రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య నీటి వాటా పంపకాలు, ప్రాజెక్టుల విషయంలో కయ్యం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడుకుండా చెయ్యాల్సిందేదో చేసుకుపోతుంటే.. దీనిపై కోర్టులను ఆశ్రయించడమే కాక నేరుగా ఘాటు విమర్శలకూ సిద్ధమయ్యారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. జగన్ తనకు మిత్రుడే కానీ.. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే రాజీ పడేది లేదంటూ తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక నేరుగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగి జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అర్థం పర్థంలేని, నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని కేసీఆర్ అన్నారు. నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ, అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై చర్చించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడా. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిద్దామని చెప్పాం. బేసిన్లు, భేషజాలు లేవని రాష్ట్ర వైఖరిని చాలా స్పష్టంగా చెప్పా. వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామన్నాను. కానీ ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. ఏపీ అర్థరహిత వాదనలు తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. రాష్ట్ర ప్రాజెక్టులపై మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపీకి కల్పిస్తాం’’ అని కేసీఆర్ అన్నారు.తెలంగాణ ఏర్పాటుకు ముందే అనుమతులు పొందిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు సరికాదని.. తెలంగాణకు ఉన్న వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేసీఆర్ అన్నారు.
This post was last modified on August 11, 2020 4:51 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…