ఏపీ సీఎం జగన్.. ఇటీవల కాలంలో పేదలకు – పెత్తందార్లకు మధ్య యుద్ధంగా వచ్చే ఎన్నికలను అభివర్ణి స్తున్న విషయం తెలిసిందే. అంటే.. 2024లో జరిగే ఎన్నికలను ఆయన తాను పేదవాడినని.. చంద్రబాబు- జనసేనలు ఆర్థికంగా బలం ఉన్న పార్టీలనీ చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు మధ్య ప్రజలు ఎటువైపు నిలబడాలో కూడా .. ఆయన చెబుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. పేదలకు తాను సంక్షేమాన్ని అందిస్తున్నాను కాబట్టి.. తనవెంటే పేదలు ఉండాలని జగన్ చెబుతున్నారు.
ఒకరకంగా ఆయన ఆదేశిస్తున్నారు కూడా. అయితే.. ఈ విషయంలోనే ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగు తోంది. జగన్ పేదవాడా? అనే చర్చను టీడీపీ క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. మహానా డు ముగిసిన తర్వాత.. ఈ విషయంపై చంద్రబాబు సహా నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచా రం. ప్రజల్లోకి జగన్ పేదవాడా ? అనే విషయాన్ని తీసుకువెళ్లి.. జగన్ చెబుతున్న కథలను నమ్మొద్దని ప్రచారం చేయనున్నారు.
దీంతో ఇప్పుడు ఈ విషయానికి ప్రాధాన్యం పెరిగింది. టీడీపీ లెక్కల ప్రకారం.. ఇప్పటికిప్పుడు జగన్ ఆస్తి రెండు లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఆయన వ్యాపారాలు దీనికి అదనం. ఈ రెండు లక్షల కోట్లు కూడా స్థిరాస్తిమాత్రమేనని అంటున్నారు. ఇక, సాక్షిమీడియా, భారతి సిమెంటు, ఇండూర్ పవర్ ప్రాజక్టు.. గ్రానెట్ ఫ్యాక్టరీ.. ఇడుపుల పాయ ఎస్టేట్ మాత్రం సెపరేటని వాదిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు కు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబం ద్వారా వచ్చిన ఇల్లు మరొకటి ఉంది.
అంతేతప్ప.. చంద్రబాబుకు స్థిరాస్తులు ఎక్కడా లేవని చెబుతున్నారు. ఇక, జిల్లాల వారీగా పార్టీ పరంగా చూసుకున్నా.. నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీకి ప్రతిజిల్లాలోనూ సొంత పార్టీ కార్యాలయం ఉండగా.. ఇప్పటికీ.. టీడీపీకి చాలా జిల్లాల్లో అద్దె భవనాలే ఉన్నాయని అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. ఎవరు పేదవాడు…? అనే చర్చ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…