Political News

బాబు బాధ్య‌త నెర‌వేర్చారు.. మ‌రి త‌మ్ముళ్ల మాటేంటి?

టిడిపిని గెలిపించేటటువంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు భుజాల మీద నుంచి దాదాపు దిగిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఎప్పటి వరకు కూడా సీనియర్లు యువ నాయకులు వారసులు అందరూ కూడా మీరు ఏదో ఒకటి చేయండి సార్ మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు ఏదో ఒకటి గట్టి హామీ ఇవ్వండి సార్ మేము ప్రజలను కలుసుకుంటాం అని రొద పెట్టారు. అంతేకాదు వైసీపీ భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలుచేస్తోందిది.. మనం ఇస్తామా ఇవ్వ‌మా అనేటువంటి టాక్ ప్ర‌జ‌ల్లో ఉంది. కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి అని కోరారు.

తద్వారా తాము ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చాలా సందర్భాల్లో వారు చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకువచ్చారు. దీంతో సుదీర్ఘ మధనం తర్వాత అందరినీ, అందరితో చర్చించి ఆలోచించి ఇతర రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నటువంటి పథకాలను కూడా ఏర్చి కూర్చి మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక దీంతో చంద్రబాబు నాయుడు బాధ్యత దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని మహానాడులో చంద్రబాబు నాయుడు సైతం ప్రకటించారు.

అంటే ఇప్పుడు పూర్తిగా ప్రజల్ని టిడిపి వైపు మళ్లించేటటువంటి బాధ్యత క్షేత్రస్థాయిలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీలో టికెట్‌ను ఆశిస్తున్నటువంటి వారు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కూడా పార్టీని వదిలేసి లేదా చంద్రబాబు నాయుడు మీద భారం వేసి వారు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే వారు కోరుకున్నట్టుగా చంద్రబాబునాయుడు అసలు ఉచితాలకి వ్యతిరేక‌మ‌ని చెప్పుకునేటటువంటి నాయకుడు ఈరోజు ఉచితాల వైపు మొగ్గారు.

అంటే పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు పై చేసిన ఒత్తిడిగానే భావించాలని సీనియర్ నాయకులు చెబుతున్నారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఓటు బ్యాంకుగా మల్చాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళ ఓటు బ్యాంకు రైతులు ఓటు బ్యాంకు ఉద్యోగులు నిరుద్యోగులు వీళ్ళందర్నీ కూడా పార్టీ వైపు క్షేత్రస్థాయిలో మళ్ళించాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారు సీనియర్లు, పదవులు ఆశిస్తున్నటువంటి వారు ప్రధానంగా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరి ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే బాదుడే బాదుడు, ఇదేం కర్మ వంటి కీలకమైనటువంటి కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆయ‌న హిట్ కొట్టారు. వీటిని కొనసాగిస్తూనే ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడంపై ఈ సంక్షేమ పథకాల విషయంలో టిడిపి పై భరోసా కల్పించేలా నాయకులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా నాయకులు ఎంత మంది పనిచేస్తారు ఎంతమంది ప్రజల్లోకి వెళ్తారు దాన్ని బట్టి టికెట్లు ఇచ్చేటటువంటి వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

This post was last modified on June 1, 2023 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago