ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ పై టీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం స్టే సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంలో తాజాగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంపై సుప్రీంలో జరిగిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గంగిరెడ్డి విడుదల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం తాజాగా స్టే జారీ చేసింది.
దీంతో.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ మీద విడుదలకు అవకాశాలు మూసుకుపోయినట్లుగా చెప్పాలి. వివేకా హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెప్పిన తెలంగాణ హైకోర్టు.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలని ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను ఆమె సవాలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వేసవి సెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది.
జస్టిస్ పీఎస్ నరసింహ.. జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడిన ధర్మాసనం ఎదుట సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వాదనలు వినిపించగా.. గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలని ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రపంచంలో 8వ వింతను తలపిస్తున్నాయని సీబీఐ తరఫున న్యాయవాది వ్యాఖ్యలు చేయటమే కాదు..
ఇలాంటివి తామెప్పుడూ వినలేదన్నారు. పిటిషనర్ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను తాము సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని గంగిరెడ్డి తరఫు న్యాయవాది చెప్పగా.. ఈ రోజు దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా గంగిరెడ్డి విడుదల అంశంలోతెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది.
This post was last modified on May 26, 2023 11:08 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…