ఆదాయంలో తెలంగాణ ముందుందంటే.. ఔను.. విభజన కారణంగా ఏపీ ఎంతో నష్టపోయిందని ఏపీ ప్రభుత్వ పెద్దలు వాదనకు దిగుతారు.
ఇతర పరిశ్రమలు, ఐటీ వంటి వాటిలో తెలంగాణ దూకుడుగా ఉందని చెబితే.. ఔను.. మేం కూడా దూసుకుపోతున్నాం.. ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు వస్తున్నాయని బల్లగుద్ది మరీ చెబుతారు.
కట్ చేస్తే.. మరి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమలకు సంబంధించి మీరు ఏం చేశారు? ఏమైనా నివేదిక రూపంలో ఇవ్వగలరా? అంటే.. మాత్రం ఏపీ మంత్రులు, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కానీ, అదేసమయంలో తెలంగాణ మాత్రం నివేదికలు.. లెక్కలు .. అంటూ..తాము చేసిన ప్రగతిని చెప్పుకొనేందుకు రెడీ అయింది. దీంతో తెలంగాణ దూకుడు ముందు ఏపీ పోటీ పడలేకపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
2022-23 సంవత్సరానికి తెలంగాణలో ఐటీ రంగం పనితీరుపై మంత్రి కేటీఆర్ నివేదికను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. 2015 నుంచి ఈ విధానం అవలంభిస్తున్నా.. కొన్ని నెలలుగా మంత్రి చేస్తున్న విదేశీ పర్యటనలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల దృష్ట్యా ఈ ఏడాది నివేదికపై సర్వత్రా ఆసక్తి పెరిగింది.
దేశానికి హైదరాబాద్ ఐటీ హబ్గా మారిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ విడుదల చేయనున్న నివేదికలు ఆయా రంగాలలో విజయాలతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యతలు, లక్ష్యాల నూ వివరిస్తాయి. ఐటీ రంగం ఎగుమతులతో పాటు, ఉద్యోగ కల్పనలో గణనీయ వృద్ధిని సాధించినట్లు గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021-22లో జాతీయ సగటు కంటే 9 శాతం పెరిగి ఐటీ ఎగుమతుల్లో 26.14 శాతం నమోదైంది. మరి దీంతో పోల్చుకుంటే.. గత నాలుగేళ్లలో ఏపీ సాధించింది ఏంటో చెబితే.. జగనన్న పాలనకు ప్రజలు మరింతగా జై కొడతారు కదా! అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 5, 2023 11:27 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…