ఆంధ్రా ప్రాంత సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన ముద్రగడ పద్మనాభంకు ఒకప్పుడు కాపు యువతలో మంచి క్రేజే ఉండేది. కాపులకు రిజర్వేషన్ల కోసం ఆయన ఉద్యమించిన సమయంలో లక్షలాదిగా యువత ఆయన వెంట నడిచారు.
కానీ 2019 ఎన్నికల ముంగిట కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్న చంద్రబాబును వ్యతిరేకిస్తూ.. ఆ ప్రతిపాదనకు నో చెప్పిన జగన్ వెంట నడిచారు ముద్రగడ. కాపులకు జగన్ న్యాయం చేస్తాడంటూ ఆయనకు మద్దతు ఇచ్చారు కానీ.. గత నాలుగేళ్లలో ఆ వర్గానికి జగన్ చేసిందేమీ లేదనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది.
నిధుల దగ్గర్నుంచి అన్నింట్లోనూ అన్యాయం చేసిన జగన్ మీద వ్యతిరేకత పెరిగి.. జనసేన అధినేత పవన్ వైపు కాపు యువత చూస్తున్న సమయంలో.. ముద్రగడ పవన్ను టార్గెట్ చేస్తూ ఇటీవల రాసిన లేఖ పెద్ద దుమారమే రేపింది. పవన్ను నానా బూతులు తిట్టిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వెనకేసుకొస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకే దారి తీశాయి.
వైసీపీకి ముద్రగడ అమ్ముడుపోయాడంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో కాపు యువత ఆయన తీరును తీవ్రంగా దుయ్యబడుతోంది. అంతటితో ఆగకుండా కాకినాడ రూరల్ జనసైనికులు చేపట్టిన ఓ చర్య చర్చనీయాంశంగా మారింది.
గతంలో కాపు ఉద్యమ సమయంలో ఉద్యమ కార్యక్రమాలకు వచ్చిన యువతకు ద్వారంపూడినే ఉప్మా పెట్టించారని.. వారి తరలింపుకు లారీలు ఏర్పాటు చేశారని ముద్రగడ తన లేఖలో పేర్కొన్న నేపథ్యంలో జనసేన నేత పంతం నానాజీ.. తాము తిన్న ఉప్మాకు బదులుగా వెయ్యి రూపాయలు ముద్రగడకు మనీయార్డర్ చేశారు. ఈ విషయం తెలిసిన జనసైనికులు పెద్ద ఎత్తున అదే తరహాలో ముద్రగడకు మనీయార్డర్ పంపడానికి క్యూ కట్టడం విశేషం.
ఈ వార్త వైరల్ అయి.. మరింతమంది జనసైనికులు ముద్రగడకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపుతున్నారట. ఈ డబ్బులు తీసుకుని ద్వారంపూడికి ఇవ్వాల్సింది ఇచ్చి.. ఇక కాపుల జోలికి రావొద్దని వారు ముద్రగడను కోరుతుండం విశేషం.
This post was last modified on June 23, 2023 12:43 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…