Political News

ముద్ర‌గ‌డపై బేన‌ర్.. దించేయ‌మ‌న్న ప‌వ‌న్

ఒక‌ప్పుడు కాపు ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి.. కొన్నేళ్లుగా సైలెంటుగా ఉంటున్న ఆంధ్రా నేత ముద్ర‌గ‌డ పద్మ‌నాభం కొన్ని రోజులుగా వార్త‌ల్లో వ్య‌క్తిగా మారారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆయ‌న రాసిన లేఖ పెద్ద చ‌ర్చ‌కే దారి తీసింది.

కాపుల‌కు పెద్ద‌గా ఏమీ చేయ‌ని వైసీపీ వైపు నిల‌బ‌డి.. ప‌వ‌న్‌ను టార్గెట్ చేయ‌డం జ‌న‌సైనికుల‌కే కాక మెజారిటీ కాపు ప్ర‌జానీకానికి కూడా న‌చ్చ‌లేదు. లేఖ‌లో ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని వెనకేసుకొస్తూ.. ప‌వ‌న్ మీద విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మెజారిటీ జ‌నానికి రుచించ‌లేదు.

ముద్ర‌గ‌డ మీద మునుపెన్న‌డూ లేని స్థాయిలో వ్య‌తిరేకత క‌నిపించింది ఈ లేఖ త‌ర్వాత‌. సామాజిక మాధ్య‌మాల్లో అయితే ముద్ర‌గ‌డ మీద నెటిజ‌న్లు మామూలుగా విరుచుకుప‌డ‌లేదు.

ఐతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ముద్ర‌గ‌డ మీద మాట్లాడాల‌ని.. ఆయ‌న లేఖ‌కు దీటుగా బ‌దులు చెప్పాల‌ని జ‌నసైనికులు ఆశించారు. వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ ఈ పని చేస్తాడని ఆశించారు. కానీ ప‌వ‌న్ మాత్రం ముద్ర‌గ‌డ‌ను టార్గెట్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ట్లేదు. ఆయ‌న సీనియారిటీకి గౌర‌వం ఇచ్చి త‌న ఔన్న‌త్యాన్ని చాటుకున్నాడు.

తాజాగా రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వారాహి యాత్ర సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతుండ‌గా.. ఒక జ‌న‌సైనికుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు వ్య‌తిరేకంగా ఒక బేన‌ర్ ప‌ట్టుకుని క‌నిపించాడు. అది ప‌వ‌న్ దృష్టిలో ప‌డింది. ప‌వ‌న్ త‌న ప్ర‌సంగాన్ని ఆపి.. ఆ బేన‌ర్‌ను దించేయ‌మ‌ని కోరాడు. పెద్ద‌లు మ‌న‌ల్ని కొన్నిసార్లు కొన్ని మాట‌లు అంటారు. అంత‌మాత్రాన వాళ్ల‌ను మ‌నం ఏమీ అన‌కూడ‌దు, పెద్ద‌ల్ని గౌర‌వించాలి.. అంటూ ముద్ర‌గ‌డ పేరెత్త‌కుండానే త‌న హుందాత‌నాన్ని చాటుకున్నాడు ప‌వ‌న్. ఈ చ‌ర్య ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

This post was last modified on June 26, 2023 8:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago