వైసీపీలో కీలక నాయకుడు, సీఎం జగన్కు ఒకప్పుడు రైట్ హ్యాండ్గా ఉన్న వి. విజయసాయిరెడ్డిని కొన్ని నెలలుగా పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే.అయితే.. ఆయనను ఎందుకు పక్కన పెట్టారు? అనేది తరచుగా చర్చకు వస్తూనే ఉంది. కానీ, వైసీపీ నాయకులు ఎవరూ కూడా దీనిపై స్పందించిన పాపాన పోలేదు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ ఈ విషయంపై రియాక్ట్ అయింది. విజయసాయిరెడ్డిని వైసీపీ అధినేత ఎందుకు పక్కన పెట్టారనే విషయంపై టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.
ఉత్తరాంధ్రలో శాంతిభద్రతలు క్షీణించాయని బుద్దా వెంకన్న అన్నారు. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నానని, జగన్ సీఎం అయ్యాక రూ. 60 వేల కోట్ల భూ మాఫియా విశాఖ, పరిసర ప్రాంతాల్లో జరిగిందని ఆరోపించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, జగన్ కలిసే భూదందా నడిపించారని, ఈ భూ వివాదంపైనే విజయసాయి రెడ్డిని జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారని అన్నారు.
ఇప్పుడు ఎంపీ సత్యనారాయణ వంతు రావడం వల్లే.. ఆయన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయించా రని, వాళ్ల పేరుతో ఉన్న భూములను తిరిగి రాయించుకునేందుకే ఈ కిడ్నాప్ చేశారని బుద్దా వెంకన్న అన్నారు. ఎంపీని కిడ్నాప్ చేయకుండా కుటుంబ సభ్యులను చేయడం ద్వారా ఏంపీని భయపెట్టాలని ప్లాన్ చేశారన్నారు. గతంలో దోచుకున్న లావాదేవీలపై తేడాలు వచ్చాయని ఎవరూ బయటకు చెప్పలేక పోతున్నారని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. కిడ్నాప్ ఉదంతాన్ని తేలిగ్గా తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం చిన్న విషయమా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో గొడ్డలి పోటును గుండె పోటు అన్నారని, ఇప్పుడు ఇదే తహాలో కిడ్నాప్ ఉదంతాన్ని కూడా మార్చ డానికి చూస్తున్నారని, సీబీఐ రంగలోకి దిగి.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖలోనే అమిత్ షా కూడా జగన్ అవినీతి ముఖ్యమంత్రి అని చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
This post was last modified on June 18, 2023 5:24 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…