కొందరు నేతలు రాహుల్ చెప్పిన మాటలను, చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. దాంతో చాలామంది సినియర్ల మధ్య రెగ్యులర్ గా ఏదో విషయమై వివాదాలు రేగుతునే ఉన్నాయి.

పార్టీవర్గాల సమాచారం ప్రకారం అధిష్టానంపై నోరుపారేసుకోవటంతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బహిరంగంగా నోరుపారేసుకుంటున్నది భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి ఎంఎల్ఏ తూర్పు జయప్రకాష్ రెడ్డి. వీళ్ళిద్దరు ఏదో కారణంగా తరచూ రేవంత్ పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతునే ఉంటారు. వీళ్ళిద్దరి కారణంగా మిగిలిన సీనియర్లు కూడా ఎంతోకొంత ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు రేవంత్ తో మాట్లాడరు, రేవంత్ ఆదేశాలను పట్టించుకోరు. ఇపుడు రాహుల్ చేసిన హెచ్చరికలు వీళ్ళని దృష్టిలో పెట్టుకునేనా అనే చర్చ జోరుగా జరుగుతోంది. 

This post was last modified on June 28, 2023 6:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

9 minutes ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

10 minutes ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

25 minutes ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

1 hour ago

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…

2 hours ago

ఎన్నిసార్లు చెప్పాలి.. సీనియ‌ర్ న‌టి అస‌హ‌నం

90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…

3 hours ago