Political News

వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్…అసలేం జరిగింది?

వైసీపీ నేత, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సత్యనారాయణ భార్య జ్యోతితో పాటు ఆయన కుమారుడు శరత్ చంద్ర, వారి ఆడిటర్ జీవీల కిడ్నాప్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఆ కిడ్నాప్ వెనుక రాజకీయ కోణం ఉందన్న రీతిలో పుకార్లు వచ్చాయి. కానీ, ఈ కిడ్నాప్ జరిగిన కొద్ది గంటలలోపే పోలీసులు ఆ మిస్టరీని ఛేదించారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులను సురక్షితంగా రెస్క్యూ చేశారు.

ఈ నేపథ్యంలో ఈ మొత్తం కిడ్నాప్ ఎపిసోడ్ పై వైజాగ్ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కిడ్నాప్ కు సంబంధించిన పలు వివరాలను ఆయన వెల్లడించారు. కేవలం డబ్బు కోసమే సత్యనారాయణ భార్య కుమారుడు కిడ్నాప్ చేశారని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 13న శరత్ చంద్రను కిడ్నాప్ చేశారని, ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత శరత్ తల్లిని కూడా బెదిరించి బంగారం, నగదు తీసుకున్నారని వెల్లడించారు. ఆడిటర్ జీవీ దగ్గర సత్యన్నారాయణ ఆస్తిపాస్తులకు, నగదుకు సంబంధించిన వివరాలు ఉంటాయని ఆయనను కూడా కిడ్నాప్ చేసినట్టుగా త్రివితక్రమ వర్మ మీడియాకు వెల్లడించారు.

శరత్ చంద్ర, జీవీల ఖాతాలలో కోటిన్నరకు పైగా లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించామని అన్నారు. ఆ ముగ్గురిని వారి కారులోనే ఎక్కించుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే, తాను ఫోన్ చేసినా ఆడిటర్ జీవీ స్పందించడం లేదని సత్యనారాయణ చేసిన కంప్లైంట్ తో పోలీసులు రంగంలోకి దిగారని వివరించారు. ఈ కిడ్నాప్ వెనుక మొత్తం 7గురు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని, ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని అన్నారు.

ఎంపీ నివాసంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసు బృందాలు అప్రమత్తమై జీవీకి ఫోన్ చేసి ట్రేస్ చేయడం మొదలుపెట్టాయని వెల్లడించారు. అయితే, జీవీ శ్రీకాకుళం నుంచి వస్తున్నాను అని చెప్పారని, కానీ, ఆయన చెప్పిన వివరాలకు వాస్తవాలకు పంపడం లేకపోవడంతో అనుమానం వచ్చిందని అన్నారు. జీవీ సెల్ సిగ్నల్ ఆధారంగా వారు విజయనగరం వైపు వెళ్తున్నారని గుర్తించి ఛేజ్ చేసి వారిని పట్టుకున్నామని అన్నారు. హేమంత్, రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని అన్నారు. ఈ కిడ్నాపర్లలో ఒకరు సత్యనారాయణ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్ గా గతంలో పని చేశారని, డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారని గుర్తించామని అన్నారు. హేమంత్ పై హత్య కేసుతో పాటు 12 కేసులున్నాయని వెల్లడించారు.

This post was last modified on June 16, 2023 8:48 am

Share
Show comments
Published by
satya
Tags: YCP MP

Recent Posts

రాజ్ తరుణ్ ఉదంతంలో భిన్న కోణాలు

ఎందుకో కానీ ఈ మధ్య నటీనటులు తరచుగా వివాదాలు, పోలీసు కేసుల్లో చిక్కుకుని మీడియాలో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా…

47 mins ago

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు.. చంద్ర‌బాబుపై నింగినంటిన అభిమానం!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు చాలా ఏళ్ల త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. 2014లో ఆయ‌న అప్ప‌టి…

49 mins ago

కృష్ణుడిగా మహేష్ బాబు – నాగ్ అశ్విన్ రియాక్షన్

కల్కి 2898 ఏడిలో శ్రీకృష్ణుడి మొహం చూపించకుండా కేవలం అర్జున్ దాస్ డబ్బింగ్ తో మేనేజ్ చేసినా సరే ఆ…

51 mins ago

కళ్యాణ్ రామ్ చేస్తోంది పెద్ద రిస్కే..

టాలీవుడ్లో తరచుగా రిస్కీ ప్రాజెక్టులు చేసే హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. కెరీర్ డోలాయమాన స్థితిలో ఉండగా ‘అతనొక్కడే’…

54 mins ago

మనసారా మాట్లాడిన కల్కి దర్శకుడి కబుర్లు

కల్కి 2898 ఏడి విడుదల ముందు వరకు దాని పోస్ట్ ప్రొడక్షన్, బయట ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకుడు నాగ్…

11 hours ago

భారతీయుడుకి బంగారం లాంటి అవకాశం

ఈ వారం కొత్త రిలీజులు లేకపోవడంతో కల్కి 2898 హవానే కొనసాగనుంది. ఇప్పటికే దాన్ని చూసినవాళ్లు, రిపీట్స్ పూర్తి చేసుకున్న…

11 hours ago