2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి తేడా వస్తే ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఒక టెర్మ్లోనే తెలుగుదేశం పార్టీని జగన్ ఎంతగా వేధించాడో.. ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో తెలిసిందే. ఇంకో పర్యాయం ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిందంటే చంద్రబాబుతో పాటు టీడీపీ ఉనికి ప్రమాదంలో పడటం ఖాయం.
అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే అని చంద్రబాబు పంతం పట్టారు. అందుకోసం ఆయన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. నిజానికి జగన్ సర్కారు మీద వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. తెలుగుదేశానికి విజయావకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకుంటే విజయం నల్లేరుపై నడకే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ కేవలం పొత్తును నమ్ముకుంటే సరిపోదని చంద్రబాబు భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఆయన్ని అభిమానించే తటస్థుల్లో వ్యతిరేకత పెంచుతోంది. సంక్షేమ పథకాల విషయంలో జగన్ సర్కారును ఇంత కాలం తిట్టిపోస్తూ.. ఇటీవలే మేనిఫెస్టోలో అనేక ఉచిత పథకాలను ప్రకటించడం న్యూట్రల్స్కు నచ్చలేదు. జనాలను సోమరిపోతులను చేస్తున్నారని, రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి.. మీరు చేస్తున్నదేంటి అంటూ చంద్రబాబును విమర్శించింది ఓ వర్గం.
ప్రగతి శీల నాయకుడిగా, అభివృద్ధికి రోల్ మోడల్లా కనిపించే చంద్రబాబు నుంచి ఇలాంటివి ఊహించలేదని అంటున్నారు. ఈ వ్యతిరేకత సరిపోదని.. బీజేపీతో పొత్తు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తుండటాన్ని కూడా ఈ వర్గం వ్యతిరేకిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని కలిసిన చంద్రబాబుపై న్యూట్రల్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
బీజేపీతో పొత్తు వల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ అని.. ఇప్పటికే విజయంపై ధీమా ఉన్నపుడు బీజేపీ మోరల్ సపోర్ట్ కోసం వెంపర్లాడాల్సిన పని లేదని.. దీని వల్ల చాలామంది నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి ఉంటుందని.. చివరగా ఇది బూమరాంగ్ అవుతుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ మద్దతుదారుల్లో కూడా ఈ విషయంలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…