ప్రముఖు మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ సంస్థ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం ఆయన్ను.. పీకే అయ్యర్.. డీసీ అడిటర్ మణి ఊమెన్ లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది. బ్యాంక్ ను మోసం చేయటం.. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు.
పలు బ్యాంకుల నుంచి రూ.8800 కోట్లను రుణం తీసుకున్న వెంకట్రామిరెడ్డి ఆ భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఫెయిల్ అయ్యారని కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ నిధులను దారి మళ్లించినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ గతంలోనూ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సైతం కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతోంది. అందులో భాగంగానే తాజా అరెస్టులు జరిగినట్లుగా చెబుతున్నారు.
వెంకట్రామిరెడ్డికి చెందిన రూ.3300 కోట్ల ఆస్తుల్ని ఈడీ గతంలో జప్తు చేయటం గమనార్హం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రత్యేక కోర్టులో హాజరు పర్చిన అనంతరం రిమాండ్ కు తరలిస్తారు. కెనరా బ్యాంక్.. ఐడీబీఐ బ్యాంకుల నుంచి సుమారు రూ.1500 కోట్ల మేర మోసం చేసినట్లుగా వారిపై అభియోగాలు ఉన్నాయి. సంస్థకు చెందిన న్యూఢిల్లీ.. హైదరాబాద్.. గుర్ గావ్.. చెన్నై.. బెంగళూరులోని ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈ ఉదంతం తాజాగా సంచలనంగా మారింది.
This post was last modified on June 14, 2023 12:04 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…