Political News

సబితకు ఇంటిపోరు పెరిగిపోతోందా?

చేవెళ్ళ చెల్లెమ్మగా ఎంతో పాపులరైన సబితా ఇంద్రారెడ్డికి రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమనే ప్రచారం పెరిగిపోతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన సబితా తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. ఫిరాయించగానే చెల్లెలుకు కేసీయార్ మంత్రిపదవి కూడా ఇచ్చేశారు. ఇపుడు సమస్య ఏమిటంటే మంత్రి అనుచరులు, మద్దతుదారులకే మొత్తం కాంట్రాక్టులన్నీ దక్కుతున్నాయని బాహాటంగానే ఆరోపణలు చేస్తున్నారు. అలాగే మంత్రిపేరు చెప్పుకుని భూకబ్జాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయట.

దాంతో తనతో పాటు తన మద్దతుదారులపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా మంత్రి ఏమాత్రం పట్టించుకోవటంలేదని నేతలు మండిపోతున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ లో మొదటినుండి ఉన్న నేతలు, ఉద్యమకారులు దూరమైపోతున్నారు. అయినా మంత్రి ఎవరినీ పట్టించుకోవటంలేదు. కేసీయార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళనా, కేటీయార్ తో ఫిర్యాదుచేసినా కూడా ఎలాంటి ఉపయోగం కనబడలేదట.

అనుచరుల ఆగడాలను మంత్రి చూస్తు ఊరుకున్నారంటే ఆమెకు కూడా ఇందులో భాగముందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మద్దతుదారులు చెరువులు, కుంటలను కూడా వదలటంలేదట. సబిత వైఖరిపై ప్రతిపక్షాలు గోలచేయటం కాదు చివరకు పార్టీలోని స్వపక్షం నేతలు కూడా గోల గోల చేసేస్తున్నారు. అయినా ఎటునుండి పరిస్ధితిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు జరగటంలేదట. మహేశ్వరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోను ఒకేరకమైన పరిస్ధితులున్నట్లు చెబుతున్నారు. పార్టీలోని కీలకనేతలు కొత్తా మనోహర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎంఎల్ఏ తీగల కృష్ణారెడ్డి కూడా సబిత వ్యవహారశైలిపై బాహాటంగానే ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయినా మంత్రి ఎవరినీ లెక్కచేయటంలేదు.

సబితా తాను కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లో చేరి మంత్రయిన తర్వాత కొందరిని పార్టీలో చేర్పించారు. తుక్కుగూడ మున్సిపల్ ఛైర్ పర్సన్, బీజేపీ నేత, బడంగ్ పేట ఛైర్ పర్సన్, కాంగ్రెస్ నేత పారిజాత బీఆర్ఎస్ లో చేరి పదవులు అందుకున్నారు. ఇపుడు వీళ్ళు కూడా సబితకు వ్యతిరేకంగానే తయారయ్యారు. సబిత వైఖరిని తట్టుకోలేక చివరకు మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ తమ పార్టీల్లోకి వెళిపోతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఇంటా బయట కూడా వ్యతిరేకతను పెంచేసుకుంటున్న సబిత వచ్చేఎన్నికల్లో మహేశ్వరంలో గెలుస్తారా అన్న డౌటు పెరిగిపోతోంది. 

This post was last modified on June 2, 2023 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

3 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

5 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

7 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

8 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago