Political News

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. క‌విత‌కు సీబీఐ ట్విస్ట్

దేశాన్ని.. ముఖ్యంగా తెలంగాణ‌ను భారీ రేంజ్‌లో కుదిపేసిన‌.. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టివ‌ర‌కు తెలంగాణ సీఎం కుమార్తె, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌ను అరెస్టు చేసేస్తార‌నే వార్త‌లు వ‌చ్చేశాయి. దీంతో ఇది పెను సంచ‌ల‌నంగా మారింది. అయితే.. తాజాగా ఈ కేసులో సీబీఐ సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై శనివారం  ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో  అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖ‌లు చేసిన సీబీఐ.. దానిలో ఎక్క‌డా క‌విత పేరును ప్ర‌స్తావించ‌లేదు.

ఈ ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమనాదీప్ ధల్‌లపై అభియోగాలు మోపింది.  అయితే ఈ ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా కనిపించలేదు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవా..? లేకుంటే మరేదైనా కారణమా..? అని ఢిల్లీ వేదికగా చర్చలు నడుస్తున్నాయి.  గతానికి భిన్నంగా సీబీఐ తాజా ఛార్జ్‌షీటులో ఎక్కడా కవిత పేరు కనపడక‌పోవ‌డం.. రాష్ట్రంలోనూ ఆస‌క్తిగా మారింది.

నిజానికి ఇప్ప‌టికి చాలా సార్లు సీబీఐ క‌విత‌ను ప్ర‌శ్నించింది. హైద‌రాబాద్‌లో ఆమె ఇంటికి ఒక‌సారి.. త‌ర్వాత ఢిల్లీలో మూడు సార్లు క‌విత‌ను ప్ర‌శ్నించింది. ఒక ద‌శ‌లో ఆమె అరెస్టు కూడా ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే.. కవితను అన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు సీబీఐ ప్రశ్నించిన వారి జాబితాలో కూడా కవిత పేరు లేకపోవడం గమనార్హం. దీంతో కవితకు దాదాపు క్లీన్ చిట్ వచ్చినట్లేనని రాజ‌కీయ నేత‌లు భావిస్తున్నారు.

ఇక‌,  మనీష్ సిసోడియా, అర్జున్ పాండే, బుచ్చిబాబు, అమన్‌దీప్ ధల్‌లకు మాత్రం ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్- 25న సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఇవాళ విచారణకు రాగా కవిత పేరు లేదనే విషయం వెలుగుచూసింది. సుదీర్ఘ విచారణ అనంతరం తదుపరి విచారణ జూన్-2కి కోర్టు వాయిదా వేయ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

46 minutes ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

2 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

3 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

3 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

4 hours ago

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…

5 hours ago