తెలంగాణాలో అధికార బీఆర్ఎస్ కు ఉద్యోగులకు గ్యాప్ బాగా పెరిగిపోతున్నట్లుంది. దీనికి కారణం ఏమిటంటే పరస్పరం వ్యతిరేక భావన పెరిగిపోవటమే. ఉద్యోగులకు ఎంతచేసినా సంతృప్తి ఉండదని, ఉద్యోగులేమీ ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో మద్దతుగా ఉండరనేది అధికారపార్టీ నేతల మనోభావన. ఇదే సమయంలో ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు కావాలనే ప్రభుత్వం తీసుకుంటున్నదని ఉద్యోగసంఘాల నేతలు మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే పీఆర్సీ కమిటి నియామకం, డీఏ బకాయిల విడుదల, హెల్త్ స్కీమ్ అమలు, బదిలీలు లాంటి అనేక అంశాలను కేసీయార్ పట్టించుకోవటంలేదు.
ఎక్కడైనా మాటలు చెప్పేటప్పుడు ఉద్యోగుల గురించి కేసీయార్ చాలా బ్రహ్మాండంగా చెబుతారు. ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కానీ చేతల్లోకి వచ్చేటప్పటికీ అంతా శూన్యమే. మాటలకు విరుద్ధంగా ఉంటాయి కేసీయార్ చేతలు. అందుకనే కేసీయార్ ను కలవటానికి కూడా ఉద్యోగసంఘాల నేతలు పెద్దగా ఆసక్తిచూపరు. జూన్ తో 11వ పీఆర్సీ పదవీకాలం ముగుస్తోంది. జూలైలో 12వ పీఆర్సీ నియామకం జరగాలి. అయితే ఈ దిశగా కేసీయార్ ఇంతవరకు ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. ఇదే విషయమై చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఉద్యోగసంఘాల నేతలు కలిసినా ఉపయోగం కనబడలేదు.
రాబోయే ఎన్నికల్లో ఉద్యోగుల స్టాండ్ ఎలాగుంటుందనే విషయమై కేసీయార్ సమాచారం తెప్పించుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే అందులో నెగిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చిందట. 2018 ఎన్నికలకు ముందు పీఆర్సీ అమలుచేయకుండానే కేసీయార్ ఎన్నికలకు వెళ్ళిన దగ్గర నుండి ప్రభుత్వానికి ఉద్యోగులకు గ్యాప్ మొదలైంది. తమకు ఉద్యోగులు ఓట్లేయలేదనే ఫీడ్ బ్యాక్ కేసీయార్ కు ఉండటం వల్లే పీఆర్సీ వేయకుండా బాగా ఆలస్యంచేశారు. అయితే ఉద్యోగులు పెద్దఎత్తున ఒత్తిడి చేయటంతో పీఆర్సీ వేయాల్సొచ్చింది.
తర్వాత జరిగిన గ్రేటర్, ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా ఫలితాలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చాయి. దాంతో ఉద్యోగులు తమకు వ్యతిరేకమే అని కేసీయార్ డిసైడ్ అయిపోయారు. ప్రభుత్వంపై ముఖ్యంగా టీచర్లు బాగా మంటగా ఉన్నారు. సాధారణ బదిలీలు, రిక్వెస్టు బదిలీలతో పాటు ప్రమోషన్ల విషయంలో కూడా ప్రభుత్వం టీచర్లను బాగా ఇబ్బందులు పెడుతోందని మండిపోతున్నారు. వీటన్నింటికీ అదనంగా జీతాలు కూడా నెలలో ఎప్పుడొస్తాయో తెలీటంలేదు. అందుకనే హోలు మొత్తంమీద ఉద్యోగులకు ప్రభుత్వానికి బాగా గ్యాప్ వచ్చేసినట్లు అర్ధమవుతోంది.
This post was last modified on June 15, 2023 12:59 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…