దేశాన్ని.. ముఖ్యంగా తెలంగాణను భారీ రేంజ్లో కుదిపేసిన.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటివరకు తెలంగాణ సీఎం కుమార్తె, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసేస్తారనే వార్తలు వచ్చేశాయి. దీంతో ఇది పెను సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఈ కేసులో సీబీఐ సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేసిన సీబీఐ.. దానిలో ఎక్కడా కవిత పేరును ప్రస్తావించలేదు.
ఈ ఛార్జ్షీట్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమనాదీప్ ధల్లపై అభియోగాలు మోపింది. అయితే ఈ ఛార్జ్షీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా కనిపించలేదు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవా..? లేకుంటే మరేదైనా కారణమా..? అని ఢిల్లీ వేదికగా చర్చలు నడుస్తున్నాయి. గతానికి భిన్నంగా సీబీఐ తాజా ఛార్జ్షీటులో ఎక్కడా కవిత పేరు కనపడకపోవడం.. రాష్ట్రంలోనూ ఆసక్తిగా మారింది.
నిజానికి ఇప్పటికి చాలా సార్లు సీబీఐ కవితను ప్రశ్నించింది. హైదరాబాద్లో ఆమె ఇంటికి ఒకసారి.. తర్వాత ఢిల్లీలో మూడు సార్లు కవితను ప్రశ్నించింది. ఒక దశలో ఆమె అరెస్టు కూడా ఖాయమని అనుకున్నారు. అయితే.. కవితను అన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు సీబీఐ ప్రశ్నించిన వారి జాబితాలో కూడా కవిత పేరు లేకపోవడం గమనార్హం. దీంతో కవితకు దాదాపు క్లీన్ చిట్ వచ్చినట్లేనని రాజకీయ నేతలు భావిస్తున్నారు.
ఇక, మనీష్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్దీప్ ధల్లకు మాత్రం ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్- 25న సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఇవాళ విచారణకు రాగా కవిత పేరు లేదనే విషయం వెలుగుచూసింది. సుదీర్ఘ విచారణ అనంతరం తదుపరి విచారణ జూన్-2కి కోర్టు వాయిదా వేయడం గమనార్హం.
This post was last modified on May 28, 2023 9:53 am
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…
కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…
మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…