Political News

పోటా పోటీ ద‌శాబ్ది.. వేడెక్కిన తెలంగాణ‌!

తెలంగాణ‌లో ఏం జ‌రిగినా.. రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. మ‌రో ఐదు మాసాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు తాజాగా ప్రారంభ‌మైన ద‌శాబ్ది వేడుక‌లు కూడా రాజ‌కీయాల కు వేదిక‌గా మారాయి. ఒక‌వైపు అధికార పార్టీ బీఆర్ ఎస్‌.. భారీ ఎత్తున ఈ వేడుక‌ల‌కు ప్లాన్ చేసింది. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ కూడా.. తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల‌కు రెడీ అయింది. మేం రాష్ట్రాన్ని తెచ్చాం.. అని బీఆర్ ఎస్ నేత‌లు చెబుతుంటే.. కాదు, కాదు.. మేమే ఇచ్చాం.. తెలంగాణ‌పై హ‌క్కు మాదేన‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.

దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ కాక మ‌రోసారి పెరిగింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ విష‌యాన్ని తీసుకుంటే..  రాష్ట్ర సాధనలో కాంగ్రెస్‌ పాత్రను స్పష్టంగా చెప్పేందుకు ఆ పార్టీ నేతలు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేదికగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే 20 రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. గాంధీభవన్‌లో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేం దుకు పీసీసీ సర్వం సిద్ధం చేసింది. విభ‌జ‌న బిల్లు ఆమోదం పొందిన సమయంలో అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే గాంధీభవన్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.

ఇక‌, అధికార పార్టీ బీఆర్ ఎస్ విష‌యానికి వ‌స్తే..  దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబెైంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తైన వేళ ఘనంగా వేడుకలు జరగనున్నాయి. తొమిదేళ్ల  ప్రగతి ప్రస్థానాన్ని  చాటేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.   సచివాలయం వేదికగా వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన 21 రోజుల పాటు రోజుకు ఒక రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

గ‌వ‌ర్న‌ర్ ప‌రిస్థితి ఏంటి?

రాష్ట్రంలో ద‌శాబ్ది అవ‌త‌ర‌ణ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త రెండేళ్లుగా స‌ర్కారుకు, రాజ్‌భ‌వ‌న్‌కు మ‌ధ్య అంత‌రం పెరుగుతూ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో క‌నీసం అవ‌త‌ర‌ణ దినోత్స‌వాల‌కు అయినా.. ఆమెను ఆహ్వానించాల‌ని.. మెజారిటీ ప్ర‌జ‌లు భావిస్తున్నారు. కానీ, కేసీఆర్ ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి త‌మిళి సై.. త‌న కార్యాల‌యంలోనే ఈ కార్య‌క్ర‌మం చేయ‌నున్న‌ట్టు తెలిసింది.

This post was last modified on June 2, 2023 11:29 am

Share
Show comments
Published by
Satya
Tags: KCRTelangana

Recent Posts

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

5 minutes ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 minutes ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

12 minutes ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

22 minutes ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

40 minutes ago

ఆ సంస్థకు చుక్కలు చూపిస్తున్న 2026

కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…

47 minutes ago