Political News

బాబు బాధ్య‌త నెర‌వేర్చారు.. మ‌రి త‌మ్ముళ్ల మాటేంటి?

టిడిపిని గెలిపించేటటువంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు భుజాల మీద నుంచి దాదాపు దిగిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఎప్పటి వరకు కూడా సీనియర్లు యువ నాయకులు వారసులు అందరూ కూడా మీరు ఏదో ఒకటి చేయండి సార్ మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు ఏదో ఒకటి గట్టి హామీ ఇవ్వండి సార్ మేము ప్రజలను కలుసుకుంటాం అని రొద పెట్టారు. అంతేకాదు వైసీపీ భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలుచేస్తోందిది.. మనం ఇస్తామా ఇవ్వ‌మా అనేటువంటి టాక్ ప్ర‌జ‌ల్లో ఉంది. కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి అని కోరారు.

తద్వారా తాము ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చాలా సందర్భాల్లో వారు చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకువచ్చారు. దీంతో సుదీర్ఘ మధనం తర్వాత అందరినీ, అందరితో చర్చించి ఆలోచించి ఇతర రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నటువంటి పథకాలను కూడా ఏర్చి కూర్చి మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక దీంతో చంద్రబాబు నాయుడు బాధ్యత దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని మహానాడులో చంద్రబాబు నాయుడు సైతం ప్రకటించారు.

అంటే ఇప్పుడు పూర్తిగా ప్రజల్ని టిడిపి వైపు మళ్లించేటటువంటి బాధ్యత క్షేత్రస్థాయిలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీలో టికెట్‌ను ఆశిస్తున్నటువంటి వారు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కూడా పార్టీని వదిలేసి లేదా చంద్రబాబు నాయుడు మీద భారం వేసి వారు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే వారు కోరుకున్నట్టుగా చంద్రబాబునాయుడు అసలు ఉచితాలకి వ్యతిరేక‌మ‌ని చెప్పుకునేటటువంటి నాయకుడు ఈరోజు ఉచితాల వైపు మొగ్గారు.

అంటే పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు పై చేసిన ఒత్తిడిగానే భావించాలని సీనియర్ నాయకులు చెబుతున్నారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఓటు బ్యాంకుగా మల్చాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళ ఓటు బ్యాంకు రైతులు ఓటు బ్యాంకు ఉద్యోగులు నిరుద్యోగులు వీళ్ళందర్నీ కూడా పార్టీ వైపు క్షేత్రస్థాయిలో మళ్ళించాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారు సీనియర్లు, పదవులు ఆశిస్తున్నటువంటి వారు ప్రధానంగా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరి ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే బాదుడే బాదుడు, ఇదేం కర్మ వంటి కీలకమైనటువంటి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆయ‌న హిట్ కొట్టారు. వీటిని కొనసాగిస్తూనే ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడంపై ఈ సంక్షేమ పథకాల విషయంలో టిడిపి పై భరోసా కల్పించేలా నాయకులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా నాయకులు ఎంత మంది పనిచేస్తారు ఎంతమంది ప్రజల్లోకి వెళ్తారు దాన్ని బట్టి టికెట్లు ఇచ్చేటటువంటి వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

This post was last modified on June 1, 2023 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

35 minutes ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

2 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

2 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago