Political News

వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్…అసలేం జరిగింది?

వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సత్యనారాయణ భార్య జ్యోతితో పాటు ఆయన కుమారుడు శరత్ చంద్ర, వారి ఆడిటర్ జీవీల కిడ్నాప్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఆ కిడ్నాప్ వెనుక రాజకీయ కోణం ఉందన్న రీతిలో పుకార్లు వచ్చాయి. కానీ, ఈ కిడ్నాప్ జరిగిన కొద్ది గంటలలోపే పోలీసులు ఆ మిస్టరీని ఛేదించారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులను సురక్షితంగా రెస్క్యూ చేశారు.

ఈ నేపథ్యంలో ఈ మొత్తం కిడ్నాప్ ఎపిసోడ్ పై వైజాగ్ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కిడ్నాప్ కు సంబంధించిన పలు వివరాలను ఆయన వెల్లడించారు. కేవలం డబ్బు కోసమే సత్యనారాయణ భార్య కుమారుడు కిడ్నాప్ చేశారని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 13న శరత్ చంద్రను కిడ్నాప్ చేశారని, ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత శరత్ తల్లిని కూడా బెదిరించి బంగారం, నగదు తీసుకున్నారని వెల్లడించారు. ఆడిటర్ జీవీ దగ్గర సత్యన్నారాయణ ఆస్తిపాస్తులకు, నగదుకు సంబంధించిన వివరాలు ఉంటాయని ఆయనను కూడా కిడ్నాప్ చేసినట్టుగా త్రివితక్రమ వర్మ మీడియాకు వెల్లడించారు.

శరత్ చంద్ర, జీవీల ఖాతాలలో కోటిన్నరకు పైగా లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించామని అన్నారు. ఆ ముగ్గురిని వారి కారులోనే ఎక్కించుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే, తాను ఫోన్ చేసినా ఆడిటర్ జీవీ స్పందించడం లేదని సత్యనారాయణ చేసిన కంప్లైంట్ తో పోలీసులు రంగంలోకి దిగారని వివరించారు. ఈ కిడ్నాప్ వెనుక మొత్తం 7గురు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని, ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని అన్నారు.

ఎంపీ నివాసంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసు బృందాలు అప్రమత్తమై జీవీకి ఫోన్ చేసి ట్రేస్ చేయడం మొదలుపెట్టాయని వెల్లడించారు. అయితే, జీవీ శ్రీకాకుళం నుంచి వస్తున్నాను అని చెప్పారని, కానీ, ఆయన చెప్పిన వివరాలకు వాస్తవాలకు పంపడం లేకపోవడంతో అనుమానం వచ్చిందని అన్నారు. జీవీ సెల్ సిగ్నల్ ఆధారంగా వారు విజయనగరం వైపు వెళ్తున్నారని గుర్తించి ఛేజ్ చేసి వారిని పట్టుకున్నామని అన్నారు. హేమంత్, రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని అన్నారు. ఈ కిడ్నాపర్లలో ఒకరు సత్యనారాయణ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్ గా గతంలో పని చేశారని, డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారని గుర్తించామని అన్నారు. హేమంత్ పై హత్య కేసుతో పాటు 12 కేసులున్నాయని వెల్లడించారు.

This post was last modified on June 16, 2023 8:48 am

Share
Show comments
Published by
Satya
Tags: YCP MP

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

43 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago