Political News

కన్నబాబు విషయంలో పవన్ పశ్చాత్తాపం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుపై మాత్రం పవన్ విమర్శలు చేయలేదు. దీంతో, సోషల్ మీడియాలో పవన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం తరఫున కన్నబాబు గెలిచారని, మెగా ఫ్యామిలీతో కన్నబాబుకు సన్నిహిత సంబంధాలున్నందునే ఆయనపై పవన్ విమర్శలు చేయడం లేదని నెటిజన్లు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కన్నబాబును రాజకీయాల్లోకి తీసుకువచ్చి తప్పు చేశామని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నబాబుకు ప్రజారాజ్యంలో టికెట్ ఇచ్చినప్పుడు ఆయన చేతిలో చిల్లిగవ్వలేదని, ఎన్నికల ఖర్చు మొత్తం చిరంజీవి పెట్టుకున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు ఈనాడు రిపోర్టర్ గా ఉన్న కన్నబాబును చిరంజీవి చేరదీసి పార్టీలో చేర్చుకున్నారని, ఆ తర్వాత టికెట్ ఇచ్చి గెలిపించారని అన్నారు. కానీ, ఈరోజు జనసేనపై కన్నబాబు విమర్శలు చేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నబాబును రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశానని పవన్ అన్నారు. కేవలం ఓట్ల కోసమే యువతను వైసిపి నాయకులు వాడుకుంటున్నారని, సమాజాన్ని కులాల వారీగా విడదీసి ఓట్లు దండుకుంటున్నారని పవన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, యువత భవిష్యత్తును వైసీసీ నేతలు మర్చిపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కులాన్ని వాడుకుని నాయకులు ఎదుగుతున్నారని, కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారో లేదో వైసీపీ నాయకులు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ బిడ్డని చెరుకు తోటలో నిర్ధాక్షిణ్యంగా కాల్చేస్తే బీసీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే తోట త్రిమూర్తులు, కన్నబాబు ఏం చేశారని నిలదీశారు. ఏమైనా మాట్లాడితే కన్నబాబు బాధపడతారని, తామే రాజకీయాల్లోకి తీసుకువచ్చిన వ్యక్తి తమపై విమర్శలు చేయడం తమ దురదృష్టకరమని అన్నారు.

This post was last modified on June 19, 2023 3:57 pm

Share

Recent Posts

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…

10 minutes ago

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

41 minutes ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

3 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

3 hours ago

బొత్స వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం

మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది…

4 hours ago

నాయకుడు లేకుండా యుద్ధం ఎలా జగన్?

స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్‌ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్‌ ఇస్తున్న…

4 hours ago