జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరిపాలన భవనాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ఆదివారం సాయంత్రం వరకు పవన్ కల్యాణ్ అమరావతిలోనే బస చేయనున్నట్లు జనసేన నేతలు వెల్లడించారు. ఈ రెండు రోజులు పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్లు, ప్రైవేట్ మీటింగుల కోసం కేటాయించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎవరెవరితో భేటీ కానున్నారనే అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే పవన్ భేటీ అంశం మా త్రం అటు పార్టీ వర్గాలతో పాటు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పవన్ దూకుడును పెంచాడు. గతం కొంత కాలంగా పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అక్కడి స్థానికులు, నేతలతో భేటీలు నిర్వహిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చలు చేపడుతున్నారు. అందు కోసమే పవన్ కల్యాణ్ ఆయా వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్త నుంచి పార్టీలో ముఖ్య నేతల వరకు అందరిని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరులో వలసలను ప్రోత్సహిం చే విషయంపైనా.. జనసేన దృష్టి పెట్టనుంది. ఇదిలావుంటే, 26న అంటే శుక్రవారం అమరావతిలో జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో ఇక్కడ పవన్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
This post was last modified on May 26, 2023 11:30 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…