ఏపీ సీఎం జగన్.. ఇటీవల కాలంలో పేదలకు – పెత్తందార్లకు మధ్య యుద్ధంగా వచ్చే ఎన్నికలను అభివర్ణి స్తున్న విషయం తెలిసిందే. అంటే.. 2024లో జరిగే ఎన్నికలను ఆయన తాను పేదవాడినని.. చంద్రబాబు- జనసేనలు ఆర్థికంగా బలం ఉన్న పార్టీలనీ చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు మధ్య ప్రజలు ఎటువైపు నిలబడాలో కూడా .. ఆయన చెబుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. పేదలకు తాను సంక్షేమాన్ని అందిస్తున్నాను కాబట్టి.. తనవెంటే పేదలు ఉండాలని జగన్ చెబుతున్నారు.
ఒకరకంగా ఆయన ఆదేశిస్తున్నారు కూడా. అయితే.. ఈ విషయంలోనే ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగు తోంది. జగన్ పేదవాడా? అనే చర్చను టీడీపీ క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. మహానా డు ముగిసిన తర్వాత.. ఈ విషయంపై చంద్రబాబు సహా నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచా రం. ప్రజల్లోకి జగన్ పేదవాడా ? అనే విషయాన్ని తీసుకువెళ్లి.. జగన్ చెబుతున్న కథలను నమ్మొద్దని ప్రచారం చేయనున్నారు.
దీంతో ఇప్పుడు ఈ విషయానికి ప్రాధాన్యం పెరిగింది. టీడీపీ లెక్కల ప్రకారం.. ఇప్పటికిప్పుడు జగన్ ఆస్తి రెండు లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఆయన వ్యాపారాలు దీనికి అదనం. ఈ రెండు లక్షల కోట్లు కూడా స్థిరాస్తిమాత్రమేనని అంటున్నారు. ఇక, సాక్షిమీడియా, భారతి సిమెంటు, ఇండూర్ పవర్ ప్రాజక్టు.. గ్రానెట్ ఫ్యాక్టరీ.. ఇడుపుల పాయ ఎస్టేట్ మాత్రం సెపరేటని వాదిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు కు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబం ద్వారా వచ్చిన ఇల్లు మరొకటి ఉంది.
అంతేతప్ప.. చంద్రబాబుకు స్థిరాస్తులు ఎక్కడా లేవని చెబుతున్నారు. ఇక, జిల్లాల వారీగా పార్టీ పరంగా చూసుకున్నా.. నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీకి ప్రతిజిల్లాలోనూ సొంత పార్టీ కార్యాలయం ఉండగా.. ఇప్పటికీ.. టీడీపీకి చాలా జిల్లాల్లో అద్దె భవనాలే ఉన్నాయని అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. ఎవరు పేదవాడు…? అనే చర్చ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
This post was last modified on May 31, 2023 10:20 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…