తెలంగాణా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 22 రోజులు రాష్ట్రం మొత్తం ఉత్సవాలు జరపాలని కేసీయార్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం జరిగింది. అయితే రైతుల దినోత్సవం బీఆర్ఎస్ కు పెద్ద షాకిచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు ఎంపీలు, నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు మొదలుకాగానే రైతులు, రైతుసంఘాల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది.
ధాన్యాన్ని ప్రభుత్వం ఎందకు కొనుగోలుచేయటం లేదో ముందు చెప్పాలని రైతులు మంత్రులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో తాము రోజుల తరబడి వెయిట్ చేస్తున్నా అధికారులు తమను ఎందుకు పట్టించుకోవటంలేదని నిలదీశారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నా ప్రజాప్రతినిధులు ఎందుకు లెక్కచేయటంలేదో చెప్పాలని మండిపడ్డారు. తమ సమస్యలను పట్టించుకోకుండా, ధాన్యాన్ని కొనకుండా మధ్యలో సంబురాలు ఏమిటంటు రైతులు రెచ్చిపోయారు.
వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని, నష్టపరిహారం చెల్లిస్తామని కేసీయార్ చెప్పినా ఇంతవరకు తమ ధాన్యాన్ని ఎందుకు కొనలేదని, పరిహారాన్ని ఎందుకు చెల్లించలేదని రైతులు ఆగ్రహంవ్యక్తంచేశారు. వ్యవసాయ రుణాల మాఫీ ఎందుకు కావటంలేదని నిలదీశారు. ఈ జిల్లా ఆ జిల్లా అనికాకుండా అన్నీ జిల్లాల్లో రైతుల నుండి ఇలాంటి వ్యతిరేకతే పెద్దఎత్తున ఎదురైంది. దాంతో ఏమి సమాధానం చెప్పాలో మంత్రులు, ప్రజాప్రతినిదులకు అర్ధంకాలేదు. తమది రైతుప్రభుత్వమని ఒకవైపు కేసీయార్ పదేపదే చెప్పుకుంటున్నారు.
ఇపుడు అదే రైతు సంబురాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులను అందరిముందు నిలదీయటంతో సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు బిక్కమొహాలేశారు. కరీంనగర్ లాంటి కొన్నిచోట్ల సంబురాలకు రైతులు హాజరుకాకపోవటంతో రైతు కూలీలను తీసుకొచ్చారు. రైతు కూలీలు కూడా గిట్టుబాటు ధరలు, కూలీగిట్టుబాటు పై మంత్రులు, ప్రజాప్రతినిదులను నిలదీశారు. మెట్ పల్లి, సిరిసిల్ల లాంటి కొన్నిచోట్ల రైతులు సంబురాలను బహిష్కరించారు. మొత్తంమీద రైతుల నిరసనలు, ఆగ్రహాలు, బహిష్కరణల మధ్యే రైతు దినోత్సవాన్ని అధికారాపార్టీ నిర్వహించినట్లయ్యింది. మరీ ఫీడ్ బ్యాక్ అంతా కేసీయార్ దృష్టికి వెళ్ళిందో లేదో తెలీదు.
This post was last modified on June 4, 2023 11:32 am
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…