తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలవబోతోంది. బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్త నేతలను బయటకు రప్పించేందుకు ప్రయత్నాలతో స్పీడ్ పెంచింది. ఘర్ వాపసీ కార్యక్రమం రెండు విధాలుగా ఉండబోతోంది. మొదటిదేమో కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించటం. ఇక రెండో పద్దతి ఏమిటంటే బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్తిగా ఉన్ననేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవటం. విషయం ఏదైనా, పేరేదైనా పార్టీని బలోపేతం చేసుకుని వచ్చేఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావటమే టార్గెట్.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించటంతో తెలంగాణా నేతల్లో కూడా అధికారంలోకి వచ్చేవిషయమై జోష్ పెరిగింది. తమ మధ్య ఉన్న సమస్యలను పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విషయమై ఏకతాటిపైకి రావాలని అధిష్టానం కూడా పదేపదే చెబుతోంది. ఇందుకోసం అధిష్టానం తరపున ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. విభేదాలున్న నేతలను కూర్చోబెట్టి రాజీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కర్ణాటక ఫార్ములానే తెలంగానాలో కూడా అప్లై చేస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్నది.
రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవకపోతే పార్టీ మనుగడే కష్టమైపోతుందన్న విషయం సీనియర్లకు వివరిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రెండు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అందుకనే పార్టీని కాదని బీఆర్ఎస్ లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి, గడ్డం వివేక్ తదితరులతో మాట్లాడేందుకు సీనియర్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఈటల రాజేందర్ తో కూడా మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
నిజానికి కాంగ్రెస్ లోనే చేరాల్సిన ఈటల వివిధ కారణాల వల్ల బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని గుర్తు చేసి కాంగ్రెస్ లోకి లాక్కోవాలని చూస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ లో బలమైన నేతలుగా ఉన్న వారిని కూడా కాంగ్రెస్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గనుక కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఇతర నేతలు కూడా కాంగ్రెస్ లోకి వెంటనే వచ్చే అవకాశాలుంటాయని అనుకుంటున్నారు. అందుకనే వీళ్ళిద్దరిని ఈ వారంలోనే పార్టీలోకి చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మొదటివారంలో కాంగ్రెస్ ఘర్ వాపసీ స్పీడందుకుంటుందా ?
This post was last modified on June 1, 2023 10:59 am
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా…
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగే సంపాదించాడు శ్రీ విష్ణు. గత ఏడాది అతడి నుంచి…