చిలిచి చిలికి గాలవానలాగ అయ్యిందన్న సామెతలాగ అయిపోతోంది మహిళా రెజ్లర్ల వివాదం. మహిళా రెజ్లర్ల సహాఖ్యకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధ్యక్షుడు. చాలాకాలంగా బ్రిజ్ తమను లైగింకంగా వేధిస్తున్నట్లు మహిళా రెజ్లర్లు గడచిన 55 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీళ్ళెంత గోలచేసినా, ఆందోళనలు చేసినా నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయటంలేదు. ఏదో మొక్కుబడిగా క్రీడల శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో ఈమధ్యనే మాట్లాడారు.
ఎవరెంత మాట్లాడినా ఎన్ని ప్రతిపాదనలు చేసినా రెజ్లర్ల డిమాండ్లలో ముఖ్యమైనది ఏమంటే బ్రిజ్ ను వెంటనే అరెస్టుచేయాలని. అయితే ఈ డిమాండ్ కు మాత్రం ప్రభుత్వం అంగీకరించటంలేదు. ఎందుకంటే ఈయనగారు ఉత్తరప్రదేశ్ లో ఎంపీ కూడా. కేంద్రప్రభుత్వానికి ఎన్నోరకాలుగా చాలా కావాల్సిన నేతట. అందుకనే జాతీయ, అంతర్జాతీయస్ధాయిలో ప్రభుత్వం పరువుపోతున్నా బ్రిజ్ మీద యాక్షన్ తీసుకునేందుకు మాత్రం మోడీ ఇష్టపడటంలేదు.
అందుకనే ఇలా లాభంలేదని అర్ధమైపోయి చివరకు తొందరలోనే జరగబోతున్న ఏషియా గేమ్స్ ను తామంతా బహిష్కరించబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హర్యానాలోని సోనేపేట్ లో రెజ్లర్ల ఖాప్ పంచాయితి జరిగింది. ఈ పంచాయితీలో సాక్షిమాలిక్ మాట్లాడుతు ఈనెల 15వ తేదీలోగా బ్రిజ్ ను గనుక అరెస్టు చేయకపోతే తామంతా ఏషియా గేమ్స్ లో పాల్గనేదిలేదని చెప్పేసింది. ఈ నిర్ణయం అందరు కలిసి తీసుకున్నట్లు సాక్షి చెప్పింది.
మహిళా రెజ్లర్లు గనుక ఏషియా గేమ్స్ లో పాల్గొనకపోతే దేశానికి అదో పెద్ద బ్లాక్ మార్క్ అయిపోతుంది. ఎందుకని మహిళా రెజ్లర్లు ఏసియా గేమ్స్ ను బహిష్కరించారనే విషయంపై చర్చ జరుగుతుంది. అప్పుడు ప్రపంచదేశాల్లో బ్రిబ్ భూషణ్ లైంగిక వేధింపుల అంశమే ప్రధానమవుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఫెడరేషన్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులను ఖండించింది. ఇది సరిపోదన్నట్లుగా ఏషియా గేమ్స్ లో అన్నీ దేశాల్లోను ఇదే చర్చ మొదలవుతుంది. తమను లైంగింకంగా వేధిస్తున్నారంటు మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనను మోడీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటంలేదో అర్ధంకావటంలేదు.
This post was last modified on June 11, 2023 12:19 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…