ఏపీ సీఎం జగన్.. ఇటీవల కాలంలో పేదలకు – పెత్తందార్లకు మధ్య యుద్ధంగా వచ్చే ఎన్నికలను అభివర్ణి స్తున్న విషయం తెలిసిందే. అంటే.. 2024లో జరిగే ఎన్నికలను ఆయన తాను పేదవాడినని.. చంద్రబాబు- జనసేనలు ఆర్థికంగా బలం ఉన్న పార్టీలనీ చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు మధ్య ప్రజలు ఎటువైపు నిలబడాలో కూడా .. ఆయన చెబుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. పేదలకు తాను సంక్షేమాన్ని అందిస్తున్నాను కాబట్టి.. తనవెంటే పేదలు ఉండాలని జగన్ చెబుతున్నారు.
ఒకరకంగా ఆయన ఆదేశిస్తున్నారు కూడా. అయితే.. ఈ విషయంలోనే ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగు తోంది. జగన్ పేదవాడా? అనే చర్చను టీడీపీ క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. మహానా డు ముగిసిన తర్వాత.. ఈ విషయంపై చంద్రబాబు సహా నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచా రం. ప్రజల్లోకి జగన్ పేదవాడా ? అనే విషయాన్ని తీసుకువెళ్లి.. జగన్ చెబుతున్న కథలను నమ్మొద్దని ప్రచారం చేయనున్నారు.
దీంతో ఇప్పుడు ఈ విషయానికి ప్రాధాన్యం పెరిగింది. టీడీపీ లెక్కల ప్రకారం.. ఇప్పటికిప్పుడు జగన్ ఆస్తి రెండు లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఆయన వ్యాపారాలు దీనికి అదనం. ఈ రెండు లక్షల కోట్లు కూడా స్థిరాస్తిమాత్రమేనని అంటున్నారు. ఇక, సాక్షిమీడియా, భారతి సిమెంటు, ఇండూర్ పవర్ ప్రాజక్టు.. గ్రానెట్ ఫ్యాక్టరీ.. ఇడుపుల పాయ ఎస్టేట్ మాత్రం సెపరేటని వాదిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు కు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబం ద్వారా వచ్చిన ఇల్లు మరొకటి ఉంది.
అంతేతప్ప.. చంద్రబాబుకు స్థిరాస్తులు ఎక్కడా లేవని చెబుతున్నారు. ఇక, జిల్లాల వారీగా పార్టీ పరంగా చూసుకున్నా.. నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీకి ప్రతిజిల్లాలోనూ సొంత పార్టీ కార్యాలయం ఉండగా.. ఇప్పటికీ.. టీడీపీకి చాలా జిల్లాల్లో అద్దె భవనాలే ఉన్నాయని అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. ఎవరు పేదవాడు…? అనే చర్చ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
This post was last modified on May 31, 2023 10:20 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…