ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ పై టీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం స్టే సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంలో తాజాగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంపై సుప్రీంలో జరిగిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గంగిరెడ్డి విడుదల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం తాజాగా స్టే జారీ చేసింది.
దీంతో.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ మీద విడుదలకు అవకాశాలు మూసుకుపోయినట్లుగా చెప్పాలి. వివేకా హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెప్పిన తెలంగాణ హైకోర్టు.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలని ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను ఆమె సవాలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వేసవి సెలవుల ధర్మాసనం విచారణ చేపట్టింది.
జస్టిస్ పీఎస్ నరసింహ.. జస్టిస్ పంకజ్ మిత్తల్ తో కూడిన ధర్మాసనం ఎదుట సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వాదనలు వినిపించగా.. గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలని ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రపంచంలో 8వ వింతను తలపిస్తున్నాయని సీబీఐ తరఫున న్యాయవాది వ్యాఖ్యలు చేయటమే కాదు..
ఇలాంటివి తామెప్పుడూ వినలేదన్నారు. పిటిషనర్ సునీత దాఖలు చేసిన పిటిషన్ ను తాము సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని గంగిరెడ్డి తరఫు న్యాయవాది చెప్పగా.. ఈ రోజు దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా గంగిరెడ్డి విడుదల అంశంలోతెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది.
This post was last modified on May 26, 2023 11:08 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…