Political News

మోడీజీ.. ప‌త‌కాలు.. గంగ‌లో క‌లిపేస్తా: రెజ్ల‌ర్ల హెచ్చ‌రిక

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సెంట్రిక్‌గా రెజ‌ర్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “మోడీ జీ.. మా బాధ‌లు మీకు ప‌ట్ట‌డం లేదు. ఈ దేశం కోసం అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించి అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌త‌కాలు సంపాయించాం. మీరు మాపై చూపిస్తున్న `అవ్యాజ‌మైన ప్రేమ‌`కు నిద‌ర్శ‌నంగా వాటిని మీ నియోజ‌క‌వ‌ర్గంలోని గంగా న‌దిలోనే క‌లిపేస్తాం” అని వారు హెచ్చ‌రించారు. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న‌ను యూపీలోని బీజేపీ ప్ర‌భుత్వం స్వాగ‌తించడం మ‌రింత వివాదంగా మారింది.  వీరిని తాము అడ్డుకోబోమని హరిద్వార్ పోలీసులు స్పష్టం చేశారు.

ఏంటీ వివాదం..

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఓ మైనర్‌తో సహా కొందరు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. వీరు ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి నిరసన తెలుపుతున్నారు. అయితే.. వీరి ఆందోళ‌న‌పై అటు కేంద్రం కానీ.. ఇటు ఫెడ‌రేష‌న్ కానీ.. పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో ఇటీవ‌ల నూన‌త పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని ప్రారంభించే స‌మ‌యంలో అక్క‌డే నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇది తీవ్ర వివాదంగా మారి.. అరెస్టుల వ‌రకు దారితీసింది.

బ్రిజ్ భూషణ్‌‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ తదితరులు ఆరోపిస్తున్నారు. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని  డిమాండ్ చేస్తున్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారాల త‌ర‌బ‌డి ధర్నా చేస్తున్నారు. వీరికి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, రెజ్లర్లు హరిద్వార్‌లోని గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తామ‌ని చెప్పారు.

ఈ పతకాలు తమ ప్రాణమని, తమ ఆత్మ అని రెజ్ల‌ర్లు చెప్పారు. వీటిని గంగా నదిలోకి విసిరేసిన తర్వాత జీవించి ఉండటంలో అర్థం లేదన్నారు. వీటిని గంగా నదిలో కలిపేసిన తర్వాత తాము ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. అయితే.. హరిద్వార్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ మాట్లాడుతూ, రెజ్లర్లు తమకు నచ్చిన పని చేయవచ్చునని తెలిపారు. పవిత్రమైన గంగా నదిలో వారు తమ పతకాలను నిమజ్జనం చేసేందుకు వస్తే, తాము వారిని ఆపబోమని తెలిపారు. 

This post was last modified on May 31, 2023 8:28 am

Share

Recent Posts

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

56 minutes ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

2 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

4 hours ago