వైసీపీలో కీలక నాయకుడు, సీఎం జగన్కు ఒకప్పుడు రైట్ హ్యాండ్గా ఉన్న వి. విజయసాయిరెడ్డిని కొన్ని నెలలుగా పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే.అయితే.. ఆయనను ఎందుకు పక్కన పెట్టారు? అనేది తరచుగా చర్చకు వస్తూనే ఉంది. కానీ, వైసీపీ నాయకులు ఎవరూ కూడా దీనిపై స్పందించిన పాపాన పోలేదు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ ఈ విషయంపై రియాక్ట్ అయింది. విజయసాయిరెడ్డిని వైసీపీ అధినేత ఎందుకు పక్కన పెట్టారనే విషయంపై టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.
ఉత్తరాంధ్రలో శాంతిభద్రతలు క్షీణించాయని బుద్దా వెంకన్న అన్నారు. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నానని, జగన్ సీఎం అయ్యాక రూ. 60 వేల కోట్ల భూ మాఫియా విశాఖ, పరిసర ప్రాంతాల్లో జరిగిందని ఆరోపించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, జగన్ కలిసే భూదందా నడిపించారని, ఈ భూ వివాదంపైనే విజయసాయి రెడ్డిని జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారని అన్నారు.
ఇప్పుడు ఎంపీ సత్యనారాయణ వంతు రావడం వల్లే.. ఆయన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయించా రని, వాళ్ల పేరుతో ఉన్న భూములను తిరిగి రాయించుకునేందుకే ఈ కిడ్నాప్ చేశారని బుద్దా వెంకన్న అన్నారు. ఎంపీని కిడ్నాప్ చేయకుండా కుటుంబ సభ్యులను చేయడం ద్వారా ఏంపీని భయపెట్టాలని ప్లాన్ చేశారన్నారు. గతంలో దోచుకున్న లావాదేవీలపై తేడాలు వచ్చాయని ఎవరూ బయటకు చెప్పలేక పోతున్నారని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. కిడ్నాప్ ఉదంతాన్ని తేలిగ్గా తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం చిన్న విషయమా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో గొడ్డలి పోటును గుండె పోటు అన్నారని, ఇప్పుడు ఇదే తహాలో కిడ్నాప్ ఉదంతాన్ని కూడా మార్చ డానికి చూస్తున్నారని, సీబీఐ రంగలోకి దిగి.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖలోనే అమిత్ షా కూడా జగన్ అవినీతి ముఖ్యమంత్రి అని చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…