చిలిచి చిలికి గాలవానలాగ అయ్యిందన్న సామెతలాగ అయిపోతోంది మహిళా రెజ్లర్ల వివాదం. మహిళా రెజ్లర్ల సహాఖ్యకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధ్యక్షుడు. చాలాకాలంగా బ్రిజ్ తమను లైగింకంగా వేధిస్తున్నట్లు మహిళా రెజ్లర్లు గడచిన 55 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీళ్ళెంత గోలచేసినా, ఆందోళనలు చేసినా నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయటంలేదు. ఏదో మొక్కుబడిగా క్రీడల శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో ఈమధ్యనే మాట్లాడారు.
ఎవరెంత మాట్లాడినా ఎన్ని ప్రతిపాదనలు చేసినా రెజ్లర్ల డిమాండ్లలో ముఖ్యమైనది ఏమంటే బ్రిజ్ ను వెంటనే అరెస్టుచేయాలని. అయితే ఈ డిమాండ్ కు మాత్రం ప్రభుత్వం అంగీకరించటంలేదు. ఎందుకంటే ఈయనగారు ఉత్తరప్రదేశ్ లో ఎంపీ కూడా. కేంద్రప్రభుత్వానికి ఎన్నోరకాలుగా చాలా కావాల్సిన నేతట. అందుకనే జాతీయ, అంతర్జాతీయస్ధాయిలో ప్రభుత్వం పరువుపోతున్నా బ్రిజ్ మీద యాక్షన్ తీసుకునేందుకు మాత్రం మోడీ ఇష్టపడటంలేదు.
అందుకనే ఇలా లాభంలేదని అర్ధమైపోయి చివరకు తొందరలోనే జరగబోతున్న ఏషియా గేమ్స్ ను తామంతా బహిష్కరించబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హర్యానాలోని సోనేపేట్ లో రెజ్లర్ల ఖాప్ పంచాయితి జరిగింది. ఈ పంచాయితీలో సాక్షిమాలిక్ మాట్లాడుతు ఈనెల 15వ తేదీలోగా బ్రిజ్ ను గనుక అరెస్టు చేయకపోతే తామంతా ఏషియా గేమ్స్ లో పాల్గనేదిలేదని చెప్పేసింది. ఈ నిర్ణయం అందరు కలిసి తీసుకున్నట్లు సాక్షి చెప్పింది.
మహిళా రెజ్లర్లు గనుక ఏషియా గేమ్స్ లో పాల్గొనకపోతే దేశానికి అదో పెద్ద బ్లాక్ మార్క్ అయిపోతుంది. ఎందుకని మహిళా రెజ్లర్లు ఏసియా గేమ్స్ ను బహిష్కరించారనే విషయంపై చర్చ జరుగుతుంది. అప్పుడు ప్రపంచదేశాల్లో బ్రిబ్ భూషణ్ లైంగిక వేధింపుల అంశమే ప్రధానమవుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఫెడరేషన్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులను ఖండించింది. ఇది సరిపోదన్నట్లుగా ఏషియా గేమ్స్ లో అన్నీ దేశాల్లోను ఇదే చర్చ మొదలవుతుంది. తమను లైంగింకంగా వేధిస్తున్నారంటు మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనను మోడీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటంలేదో అర్ధంకావటంలేదు.
This post was last modified on June 11, 2023 12:19 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…