తెలంగాణా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 22 రోజులు రాష్ట్రం మొత్తం ఉత్సవాలు జరపాలని కేసీయార్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం జరిగింది. అయితే రైతుల దినోత్సవం బీఆర్ఎస్ కు పెద్ద షాకిచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు ఎంపీలు, నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు మొదలుకాగానే రైతులు, రైతుసంఘాల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది.
ధాన్యాన్ని ప్రభుత్వం ఎందకు కొనుగోలుచేయటం లేదో ముందు చెప్పాలని రైతులు మంత్రులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో తాము రోజుల తరబడి వెయిట్ చేస్తున్నా అధికారులు తమను ఎందుకు పట్టించుకోవటంలేదని నిలదీశారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నా ప్రజాప్రతినిధులు ఎందుకు లెక్కచేయటంలేదో చెప్పాలని మండిపడ్డారు. తమ సమస్యలను పట్టించుకోకుండా, ధాన్యాన్ని కొనకుండా మధ్యలో సంబురాలు ఏమిటంటు రైతులు రెచ్చిపోయారు.
వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని, నష్టపరిహారం చెల్లిస్తామని కేసీయార్ చెప్పినా ఇంతవరకు తమ ధాన్యాన్ని ఎందుకు కొనలేదని, పరిహారాన్ని ఎందుకు చెల్లించలేదని రైతులు ఆగ్రహంవ్యక్తంచేశారు. వ్యవసాయ రుణాల మాఫీ ఎందుకు కావటంలేదని నిలదీశారు. ఈ జిల్లా ఆ జిల్లా అనికాకుండా అన్నీ జిల్లాల్లో రైతుల నుండి ఇలాంటి వ్యతిరేకతే పెద్దఎత్తున ఎదురైంది. దాంతో ఏమి సమాధానం చెప్పాలో మంత్రులు, ప్రజాప్రతినిదులకు అర్ధంకాలేదు. తమది రైతుప్రభుత్వమని ఒకవైపు కేసీయార్ పదేపదే చెప్పుకుంటున్నారు.
ఇపుడు అదే రైతు సంబురాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులను అందరిముందు నిలదీయటంతో సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు బిక్కమొహాలేశారు. కరీంనగర్ లాంటి కొన్నిచోట్ల సంబురాలకు రైతులు హాజరుకాకపోవటంతో రైతు కూలీలను తీసుకొచ్చారు. రైతు కూలీలు కూడా గిట్టుబాటు ధరలు, కూలీగిట్టుబాటు పై మంత్రులు, ప్రజాప్రతినిదులను నిలదీశారు. మెట్ పల్లి, సిరిసిల్ల లాంటి కొన్నిచోట్ల రైతులు సంబురాలను బహిష్కరించారు. మొత్తంమీద రైతుల నిరసనలు, ఆగ్రహాలు, బహిష్కరణల మధ్యే రైతు దినోత్సవాన్ని అధికారాపార్టీ నిర్వహించినట్లయ్యింది. మరీ ఫీడ్ బ్యాక్ అంతా కేసీయార్ దృష్టికి వెళ్ళిందో లేదో తెలీదు.
This post was last modified on June 4, 2023 11:32 am
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ…
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం…
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు…
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం…
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…