టీడీపీ అంటేనే వైసీపీ నేతల్లో భయం పట్టుకుందా? చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్లు అంటే.. వైసీపీ నాయకులు హడలి పోతున్నారా? తమ ప్రభుత్వ లోపాలను.. తమ నాయకుల అవినీతిని ఎండగడుతున్న తీరుతో వారు బెంబేలెత్తుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే చంద్రబాబు, నారా లోకేష్లు ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా.. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాళ్లు విసిరేలా.. యువతను ప్రోత్సహిస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు.
చివరకు.. ఇటీవల జరిగిన మహానాడులోనూ సాక్షాత్తూ ఎంపీ మార్గాని భరత్ ఫ్లెక్సీలు కట్టి.. కవ్వింపులకు దిగిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే, ఇలాంటి కవ్వింపు చర్యలతో వైసీపీ సాధించేది ఏంటి? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. మీరు కూడా పాదయాత్రలు చేశారు. మీరు కూడా సభలు పెట్టుకున్నారు. అప్పట్లో ఇలా టీడీపీ ప్రభుత్వం కానీ, నాయకులు కానీ, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారా? అనేది నెటిజన్ల సూటి ప్రశ్న.
తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం అయింది. నిజానికి బలమైన ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఈ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే రాచమల్లు ఆదేశాలతో పోలీసులు కూడా సహకారం అందించలేదని టీడీపీ నాయకులు విమర్శించారు.
ఇంతగా కార్యక్రమం హిట్టయిన నేపథ్యంలో వైసీపీ నేతలు.. ఊరుకుంటారా? కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దారి పొడవునా మహిళలు హారతులు ఇచ్చి లోకేశ్ను పలకరించారు. లోకేశ్ పై మహిళలు చిన్నారులు పూల వర్షం కురిపించారు. దీనిని ప్రత్యక్షంగా వీక్షించిన వైసీపీ నాయకులు తమ అడ్డాలో టీడీపీకి ఇంత ఆదరణా? అని రగిలిపోయారని.. టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే విడిది కేంద్రానికి వెళ్లుతున్న లోకేష్పై వైసీపీ కార్యకర్త ఒకరు కోడిగుడ్డుతో దాడి చేశారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే.. కోడిగుడ్డుతో దాడి చేసిన వ్యక్తికి టీడీపీ శ్రేణులు దేహశుద్ది చేశాయి.
This post was last modified on June 2, 2023 2:05 pm
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…