ఆదాయంలో తెలంగాణ ముందుందంటే.. ఔను.. విభజన కారణంగా ఏపీ ఎంతో నష్టపోయిందని ఏపీ ప్రభుత్వ పెద్దలు వాదనకు దిగుతారు.
ఇతర పరిశ్రమలు, ఐటీ వంటి వాటిలో తెలంగాణ దూకుడుగా ఉందని చెబితే.. ఔను.. మేం కూడా దూసుకుపోతున్నాం.. ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు వస్తున్నాయని బల్లగుద్ది మరీ చెబుతారు.
కట్ చేస్తే.. మరి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమలకు సంబంధించి మీరు ఏం చేశారు? ఏమైనా నివేదిక రూపంలో ఇవ్వగలరా? అంటే.. మాత్రం ఏపీ మంత్రులు, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కానీ, అదేసమయంలో తెలంగాణ మాత్రం నివేదికలు.. లెక్కలు .. అంటూ..తాము చేసిన ప్రగతిని చెప్పుకొనేందుకు రెడీ అయింది. దీంతో తెలంగాణ దూకుడు ముందు ఏపీ పోటీ పడలేకపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
2022-23 సంవత్సరానికి తెలంగాణలో ఐటీ రంగం పనితీరుపై మంత్రి కేటీఆర్ నివేదికను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. 2015 నుంచి ఈ విధానం అవలంభిస్తున్నా.. కొన్ని నెలలుగా మంత్రి చేస్తున్న విదేశీ పర్యటనలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల దృష్ట్యా ఈ ఏడాది నివేదికపై సర్వత్రా ఆసక్తి పెరిగింది.
దేశానికి హైదరాబాద్ ఐటీ హబ్గా మారిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ విడుదల చేయనున్న నివేదికలు ఆయా రంగాలలో విజయాలతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యతలు, లక్ష్యాల నూ వివరిస్తాయి. ఐటీ రంగం ఎగుమతులతో పాటు, ఉద్యోగ కల్పనలో గణనీయ వృద్ధిని సాధించినట్లు గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021-22లో జాతీయ సగటు కంటే 9 శాతం పెరిగి ఐటీ ఎగుమతుల్లో 26.14 శాతం నమోదైంది. మరి దీంతో పోల్చుకుంటే.. గత నాలుగేళ్లలో ఏపీ సాధించింది ఏంటో చెబితే.. జగనన్న పాలనకు ప్రజలు మరింతగా జై కొడతారు కదా! అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 5, 2023 11:27 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…