ప్రముఖు మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ సంస్థ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం ఆయన్ను.. పీకే అయ్యర్.. డీసీ అడిటర్ మణి ఊమెన్ లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది. బ్యాంక్ ను మోసం చేయటం.. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు.
పలు బ్యాంకుల నుంచి రూ.8800 కోట్లను రుణం తీసుకున్న వెంకట్రామిరెడ్డి ఆ భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఫెయిల్ అయ్యారని కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ నిధులను దారి మళ్లించినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ గతంలోనూ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సైతం కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతోంది. అందులో భాగంగానే తాజా అరెస్టులు జరిగినట్లుగా చెబుతున్నారు.
వెంకట్రామిరెడ్డికి చెందిన రూ.3300 కోట్ల ఆస్తుల్ని ఈడీ గతంలో జప్తు చేయటం గమనార్హం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రత్యేక కోర్టులో హాజరు పర్చిన అనంతరం రిమాండ్ కు తరలిస్తారు. కెనరా బ్యాంక్.. ఐడీబీఐ బ్యాంకుల నుంచి సుమారు రూ.1500 కోట్ల మేర మోసం చేసినట్లుగా వారిపై అభియోగాలు ఉన్నాయి. సంస్థకు చెందిన న్యూఢిల్లీ.. హైదరాబాద్.. గుర్ గావ్.. చెన్నై.. బెంగళూరులోని ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈ ఉదంతం తాజాగా సంచలనంగా మారింది.
This post was last modified on June 14, 2023 12:04 pm
తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్…
బీహార్ లో బీజేపీ కోటకు బీటలు వారుతున్నాయి. 2019 ఎన్నికలలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి బీహార్…
గతంలో పుష్పలో శ్రీవల్లి పాత్రతోనే ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ లో పెద్ద బ్రేక్ ఇచ్చింది…
మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ అనిపించుకోలేదు. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మొదటి రెండు…
ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మే 10 నుండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే…
ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…