Political News

జాతీయనేతలే దిక్కా?

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వందఓట్లు రావాలంటే కేంద్రంలోని నేతలే దిక్కయ్యేట్లున్నారు. కేంద్రనేతలంటే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలాంటి వాళ్ళన్నమాట. వీళ్ళల్లో నడ్దాను ఏపీలో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అనే హోదా ఉంది కాబట్టి ప్రాధాన్యత దక్కుతోందంతే. ఇపుడు విషయం ఏమిటంటే ఈనెల 8వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 10వ తేదీన జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.

విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన అనేక కార్యక్రమాల్లో అమిత్ పాల్గొనబోతున్నారు. పార్టీ నేతలతో కూడా సమావేశం అవబోతున్నారు. బహుశా ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అలాగే నడ్డా తిరుపతిలో ఏర్పాటుచేసిన పర్యటనల్లో పాల్గొనబోతున్నారు. నడ్డా పర్యటనలో కూడా సీనియర్ నేతలంతా పార్టిసిపేట్ చేస్తారనటంలో సందేహంలేదు.

వచ్చేనెలలో నరేంద్రమోడీ కూడా ఏపీలో పర్యటించే అవకాశాలున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే రాష్ట్రంలో బీజేపీ నేతల్లో చాలామంది మీడియా సమావేశాలకు, టీవీల్లో డిబేట్లకు తప్ప ఇంకెందుకు పనికిరారు. వీవీఐపీలు వచ్చినపుడు విమానాశ్రయాల్లో స్వాగతం చెప్పి, మళ్ళీ సెండాఫ్ ఇచ్చే దగ్గర మాత్రం చాలామంది నేతలు కనబడుతారు. ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ కనబడరు. పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయటంలో వీళ్ళకి ఎంతమాత్రం శ్రద్ధున్నట్లు కనబడటంలేదు.

ఇపుడున్న నేతల్లో చాలామందికి సొంతంగా వందఓట్లు వేయించుకునేంత శక్తికూడా లేదు. పోయిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 0.56 శాతం అంటేనే పార్టీ నేతల బలమేమిటో అర్ధమైపోతోంది. నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కి వచ్చిన ఓట్లు 4 శాతం. 175 నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు బలమైన అభ్యర్ధులు కూడా లేరు. కాబట్టి ఇక పార్లమెంటు అభ్యర్ధుల గురించి చర్చే అవసరంలేదు. అన్నీ నియోజకవర్గాలకు పోటీచేసిన తర్వాత ఎంతమందికి డిపాజిట్లు దక్కుతాయనేది పెద్ద పజిల్ అయిపోయింది. కేంద్రంలో బలంగా ఉందికాబట్టే ఏపీలో బీజేపీని పట్టించుకుంటున్నారు లేకపోతే ఎవరూ లెక్కకూడా చేసేవారు కాదన్నది అందరికీ తెలిసిందే. మరి జాతీయ నాయకులు వచ్చి ఏమిచేస్తారో చూడాల్సిందే. 

This post was last modified on June 4, 2023 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago