వైసీపీలో కీలక నాయకుడు, సీఎం జగన్కు ఒకప్పుడు రైట్ హ్యాండ్గా ఉన్న వి. విజయసాయిరెడ్డిని కొన్ని నెలలుగా పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే.అయితే.. ఆయనను ఎందుకు పక్కన పెట్టారు? అనేది తరచుగా చర్చకు వస్తూనే ఉంది. కానీ, వైసీపీ నాయకులు ఎవరూ కూడా దీనిపై స్పందించిన పాపాన పోలేదు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ ఈ విషయంపై రియాక్ట్ అయింది. విజయసాయిరెడ్డిని వైసీపీ అధినేత ఎందుకు పక్కన పెట్టారనే విషయంపై టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.
ఉత్తరాంధ్రలో శాంతిభద్రతలు క్షీణించాయని బుద్దా వెంకన్న అన్నారు. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నానని, జగన్ సీఎం అయ్యాక రూ. 60 వేల కోట్ల భూ మాఫియా విశాఖ, పరిసర ప్రాంతాల్లో జరిగిందని ఆరోపించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, జగన్ కలిసే భూదందా నడిపించారని, ఈ భూ వివాదంపైనే విజయసాయి రెడ్డిని జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారని అన్నారు.
ఇప్పుడు ఎంపీ సత్యనారాయణ వంతు రావడం వల్లే.. ఆయన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయించా రని, వాళ్ల పేరుతో ఉన్న భూములను తిరిగి రాయించుకునేందుకే ఈ కిడ్నాప్ చేశారని బుద్దా వెంకన్న అన్నారు. ఎంపీని కిడ్నాప్ చేయకుండా కుటుంబ సభ్యులను చేయడం ద్వారా ఏంపీని భయపెట్టాలని ప్లాన్ చేశారన్నారు. గతంలో దోచుకున్న లావాదేవీలపై తేడాలు వచ్చాయని ఎవరూ బయటకు చెప్పలేక పోతున్నారని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. కిడ్నాప్ ఉదంతాన్ని తేలిగ్గా తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం చిన్న విషయమా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో గొడ్డలి పోటును గుండె పోటు అన్నారని, ఇప్పుడు ఇదే తహాలో కిడ్నాప్ ఉదంతాన్ని కూడా మార్చ డానికి చూస్తున్నారని, సీబీఐ రంగలోకి దిగి.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖలోనే అమిత్ షా కూడా జగన్ అవినీతి ముఖ్యమంత్రి అని చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
This post was last modified on June 18, 2023 5:24 pm
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…