ప్రధాని నరేంద్ర మోడీ సెంట్రిక్గా రెజర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. “మోడీ జీ.. మా బాధలు మీకు పట్టడం లేదు. ఈ దేశం కోసం అహర్నిశలూ శ్రమించి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సంపాయించాం. మీరు మాపై చూపిస్తున్న `అవ్యాజమైన ప్రేమ`కు నిదర్శనంగా వాటిని మీ నియోజకవర్గంలోని గంగా నదిలోనే కలిపేస్తాం” అని వారు హెచ్చరించారు. అయితే.. ఈ ప్రకటనను యూపీలోని బీజేపీ ప్రభుత్వం స్వాగతించడం మరింత వివాదంగా మారింది. వీరిని తాము అడ్డుకోబోమని హరిద్వార్ పోలీసులు స్పష్టం చేశారు.
ఏంటీ వివాదం..
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఓ మైనర్తో సహా కొందరు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. వీరు ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి నిరసన తెలుపుతున్నారు. అయితే.. వీరి ఆందోళనపై అటు కేంద్రం కానీ.. ఇటు ఫెడరేషన్ కానీ.. పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇటీవల నూనత పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే సమయంలో అక్కడే నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఇది తీవ్ర వివాదంగా మారి.. అరెస్టుల వరకు దారితీసింది.
బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపిస్తున్నారు. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారాల తరబడి ధర్నా చేస్తున్నారు. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, రెజ్లర్లు హరిద్వార్లోని గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తామని చెప్పారు.
ఈ పతకాలు తమ ప్రాణమని, తమ ఆత్మ అని రెజ్లర్లు చెప్పారు. వీటిని గంగా నదిలోకి విసిరేసిన తర్వాత జీవించి ఉండటంలో అర్థం లేదన్నారు. వీటిని గంగా నదిలో కలిపేసిన తర్వాత తాము ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. అయితే.. హరిద్వార్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ మాట్లాడుతూ, రెజ్లర్లు తమకు నచ్చిన పని చేయవచ్చునని తెలిపారు. పవిత్రమైన గంగా నదిలో వారు తమ పతకాలను నిమజ్జనం చేసేందుకు వస్తే, తాము వారిని ఆపబోమని తెలిపారు.
This post was last modified on May 31, 2023 8:28 am
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…