Political News

ఏపీ ప్ర‌భుత్వంపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య నీటి వాటా పంప‌కాలు, ప్రాజెక్టుల విష‌యంలో క‌య్యం ముదురుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏమీ మాట్లాడుకుండా చెయ్యాల్సిందేదో చేసుకుపోతుంటే.. దీనిపై కోర్టులను ఆశ్ర‌యించ‌డ‌మే కాక నేరుగా ఘాటు విమ‌ర్శ‌ల‌కూ సిద్ధ‌మ‌య్యారు తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌లు. జ‌గ‌న్ త‌న‌కు మిత్రుడే కానీ.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే రాజీ ప‌డేది లేదంటూ తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిక నేరుగా ముఖ్య‌మంత్రి కేసీఆరే రంగంలోకి దిగి జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ అర్థం పర్థంలేని, నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కేసీఆర్‌ అన్నారు. నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంపై చర్చించారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ ఏపీ ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ‘‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడా. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిద్దామని చెప్పాం. బేసిన్లు, భేషజాలు లేవని రాష్ట్ర వైఖరిని చాలా స్పష్టంగా చెప్పా. వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామన్నాను. కానీ ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. ఏపీ అర్థరహిత వాదనలు తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. రాష్ట్ర ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపీకి కల్పిస్తాం’’ అని కేసీఆర్‌ అన్నారు.తెలంగాణ ఏర్పాటుకు ముందే అనుమతులు పొందిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు సరికాదని.. తెలంగాణకు ఉన్న వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేసీఆర్‌ అన్నారు.

This post was last modified on August 11, 2020 4:51 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

33 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

41 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago