Political News

నాపై సుపారీ గ్యాంగుల‌ను పంపిస్తున్నారు.. ప‌వ‌న్

కొన్ని రోజుల కింద‌ట త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. 2019లో క‌నుక వైసీపీ అధికారంలోకి రాక‌పోయి ఉంటే.. త‌న‌ను చంపేసేవార‌ని ఆయ‌న తూర్పుగోదావ‌రి జిల్లా వారాహి యాత్ర‌లో వ్యాఖ్యానించి సంచ‌ల‌నం రేపారు. ఇక‌, ఇప్పుడు తాజాగా.. త‌న‌ను చంపించేందుకు కొంద‌రు వైసీపీ ముఠా నాయ‌కులు.. సుపారీ గ్యాంగుల‌ను పంపిస్తున్నార‌ని చెప్పారు. తాజాగా ఆయ‌న మ‌లికిపురంలో యాత్ర‌నుర‌ద్దు చేసుకున్న నేప‌థ్యంలో స్థానిక పార్టీ నేత‌ల‌తో అంత‌ర్గ‌త స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ..త‌న‌ను చంపేందుకు సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయ‌ని చెప్పారు.

అయినా.. తాను ఏమాత్రం భ‌య‌ప‌డేది లేద‌ని ప‌వ‌న్ చెప్పారు. సుపారీ గ్యాంగుల‌కు.. ఆకు రౌడీల‌కు ప‌వ‌న్ భ‌య‌ప‌డ‌డ‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌ ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జగన్ రెడ్డి పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు విముక్తి కల్పించడమే జనసేన పార్టీ ముఖ్యమ లక్ష్యమని ప్రకటించారు. ‘ఉభయగోదావరి జిల్లాలను జనసేన పార్టీ ప్రత్యేకంగా తీసుకుంది. ఎందుకంటే.. వైసీపీ పాలన నుంచి ఈ జిల్లాలను ముందుగా విముక్తి చేయాలి” అని అన్నారు.

వైసీపీ అంటే కోపం లేదు!

త‌న‌కు వైసీపీ అన్నా.. ముఖ్యమంత్రి జ‌గ‌న్ అన్నా కోపం లేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. త‌న కోపం అంతా కూడా వైసీపీ దుర్మార్గ‌పు పాలన పైనేన‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వేయని పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాజోలు నుంచి కారులో వస్తుంటే అదొక పడవ ప్రయాణంలా త‌న‌కు అనిపించిందన్నారు. అందుకే వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు విముక్తి కల్పించడమే త‌న పార్టీ మొదటి లక్ష్యంగా నిర్ణ‌యించింద‌ని ప‌వ‌న్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతామ‌న‌నారు. అందరికీ అన్నం పెట్టే గోదారి నేలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంద‌ని తెలిపారు.

అప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యే కూడా కాలేవ్‌: మంత్రి సీదిరి

జ‌న‌సేనాని ప‌వ‌న్‌పై మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ఫైర‌య్యారు. సీఎం అని చెప్పే ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. జ‌న‌సేన పార్టీ ఏన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తోందో కూడా తెలియ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. అలాంట‌ప్పుడు ప‌వ‌న్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్ర‌శ్నించారు. కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకే.. పవన్ ముఖ్య‌మంత్రి జ‌పం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. రాష్ట్రంలో వైసీపీ రహితం ఎందుకు చెయ్యాలో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత‌ చంద్రబాబుకు వంతపాడినంత కాలం ప‌వ‌న్ ఎమ్మెల్యే కూడా కాలేర‌ని వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

8 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

11 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

13 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

13 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

13 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

14 hours ago