Political News

ఉరుము లేని పిడుగులా.. ‘జ‌గ‌న‌న్న సుర‌క్ష‌’ అస‌లేంటిది?!

ఎలాంటి హ‌డావుడీ లేకుండా.. ఎక్క‌డా ప్ర‌చారం కూడా చేసుకోకుండానే తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్.. జ‌గ‌న‌న్న సుర‌క్ష‌ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. అదికూడా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల స‌మ‌క్షంలోనే ఆయ‌న దీనిని ప్ర‌క‌టించి.. వారిని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. దీంతో ఒక్క‌సారిగా జ‌గ‌న‌న్న సుర‌క్ష‌ అంటే ఏంట‌నే చ‌ర్చ ప్రారంభ‌మైంది. మ‌రి ఇదేంటో తెలుసుకుందాం.

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. ల‌బ్ధిదారుల‌కు నిధులు అందిస్తోంది. అయితే.. ఏవైనా కారణాల వల్ల ఎవరైనా అర్హులకు సంక్షేమ పథకాలు అందనట్లయితే వారికి పథకాలు అందించేలా, సేవలకు సంబంధించి అవసరమైన పత్రాలు వెంటనే మంజూరుచేసే కార్య‌క్ర‌మ‌మే జ‌గ‌న‌న్న సుర‌క్ష‌. పేరు డిఫ‌రెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ ప‌థ‌కం ఉద్దేశం మాత్రం ఇదే.

ప్రజల వద్దకు నేరుగా వలంటీర్లు, సచివాలయ గృహసారథులను పంపించి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు వారికి పథకాలు లేదా పత్రాల మంజురుకు సంబంధించి సమస్యలుంటే తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమానికి నాంది పలికిన‌ట్టు సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఈ నెల 23న ప్రారంభించనున్నారు.

ఈ నెల 24నుంచి వలంటీర్లు, గృహసారథులులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. పథకాలు, సేవలకు సంబంధించి ప్రజలు సమస్యలు తెలిపిన పక్షంలో వివరాలను తెలుసుకుని, సేవలకు సంబంధించి అవసరమైన ఆదాయ, కుల, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, మ్యుటేషన్‌లు, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ అప్‌డేషన్‌, క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్‌లు వంటివి మంజూరు గురించి వివరిస్తారు.

ఎవరైనా పథకాలు, సేవలకు సంబంధించిన సమస్యలు చెప్తే వాటికి సంబంధించి అవసరమైన దరఖాస్తులను తీసుకుని సచివాలయంలో అందజేస్తారు. ప్రతి సచివాలయం పరిధిలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం నిర్వహిస్తారు. వారంలో మూడు సచివాలయాల చొప్పున నెలరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మున్సిపాలిటీ, మండలంలోని అన్ని సచివాలయాల్లో ఈ క్యాంపు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

జగనన్న సురక్ష ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లబ్ధి చేకూరుస్తారు. అంటే.. ఆయా ప‌థ‌కాల్లో నిధులు అందిస్తార‌న్న‌మాట‌. ఏదేమైనా ఎన్నిక‌ల‌కు ముందు.. ఏదో ఒక విధంగా ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డ‌మే ఈ ప‌థ‌కం ఉద్దేశ‌మ‌ని అంటున్నారు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.

This post was last modified on June 22, 2023 12:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

3 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago