Political News

నేను ముఖ్య‌మంత్రి కావ‌డం ప‌రిష్కారం కాదు.. : ప‌వ‌న్

“నేను ముఖ్య‌మంత్రి కావాల‌ని మీకే కాదు..నాకు కూడా ఉంది. కానీ, నేను ముఖ్య‌మంత్రి అయినంత మాత్రాన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు” అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమవరంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం అయితే.. ఏదో ఒరిగిపోతుంద‌ని అనుకోవ‌డం స‌రికాద‌న్నారు. అయితే.. తాము అధికారంలోకి వ‌స్తే.. కొంత మేలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

కాపుల్లో తూర్పుకాపులు చాలా వెనుక బ‌డ్డార‌ని.. అస‌లు వారు ఎందరు ఉన్నానేది కూడా ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌రైన లెక్క‌లు లేవ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే తూర్పు కాపుల‌ జనగణన చేపడతామన్నారు.  చట్టంతో అందరికీ న్యాయం జరిగితే.. కులాలతో సంబంధం లేదని, చట్టం పనిచేయనప్పుడు కులాల వైపు చూస్తార‌ని చెప్పారు. తూర్పుకాపుల్లో బలమైన నాయకులు ఉన్నారని.. వారు ఎదుగుతున్నారు.. కులాన్ని పట్టించుకోవడం లేదన్నది మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆలోచించాలని విమ‌ర్శించారు.

“తూర్పుకాపుల్లో మంత్రులు ఉన్నారు.. ఎమ్మెల్యేలు ఉన్నారు.. వారు తిన్నాకైనా వారి కులం గురించి ఆలోచించాలి. ఇతర బీసీ కులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు, తూర్పుకాపులకు ఎందుకు ఇవ్వరు?  ఇవ్వకపోవడానికి హేతుబద్ధత ఏంటి“ అని ప‌వ‌న్ నిల‌దీశారు. తూర్పు కాపుల సంక్షేమానికి తాము అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తామ‌ని  పవన్ అన్నారు. దీనికి జ‌న‌సేన బాధ్య‌త తీసుకుంటుంద‌ని చెప్పారు. త‌న పోరాట యాత్ర 2014లో శ్రీకాకుళం నుంచే మొదలుపెట్టానని తెలిపారు.

బొత్స గారు తెలుసుకోవాలి..

“మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఒక్క‌టే చెబుతున్నా.. ఆయ‌న ఒక విష‌యం తెలుసుకోవాలి. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ వలస కార్మికులు వస్తున్నారు. వారిలోనూ తూర్పు కాపులు ఎక్కువ‌గా ఉన్నారు.తూర్పు కాపుల సంఖ్యను టీడీపీ 26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం 16 లక్షలని చెబుతోందని.. కానీ వారు 45 లక్షల మంది ఉన్నారు” అని అన్నారు. ఇంత‌మందిని జ‌గ‌న్ గాలికి వ‌దిలేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

తెలంగాణ‌లోనూ అన్యాయం చేశారు.,

తెలంగాణాలోనూ తూర్పు కాపుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని ప‌వ‌న్ అన్నారు. ఆ రాష్ట్రంలో 31 కులాల బీసీ జాబితా నుంచి తూర్పు కాపులను తొలగించారని చెప్పారు.  అయినా నాయకులు పట్టించుకోలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీసీ కులాల జనగణనకు అనుకూలంగా ఉన్నానని పవన్ తెలిపారు. “మ‌ళ్లీ చెబుతున్నా నేను సీఎం అయితే అన్నింటికి పరిష్కారం కాదు.  సీఎం అవ్వడం అన్నింటికీ మంత్రదండం కాదు. నేను సీఎం అయిన తరువాత చేయాలనుకున్నా.. అధికారులో, నాయకులో అడ్డుపడతారు. చైతన్యవంతమైన సమాజంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. 

This post was last modified on June 27, 2023 11:36 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

51 minutes ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

3 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

4 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

5 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

5 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

5 hours ago