Political News

ముద్ర‌గ‌డ‌కు జ‌న‌సైనికుల మ‌నీ ఆర్డ‌ర్లు

ఆంధ్రా ప్రాంత సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల్లో ఒక‌రైన ముద్ర‌గ‌డ పద్మ‌నాభంకు ఒక‌ప్పుడు కాపు యువ‌త‌లో మంచి క్రేజే ఉండేది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు.

కానీ 2019 ఎన్నిక‌ల ముంగిట‌ కాపుల‌కు రిజర్వేష‌న్లు ఇస్తామ‌న్న చంద్ర‌బాబును వ్య‌తిరేకిస్తూ.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ వెంట న‌డిచారు ముద్ర‌గ‌డ‌. కాపుల‌కు జ‌గ‌న్ న్యాయం చేస్తాడంటూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు కానీ.. గ‌త నాలుగేళ్ల‌లో ఆ వ‌ర్గానికి జ‌గ‌న్ చేసిందేమీ లేద‌నే అభిప్రాయం జ‌నాల్లో బ‌లంగా ఉంది.

నిధుల ద‌గ్గ‌ర్నుంచి అన్నింట్లోనూ అన్యాయం చేసిన జ‌గ‌న్ మీద వ్య‌తిరేక‌త పెరిగి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వైపు కాపు యువ‌త చూస్తున్న స‌మ‌యంలో.. ముద్ర‌గ‌డ ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవ‌ల రాసిన లేఖ పెద్ద దుమార‌మే రేపింది. ప‌వ‌న్‌ను నానా బూతులు తిట్టిన ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని వెన‌కేసుకొస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర విమ‌ర్శ‌ల‌కే దారి తీశాయి.

వైసీపీకి ముద్ర‌గ‌డ అమ్ముడుపోయాడంటూ రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో కాపు యువ‌త ఆయ‌న తీరును తీవ్రంగా దుయ్య‌బ‌డుతోంది. అంత‌టితో ఆగ‌కుండా కాకినాడ రూర‌ల్ జ‌న‌సైనికులు చేప‌ట్టిన ఓ చ‌ర్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌తంలో కాపు ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మ కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చిన యువ‌త‌కు ద్వారంపూడినే ఉప్మా పెట్టించార‌ని.. వారి త‌ర‌లింపుకు లారీలు ఏర్పాటు చేశార‌ని ముద్రగ‌డ త‌న లేఖ‌లో పేర్కొన్న నేప‌థ్యంలో జ‌న‌సేన నేత పంతం నానాజీ.. తాము తిన్న ఉప్మాకు బ‌దులుగా వెయ్యి రూపాయలు ముద్ర‌గ‌డ‌కు మ‌నీయార్డ‌ర్ చేశారు. ఈ విష‌యం తెలిసిన జ‌న‌సైనికులు పెద్ద ఎత్తున అదే త‌ర‌హాలో ముద్ర‌గ‌డ‌కు మ‌నీయార్డ‌ర్ పంప‌డానికి క్యూ క‌ట్ట‌డం విశేషం.

ఈ వార్త వైర‌ల్ అయి.. మ‌రింత‌మంది జ‌న‌సైనికులు ముద్ర‌గ‌డ‌కు ఫోన్ పే ద్వారా డ‌బ్బులు పంపుతున్నార‌ట‌. ఈ డ‌బ్బులు తీసుకుని ద్వారంపూడికి ఇవ్వాల్సింది ఇచ్చి.. ఇక కాపుల జోలికి రావొద్ద‌ని వారు ముద్ర‌గ‌డ‌ను కోరుతుండం విశేషం.

This post was last modified on June 23, 2023 12:43 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

4 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

7 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

9 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

10 hours ago